Anand Mahindra: హెడ్సెట్లు ధరించిన జాంబీలతో రూమ్ నిండిపోతుందా..?
యాపిల్ ఆవిష్కరించిన విజన్ ప్రో(Apple Vision Pro) సాంకేతికత ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra)ను ఆకట్టుకుంది. ట్విటర్ వేదికగా దానిపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
ముంబయి: ఎప్పటికప్పుడు సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. అనూహ్యమైన ఫీచర్లతో అబ్బరపడేలా చేస్తోంది. తాజాగా వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(WWDC) మొదటి రోజున సోమవారం ప్రముఖ టెక్ సంస్థ యాపిల్.. విజన్ ప్రో(Apple Vision Pro)ను ఆవిష్కరించింది. ఇది వర్చువల్, రియల్ ప్రపంచం మధ్య యూజర్లకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది. ఈ గాగిల్స్ పనితీరు వివరించే వీడియోను యాపిల్ సీఈఓ టిమ్కుక్(Tim Cook) ట్విటర్లో షేర్ చేశారు. ‘యాపిల్ విజన్ ప్రోతో ఇంతకుముందెన్నడూ చూడని స్పేషియల్ కంప్యూటింగ్ యుగానికి స్వాగతం’అంటూ కుక్ ఆ వీడియోకు వ్యాఖ్యను జోడించారు. ఇది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. దీనిపై ప్రముఖ వ్యాపారవేత ఆనంద్ మహీంద్రా( Anand Mahindra) స్పందించారు.
‘భారీ తెరలు కలిగిన టీవీలకు కాలం చెల్లినట్లేనని భావించాలా..? ఇప్పుడు శామ్సంగ్, సోనీ బోర్డ్రూమ్లు ఎలా స్పందిస్తాయో..? ఈ కొత్త సాంకేతికత వల్ల అందరూ కలిసి వీక్షించే సినిమాలు, మ్యాచ్ల పరిస్థితి ఏంటి..? ఇప్పుడు హెడ్సెట్లు ధరించిన జాంబీలతో రూమ్ నిండిపోతుందా..?’అని మహీంద్రా ట్వీట్ చేశారు. వెంటనే దీనిపై నెటిజన్లు స్పందించారు. జాంబీస్ ప్రపంచానికి స్వాగతమంటూ కామెంట్లు పెడుతున్నారు.
‘విజన్ ప్రో’గా (Apple Vision Pro) పేర్కొంటున్న ఈ గాగిల్స్ ధర 3,500 డాలర్లు. వచ్చే ఏడాది ఆరంభంలో ఇవి విక్రయానికి అందుబాటులోకి రానున్నాయి. ఈ గాగిల్స్లో 12 కెమెరాలు, ఆరు మైక్రోఫోన్లు, వివిధ రకాల సెన్సార్లు ఉన్నాయి. వీటిని ఉపయోగించి యూజర్లు కళ్లు, చేతులతోనే వివిధ రకాల యాప్లను నియంత్రించొచ్చు. ఇదిలా ఉంటే.. ఈ సాంకేతికతనే ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ ‘మెటావర్స్ (metaverse)’గా వ్యవహరిస్తున్నారు. ‘క్వెస్ట్’ పేరిట మెటా విక్రయిస్తున్న వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ (virtual reality headset)కు ఇప్పుడు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్