AI Tools: ‘ఏఐ టూల్స్తో అసభ్య కంటెంట్’.. లోపాలు గుర్తించానంటున్న మైక్రోసాఫ్ట్ ఉద్యోగి!
AI Tools: అత్యాధునిక ఏఐ టూల్స్ వల్ల హానికర, అభ్యంతరకర కంటెంట్ క్రియేట్ అవుతోందని మైక్రోసాఫ్ట్ ఉద్యోగి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కోపైలట్లో తాను పలు లోపాలను గుర్తించినట్లు వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: కృత్రిమ మేధ (Artificial Intelligence- AI) ఆధారిత సాంకేతికతలు ఇప్పుడు టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. ఈ అత్యాధునిక టెక్నాలజీ వల్ల లాభాలతో పాటు నష్టాలూ ఉంటాయనే చర్చ జరుగుతోంది. మరోవైపు దీన్ని దుర్వినియోగం చేస్తే తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయనే హెచ్చరికలూ వస్తున్నాయి. ఈ తరుణంలో మైక్రోసాఫ్ట్ (Microsoft) ఉద్యోగి షేన్ జోన్స్ రాసిన లేఖ తాజాగా చర్చనీయాంశంగా మారింది. కంపెనీకి చెందిన ఏఐ ఇమేజ్ జనరేషన్ టూల్ అసభ్యకర కంటెంట్ సృష్టికి దారితీస్తోందని ఆయన ఆరోపించారు. దీన్ని అరికట్టేందుకు సంస్థ తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ మేరకు ఆయన కంపెనీ బోర్డుతో పాటు ‘ఫెడరల్ ట్రేడ్ కమిషన్’, చట్ట సభ్యులకు లేఖ రాశారు.
ఓపెన్ఏఐకి చెందిన సరికొత్త DALL-E ఇమేజ్ జనరేటర్ మోడల్లో భద్రతాపరమైన లోపాన్ని కనుగొన్నట్లు షేన్ జోన్స్ వెల్లడించారు. ఇది హానికరమైన చిత్రాలను సృష్టించకుండా టూల్లో ఏర్పాటు చేసిన కట్టుబాట్లను దాటవేయడానికి అనుమతించినట్లు తెలిపారు. DALL-E మోడల్ను కో-పైలట్ డిజైనర్ సహా మైక్రోసాఫ్ట్కు చెందిన అనేక ఏఐ సాధనాలలో పొందుపర్చారు.
తాను గుర్తించిన విషయాలను మైక్రోసాఫ్ట్కు (Microsoft) నివేదించినట్లు జోన్స్ తెలిపారు. ఈ నేపథ్యంలో మరిన్ని భద్రతా ఏర్పాట్లను పొందుపర్చే వరకు కోపైలట్ను ఉపయోగంలో నుంచి తొలగించాలని కోరినట్లు వెల్లడించారు. హానికర చిత్రాలను సృష్టించేలా అంతర్గతంగా లోపాలున్నట్లు తెలిసినప్పటికీ.. దాని డిజైనర్ను కంపెనీ సురక్షితమైన టూల్గా ప్రమోట్ చేస్తోందన్నారు. రాజకీయపరమైన వివక్ష, మాదకద్రవ్యాల వినియోగం, మేధో హక్కుల ఉల్లంఘన, కుట్రపూరిత సిద్ధాంతాలు, మతపరమైన అంశాల్లోనూ కోపైలట్ అభ్యంతరకర కంటెంట్ను ఇస్తోందని తెలిపారు.
దీనిపై మైక్రోసాఫ్ట్ స్పందిస్తూ.. ఉద్యోగులు లేవనెత్తిన అన్ని ఆందోళనలను కంపెనీ నిబంధనల ప్రకారం పరిష్కరిస్తామని తెలిపింది. తమ అత్యాధునిక సాంకేతికతల భద్రతను మరింత మెరుగుపర్చడం కోసం ఉద్యోగులు చేస్తున్న అధ్యయనాన్ని ప్రశంసిస్తున్నట్లు పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది. -
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!