Trump Jr.: భారత్‌లో పర్యటించనున్న డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌..!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తనయుడు, ట్రంప్‌ సంస్థల ఉపాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌(Donald Trump Jr.) భారత్‌కు రానున్నారు. ఇక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని విస్తరించడంలో భాగంగా ఆయన ఈ నెలలోనే పర్యటించనున్నట్లు సమాచారం.

Published : 06 Dec 2022 23:38 IST

ముంబయి: అమెరికా(America) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తనయుడు, ట్రంప్‌ సంస్థల ఉపాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌(Donald Trump Jr.) భారత్‌కు రానున్నారు. ఇక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని విస్తరించడంలో భాగంగా ఆయన ఈ నెలలోనే పర్యటించనున్నట్లు సమాచారం. ముంబయి కేంద్రంగా ఉన్న ట్రైబెకా డెవలపర్స్‌(Tribeca Developers) భాగస్వామ్యంతో ట్రంప్‌ సంస్థ.. భారత మార్కెట్‌లోకి ప్రవేశించింది.

ట్రైబెకా సంస్థ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమంలో జూనియర్‌ ట్రంప్‌ పాల్గొనే అవకాశం ఉన్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ట్రంప్‌, ట్రైబెకా సంస్థలు భారత్‌లో ‘ట్రంప్‌’ బ్రాండ్‌ కింద లగ్జరీ ప్రాజెక్టుల నిర్మాణానికి లోధా గ్రూపు వంటి స్థానిక డెవలపర్లతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ మేరకు ఇప్పటికే నాలుగు లగ్జరీ ప్రాజెక్టులను ప్రకటించాయి. దిల్లీ, కోల్‌కతా, పుణె, ముంబయిలలో ‘ట్రంప్‌ టవర్‌’ల పనులు చేపట్టగా.. పుణెలో ఇప్పటికే పూర్తయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని