ఎల్ఐసీ లాభం రూ.683 కోట్లు
ప్రభుత్వరంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) జూన్ త్రైమాసికానికి రూ.682.89 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.2.94 కోట్లే కావడం గమనార్హం.
ముంబయి: ప్రభుత్వరంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) జూన్ త్రైమాసికానికి రూ.682.89 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.2.94 కోట్లే కావడం గమనార్హం. ఇదే సమయంలో తొలి ప్రీమియం వసూళ్లు రూ.5088 కోట్ల నుంచి రూ.7429 కోట్లకు పెరిగాయి. మొత్తం ఆదాయం రూ.1,54,153 కోట్ల నుంచి రూ.1,68,881 కోట్లకు పెరిగింది. అయితే ఈ ఏడాది జనవరి-మార్చి లాభం రూ.2371 కోట్లు, ఆదాయం రూ.2,11,451 కోట్లతో పోలిస్తే మాత్రం ఏప్రిల్-జూన్లో తగ్గాయి.
శాంసంగ్ వారసుడికి క్షమాభిక్ష
జైలు నుంచి విముక్తి
ఇక పూర్తి స్థాయిలో వ్యాపారంపై దృష్టి
సియోల్: దేశ మాజీ అధ్యక్షుడికి లంచం ఇచ్చిన కేసులో దోషిగా తేలి, జైలు శిక్ష ఎదుర్కొంటున్న శాంసంగ్ ఎలక్టాన్రిక్స్ వైస్ ఛైర్మన్ లీ జే యాంగ్కు దక్షిణ కొరియా ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. ప్రభుత్వ నిర్ణయంతో జే యాంగ్కు కేసు నుంచి విముక్తి లభించింది. జైలు శిక్ష నేపథ్యంలో విధించిన ఉద్యోగపరమైన ఆంక్షలు కూడా తొలగిపోనున్నాయి. త్వరలోనే యాంగ్ సామ్సంగ్ కంపెనీ బోర్డులో చేరి, పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టనున్నారు.
దేశావసరాల దృష్ట్యానే.. లంచం కేసులో 18 నెలల జైలు శిక్ష అనుభవించిన లీ జే యాంగ్కు.. కేసు నుంచి పూర్తిగా విముక్తి లభించింది. దేశ ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని జైల్లో ఉన్న వ్యాపార ప్రముఖులకు.. ఇలా కేసుల నుంచి విముక్తి కల్పించడం దక్షిణ కొరియాలో ఎప్పటినుంచో కొనసాగుతోంది. ఆగస్టు 15న దక్షిణ కొరియా లిబరేషన్ డే సందర్భంగా దాదాపు 1700 మంది దోషులకు అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ క్షమాభిక్ష పెట్టనున్నారు. ఇందులో జే యాంగ్తో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలు షిన్ డాంగ్ బిన్, ఛాంగ్ సే-జూ, కాంగ్ డూక్-సూ పేర్లు కూడా ఉన్నాయి.
ఇదీ జరిగింది..: 54 ఏళ్ల లీ జే యాంగ్.. శాంసంగ్ గ్రూప్ అధినేత లీ కున్ హీ పెద్ద కుమారుడు. ఆయనకు వారసుడైన యాంగ్, శాంసంగ్ ఎలక్టాన్రిక్స్ వైస్ ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. లంచం కేసులో 2017లో యాంగ్ అరెస్టయ్యారు. శాంసంగ్కు చెందిన రెండు అనుబంధ కంపెనీల విలీనానికి ప్రభుత్వం నుంచి అనుమతులు పొందేందుకు 2015లో అప్పటి దేశాధ్యక్షురాలు పార్క్ గ్వెన్ హైకు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై లీ జే యాంగ్ను అరెస్టు చేశారు. కేసును విచారించిన న్యాయస్థానం జే యాంగ్కు అయిదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కుంభకోణం బయటపడ్డాక, అప్పటి పార్క్ ప్రభుత్వం కూలిపోయింది. తనకు విధించిన శిక్షపై జే యాంగ్ అప్పిలేట్ కోర్టును ఆశ్రయించగా.. 2018లో కోర్టు ఈ శిక్షను తాత్కాలికంగా నిలిపేసింది. ఆ తర్వాత ఈ వ్యవహారం దక్షిణ కొరియా సుప్రీంకోర్టుకు చేరగా.. లీ జే యాంగ్కు రెండున్నర ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఇందులో భాగంగా 18 నెలలు జైలు శిక్ష అనుభవించిన ఆయన.. గతేడాది ఆగస్టులో పెరోల్పై బయటకు వచ్చారు. లంచం కేసు రీత్యా విధించిన ఆంక్షల కారణంగా ఇప్పటివరకు కంపెనీలో కీలక నిర్ణయాలు తీసుకునే బాధ్యతల నుంచి లీ జే యాంగ్ దూరమయ్యారు. (జైలులో ఉన్నా.. అక్కడి నుంచే శాంసంగ్ను నడిపించారని విమర్శకులు అంటుంటారు.) తాజాగా ఆయనకు క్షమాభిక్షతో త్వరలోనే తండ్రి వారసత్వాన్ని అందుకుని కంపెనీ పగ్గాలు చేపట్టే అవకాశముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువత మెచ్చేలా కొత్త పథకాలు
