అదానీ పోర్ట్స్ ఆడిట్ బాధ్యతల నుంచి డెలాయిట్ ఔట్..? ఆ లావాదేవీలే కారణమా?
Adani group: అదానీ గ్రూప్ ఆడిటింగ్ బాధ్యతల నుంచి డెలాయిట్ వైదొలగనుంది. త్వరలో దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
దిల్లీ: అదానీ గ్రూప్నకు (Adani group) చెందిన అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ (APSEZ) ఆడిటింగ్ వ్యవహారాలు చూస్తున్న డెలాయిట్.. ఆ బాధ్యతల నుంచి వైదొలగాలని నిర్ణయించిట్లు తెలుస్తోంది. ఆ కంపెనీకి సంబంధించిన కొన్ని లావాదేవీలపై కొన్నాళ్ల క్రితం డెలాయిట్ (Deloitte) ఆందోళన వ్యక్తంచేసింది. గతంలో ఇవే లావాదేవీల గురించి హిండెన్బర్గ్ సైతం తన నివేదికలో ప్రస్తావించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆడిటర్ బాధ్యతల నుంచి వైదొలగాలని డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ ఎల్ఎల్పీ నిర్ణయానికొచ్చినట్లు తెలిసింది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. డెలాయిట్ వైదొలగడానికి అసలు కారణమేంటనేది ఇప్పటికిప్పుడు తెలియరాలేదు. దీనిపై డెలాయిట్ స్పందించేందుకు నిరాకరించింది.
అదానీ పోర్ట్స్కు సంబంధించిన మూడు లావాదేవీలపై డెలాయిట్ ఈ ఏడాది మే నెలలో కొన్ని అభ్యంతరాలు లేవనెత్తింది. 2022-23 ఆర్థిక సంవత్సరం, నాలుగో త్రైమాసికానికి సంబంధించిన ఆడిటింగ్ రిపోరర్ట్లో ఈ మూడు లావాదేవీలను ప్రస్తావించింది. ఆ మూడు లావాదేవీలను కంపెనీకి సంబంధం లేని పార్టీలుగా పేర్కొంది. అయితే, దీన్ని నిరూపించేందుకు స్వతంత్ర బాహ్య పరిశీలన అవసరమని పేర్కొనగా.. అందుకు అదానీ గ్రూప్ నిరాకరించినట్లు డెలాయిట్ వెల్లడించింది. దీంతో తాము కంపెనీ ప్రకటనను ధ్రువీకరించలేమని తెలిపింది.
ఉల్లి ధరలు నియంత్రించడానికి కేంద్రం చర్యలు.. మార్కెట్లోకి బఫర్ స్టాక్
ఈ ఏడాది జనవరి 24న అదానీ గ్రూప్నకు సంబంధించి అమెరికాకు చెందిన హిండన్బర్గ్ రీసెర్చి సంస్థ ఓ నివేదిక వెల్లడించిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ స్టాక్ ధరల్లో మోసం, మనీ లాండరింగ్కు పాల్పడుతోందంటూ పలు ఆరోపణలు చేసింది. దీంతోపాటు అదానీ గ్రూప్ కంపెనీలకు సంబంధించిన కొన్ని లావాదేవీలనూ తన నివేదికలో ప్రస్తావించింది. అప్పట్లో ఆ ఆరోపణలను అదానీ గ్రూప్ తోసిపుచ్చింది. డెలాయిట్ కోరిన స్వతంత్ర బాహ్య పరిశీలనకు నిరాకరించింది. తమ గ్రూప్పై సెబీ దర్యాప్తు చేస్తున్నందున బాహ్య పరిశీలన అవసరం లేదని పేర్కొందంటూ డెలాయిట్ తెలిపింది. దీంతో ఏపీ సెజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో తమ ఆడిట్కు సంబంధించి తగిన సాక్ష్యాలు సమర్పించలేదంటూ డెలాయిట్ పేర్కొంది. మరోవైపు ఇప్పటికే సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ అదానీ గ్రూప్లో ఎలాంటి అవతవకలూ గుర్తించలేదని మధ్యంతర నివేదికలో పేర్కొనగా.. సెబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఆగస్టు 14లోగా నివేదిక సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో డెలాయిట్ రాజీనామా వ్యవహారం తెరపైకి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు త్వరలో 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. -
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు రెండు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరైంది. -
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్గా ముగిసిన సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంతో నిఫ్టీ 33.15 పాయింట్ల నష్టంతో ముగిశాయి. -
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
Indegene IPO: రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇండీజీన్ ఐపీఓ ప్రారంభమైంది. మదుపర్లు రూ.14,916తో కనీసం 33 షేర్లకు (ఒక లాట్) బిడ్లు దాఖలు చేయాలి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,511 దగ్గర కొనసాగుతోంది. -
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
Qantas: కాంటాస్ అనే ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్యాన్సిల్ అయిన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన అక్కడి నియంత్రణా సంస్థ రూ.550 కోట్ల జరిమానా విధించింది. -
3 ఐపీఓలు.. రూ.6,400 కోట్ల లక్ష్యం
ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండీజీన్, టీబీఓ టెక్ ఐపీఓలు వస్తున్నాయి. -
లాభాలకే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు. -
75,100 పైన మరిన్ని సానుకూలతలు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. -
పురుగు మందుల అవశేషాలపై భారత్లో కఠిన నిబంధనలు: ప్రభుత్వం
ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. -
గృహ రుణ బకాయిలు పెరిగాయ్: ఆర్బీఐ
గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికలు ముగిసే వరకు వాటికి నిధులు విడుదల చేయొద్దు: ఈసీ
-
ఇరాన్లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్కు చేరుకొన్న మత్స్యకారులు..!
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు