అప్పు.. పెనుభారమవుతోంది
ఎలాంటి హామీ అవసరం లేకుండా బ్యాంకులు అందించే వ్యక్తిగత రుణాలు ఎంతోమందికి ప్రయోజనకరంగా ఉంటాయి. మిగతా రుణాలతో పోలిస్తే దీనికి వడ్డీ కాస్త ఎక్కువే.
వ్యక్తిగత రుణాలపై 20% మించిన వడ్డీ
దరఖాస్తుల తిరస్కరణా అధికంగానే
ఈనాడు, హైదరాబాద్: ఎలాంటి హామీ అవసరం లేకుండా బ్యాంకులు అందించే వ్యక్తిగత రుణాలు ఎంతోమందికి ప్రయోజనకరంగా ఉంటాయి. మిగతా రుణాలతో పోలిస్తే దీనికి వడ్డీ కాస్త ఎక్కువే. కొవిడ్ పరిణామాల తర్వాత ఆర్థిక వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉండటం, అన్ని రంగాలూ కోలుకోవడంతో రుణాలకు గిరాకీ పెరిగింది. అదే సమయంలో ప్రజల నగదు అవసరాలూ అధికమవుతున్నాయి. అందువల్లే ఎక్కువ వడ్డీ అయినా, వ్యక్తిగత రుణాల కోసం బ్యాంకులకు వెళ్తున్నారు. ఈ రుణ దరఖాస్తులను బ్యాంకులూ అంత వేగంగా ఆమోదించడం లేదు. క్రెడిట్రేటింగ్ బాగున్నవారికే ప్రాధాన్యమిస్తున్నాయి.
బంగారం హామీగా..
కొవిడ్ పరిణామాల్లో దెబ్బతిన్న చిరు వ్యాపారులు కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు అవసరమైన నగదు కోసం బంగారు ఆభరణాలను తనఖా పెట్టి, రుణాలు తీసుకున్నారు. 2021-22 చివరి త్రైమాసికంలో బ్యాంకుల రుణాల్లో అత్యధికం బంగారం తాకట్టు రుణాలే. తక్కువ వడ్డీ, సులువుగా అప్పు లభించడమే ఇందుకు కారణం. క్రెడిట్ స్కోరు, ఆదాయ ధ్రువీకరణలతో సంబంధం లేకపోవడమూ కలిసొచ్చింది. ఇప్పుడు ఈ రుణాలపైనా వడ్డీ రేట్లు పెరుగుతున్నందున, భారం అధికమవుతోంది.
నిధుల లభ్యత తగ్గడంతో..
రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటికీ లక్ష్యమైన 6% కంటే అధికంగానే ఉన్నందున, దీన్ని అదుపు చేసేందుకు ఆర్బీఐ రెపో రేటును పెంచుతూ పోతోంది. ప్రస్తుతం ఇది 5.90 శాతానికి చేరింది. రుణాలకు గిరాకీ 17 శాతానికి పైగా పెరగ్గా, ఆ స్థాయిలో డిపాజిట్లు రాకపోవడంతో బ్యాంకుల్లో నగదు లభ్యత తక్కువగా ఉంటోంది. ఇటీవల వరకు తక్కువ వడ్డీ ఉండటంతో చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్లకు బదులు అధిక ప్రతిఫలం వస్తుందనే భావనతో షేర్లు, డెట్ ఫండ్లలో మదుపు చేయడం ప్రారంభించారు. దీంతో బ్యాంకులు నిధుల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ల రేట్లను పెంచడం ప్రారంభించాయి. ఇవి 8 శాతానికి మించడంతో, రుణ రేట్లూ ఇంకా పెరిగే అవకాశాలుండటం చిరు రుణగ్రహీతలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది.
పెద్ద రుణాలపైనే
వడ్డీ రేట్లు పెరుగుతున్నందున బ్యాంకులు వాణిజ్య, గృహరుణాలు లాంటి పెద్ద రుణాలు ఇచ్చేందుకే ఆసక్తి చూపుతున్నాయి. పలు బ్యాంకులు తాము అందిస్తున్న వ్యక్తిగత రుణ రేట్లను అమాంతం పెంచేశాయి. కొన్ని బ్యాంకులు 16-21% వడ్డీకి ఈ రుణాలను ఇస్తున్నాయి. కొన్ని ఎన్బీఎఫ్సీల్లో 31% వరకు వడ్డీ ఉండగా.. వార్షిక వడ్డీ 49% అని చెబుతున్నవీ ఉన్నాయి.
తిరస్కరణే ఎక్కువ..
క్రెడిట్ స్కోరు 750కి పైగా ఉన్న వారికి రుణాలు ఇటీవల వరకు సులువుగానే లభించేవి. ఇప్పుడు క్రెడిట్ స్కోరు బాగున్నా రూ.5లక్షల లోపు రుణాలివ్వడానికి బ్యాంకులు ఇష్టపడటం లేదు. ఫిన్టెక్ సంస్థలు నిధుల కొరత ఎదుర్కొంటుండటంతో ఇవి ఇచ్చే రుణ వితరణ మొత్తం తగ్గింది. ద్రవ్యలభ్యత మెరుగు పడితేనే ఈ సమస్యలకు పరిష్కారం లభించే వీలుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్