కెనరా బ్యాంకు కాసా (కరెంటు, సేవింగ్స్ ఖాతాల) డిపాజిట్లు పెంచుకునేందుకు విభిన్న పథకాలను ఆవిష్కరిస్తోంది. ఇందువల్ల డిపాజిట్ల వ్యయం తగ్గి, బ్యాంకు స్థిర వృద్ధికి తోడ్పడుతుందని అంచనా వేస్తోంది. -
ప్రవాసుల నుంచి రూ.9.20 లక్షల కోట్లు
ప్రవాసులు 2022లో మన దేశంలోని కుటుంబీకులు, సన్నిహితులకు 111 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9.2 లక్షల కోట్ల)ను బదిలీ చేశారు. వృత్తి, వ్యాపారాల నిమిత్తం ఒక దేశం నుంచి తరలి వెళ్లి, వివిధ దేశాల్లో నివశిస్తున్న వారు.. తమ స్వదేశానికి పంపిన అత్యధిక మొత్తం ఇదే. -
ఆద్యంతం ఒడుదొడుకులే
ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు బుధవారం స్తబ్దుగా ముగిశాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలతో ప్రైవేట్ బ్యాంకులు, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. -
8% వృద్ధికే అధిక అవకాశం
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24) భారత జీడీపీ వృద్ధి 8 శాతంగా నమోదయ్యేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ తెలిపారు. -
‘కొవిషీల్డ్’ టీకాను వెనక్కి తీసుకుంటున్న ఆస్ట్ర జెనేకా
పలు రకాల దుష్ఫలితాలు కనిపిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, మార్కెట్లో ఉన్న కొవిడ్-19 టీకాను వెనక్కి తీసుకోవాలని యూకే కంపెనీ ఆస్ట్రజెనేకా నిర్ణయించింది. -
ఆండ్రాయిడ్ మొబైల్లో గూగుల్ వాలెట్ యాప్
భారత్లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే మొబైల్స్ కోసం గూగుల్ వాలెట్ యాప్ను టెక్ దిగ్గజం గూగుల్ ఆవిష్కరించింది. బోర్డింగ్ పాసులు, లాయల్టీ కార్డులు, టికెట్లు, ప్రభుత్వ రవాణా పాసులు.. తదితరాలను భద్రంగా నిల్వ చేసుకునేందుకు ఈ వాలెట్ వీలు కల్పిస్తుంది. -
నగదు రుణాలు రూ.20వేల లోపే!
నగదు రూపంలో ఇచ్చే రుణాలు రూ.20వేలకు మించకుండా ఉండాలని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలు జారీ చేసిందని సమాచారం. నగదు లావాదేవీల విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆర్బీఐ పేర్కొందని తెలుస్తోంది. -
ఏప్రిల్లో శాకాహారం 8% ప్రియం
ఉల్లిపాయలు, టమోటాల ధరలు పెరగడంతో గత నెలలో వెజిటేరియన్ (శాకాహార) థాలీ సగటు ధర సుమారు 8% పెరిగిందని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనాలసిస్ నెలవారీ ‘రోటీ రైస్ రేట్’ నివేదిక వెల్లడించింది. -
400 మంది ఇంజినీర్ల నియామకాలు: కోటక్ బ్యాంక్
ఈ ఏడాది దాదాపు 400 మంది ఇంజినీర్లను నియమించుకునేందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్ సన్నాహాలు చేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తనిఖీల్లో వెలుగు చూసిన సాంకేతిక లోపాలు సరిదిద్దేందుకు, టెక్నాలజీ వ్యవస్థలను అప్గ్రేడ్ చేయాలని బ్యాంక్ భావిస్తోంది. -
10 కిలోల పెంపుడు జంతువు క్యాబిన్లోనే
తమ దేశీయ విమానాల క్యాబిన్లో 10 కిలోల లోపున్న పెంపుడు జంతువులను అనుమతిస్తున్నట్లు ఆకాశ ఎయిర్ ప్రకటించింది. ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకున్నాకే, ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు(7)
ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజ సంస్థ ఎల్అండ్టీ జనవరి- మార్చి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.4,396.12 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,986.78 కోట్లతో పోలిస్తే ఇది 10.2% అధికం. -
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
Akshaya Tritiya 2024: అక్షయ తృతీయకు బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే హాల్మార్కింగ్ను ఎలా చెక్ చేయాలో తెలుసా? -
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
తమ వెబ్సైట్లో వేసవి విహారం కోసం శోధించిన వాటి వివరాలను ప్రముఖ ఆన్లైన్ ట్రావెల్ సంస్థ మేక్మైట్రిప్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్