‘కొవిషీల్డ్‌’ టీకాను వెనక్కి తీసుకుంటున్న ఆస్ట్ర జెనేకా

పలు రకాల దుష్ఫలితాలు కనిపిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, మార్కెట్లో ఉన్న కొవిడ్‌-19 టీకాను వెనక్కి తీసుకోవాలని యూకే  కంపెనీ ఆస్ట్రజెనేకా నిర్ణయించింది.

Published : 09 May 2024 01:57 IST

దిల్లీ: పలు రకాల దుష్ఫలితాలు కనిపిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, మార్కెట్లో ఉన్న కొవిడ్‌-19 టీకాను వెనక్కి తీసుకోవాలని యూకే  కంపెనీ ఆస్ట్రజెనేకా నిర్ణయించింది. ఈ టీకాను ‘కొవిషీల్డ్‌’ పేరుతో మనదేశంలో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి చేసి, మనదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు పంపిణీ చేసింది. ఈ టీకా తీసుకున్న కొందరిలో రక్తం గడ్డ కట్టడం, ప్లేట్‌లెట్లు తగ్గిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తినట్లు ఇటీవల వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ విపణుల్లో కొన్ని టీకా డోసులు మిగిలిపోయినందున వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు ఆస్ట్ర జెనేకా వెల్లడించింది. కొవిడ్‌కు ఎన్నో రకాల టీకాలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చినందున తమ టీకాకు (వాక్స్‌జెర్‌వ్రియా) డిమాండ్‌ తగ్గిందని పేర్కొంది. టీకా ఉత్పత్తి, సరఫరాలను ఇప్పటికే నిలిపి వేసినట్లు వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు