iPhone: లేటెస్ట్ ఐఫోన్ల కోసం వేచి చూడాల్సిందే!
చైనాలో విధించిన కరోనా కట్టడి ఆంక్షల వల్ల ఐఫోన్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు యాపిల్ తెలిపింది. ఫాక్స్కాన్ తయారీ కేంద్రంలో ఆంక్షల కారణంగా ఉత్పత్తి నెమ్మదించినట్లు పేర్కొంది. దీంతో లేటెస్ట్ ఐఫోన్ విక్రయాలు తగ్గే అవకాశం ఉందని తెలిపింది.
బీజింగ్: కొత్త ఐఫోన్ (iPhone) మోడళ్లు కొనుగోలు చేయాలనుకునేవారు కొంతకాలం వేచి చూడాల్సి రావొచ్చని యాపిల్ తెలిపింది. చైనాలో కరోనా కట్టడి ఆంక్షలు విధించడమే అందుకు కారణమని పేర్కొంది. జెంగ్ఝౌలోని ఫాక్స్కాన్ (Foxconn)కు చెందిన ఐఫోన్ (iPhone) తయారీ కేంద్రం పరిసరాల్లో ఆంక్షలు విధించినట్లు తెలిపింది. దీంతో కార్యకలాపాలు కనిష్ఠ సామర్థ్యానికి చేరుకున్నాయని పేర్కొంది.
ఫలితంగా ఐఫోన్-14 ప్రో (iPhone 14 Pro), ఐఫోన్-14 ప్రో మ్యాక్స్ (iPhone 14 Pro Max) సరఫరా అంచనాల కంటే ఆలస్యంగా జరుగుతోందని యాపిల్ తెలిపింది. అందువల్ల కొత్త ఫోన్ కొనాలనుకునేవారు ఎక్కువ కాలం వేచి ఉండాల్సి రావొచ్చని పేర్కొంది. ఫాక్స్కాన్ (Foxconn) ప్లాంట్లో వైరస్ కేసులు నమోదుకావడంతో గతకొంత కాలంగా అక్కడ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇటీవల ప్లాంటు వెలుపలి పరిసరాల్లో కూడా కేసులు రావడంతో అక్కడి స్థానిక ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్లాంటు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ ఆంక్షల పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో ఐఫోన్ సరఫరా, కార్మికుల కదలికలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
కరోనా వ్యాప్తిని అరికట్టి తయారీని పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు ఫాక్స్కాన్ తెలిపింది. అందుకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని జెంగ్ఝౌ స్థానిక ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు పేర్కొంది. అలాగే కార్మికుల భద్రత, ఆరోగ్యాన్ని సంరక్షిస్తూనే ఉత్పత్తిని సాధారణ స్థాయికి తీసుకొచ్చేందుకు ఫాక్స్కాన్తో కలిసి పనిచేస్తున్నట్లు యాపిల్ సైతం పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్