MCLRను పెంచిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా

ఆర్‌బీఐ 35 బేసిస్‌ పాయింట్ల రెపో రేటు పెంపుతో, అనేక బ్యాంకులు తమ రుణ రేట్లను పెంచడానికి సిద్ధమయ్యాయి.

Published : 10 Dec 2022 16:45 IST

దిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (Bank of baroda) తన మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేటు (MCLR)ను 25 బేసిస్‌ పాయింట్లు పెంచింది. బ్యాంకు బీఎస్‌ఈ ఫైలింగ్‌ ప్రకారం తాజా రుణ వడ్డీ రేట్లు 2022 డిసెంబరు 12 నుంచి అమల్లోకి వస్తాయి. 2022 డిసెంబరు 7న ఆర్‌బీఐ రెపో రేటును 35 బేసిస్‌ పాయింట్లు పెంచిన అనంతరం బీఓబీ కూడా తన MCLRను పెంచింది. ఒక సంవత్సరం కాలవ్యవధికి 8.05 నుంచి 8.30 శాతానికి పెంచింది. MCLR (మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌-బేస్డ్‌ లెండింగ్‌ రేటు) అనేది బ్యాంకులు ఖాతాదారులకు రుణాలు అందించే కనీస రేటు. వివిధ రకాల రుణాల వడ్డీ రేట్లను నిర్ణయించడానికి ఆర్‌బీఐ 2016లో MCLRను ప్రవేశపెట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని