ఆద్యంతం ఒడుదొడుకులే
ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు బుధవారం స్తబ్దుగా ముగిశాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలతో ప్రైవేట్ బ్యాంకులు, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.
సమీక్ష
ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు బుధవారం స్తబ్దుగా ముగిశాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలతో ప్రైవేట్ బ్యాంకులు, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. సార్వత్రిక ఎన్నికల 3 దశల్లో ఓటింగ్శాతం తక్కువగా నమోదైందనే వార్తల నడుమ, విదేశీ అమ్మకాలు కొనసాగడమూ ఇందుకు తోడైంది. డాలర్తో పోలిస్తే రూపాయి పైసా తగ్గి 83.52 వద్ద స్థిరపడింది. బ్యారెల్ ముడిచమురు 1.65% తగ్గి 81.79 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో సియోల్ లాభపడగా, మిగతావి నష్టపోయాయి. ఐరోపా సూచీలు మెరుగ్గా ట్రేడయ్యాయి.
సెన్సెక్స్ ఉదయం 73,225 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. అనంతరం కోలుకుని లాభాల్లోకి వచ్చిన సూచీ, 73,684.93 వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఆఖర్లో మళ్లీ అమ్మకాలు రావడంతో 45.46 పాయింట్ల నష్టపోయి 73,466.39 వద్ద ముగిసింది. నిఫ్టీ ఎటువంటి మార్పులేకుండా 22,302.50 దగ్గర స్థిరపడింది.
- మార్చి త్రైమాసికంలో లాభం 22.75% తగ్గడంతో వోల్టాస్ షేరు ఇంట్రాడేలో 9.13% కోల్పోయి రూ.1,261.65 వద్ద కనిష్ఠానికి చేరింది. చివరకు 4.99% నష్టంతో 1,319.10 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.2,294.68 కోట్లు తగ్గి రూ.43,647.01 కోట్లుగా నమోదైంది.
- సెన్సెక్స్ 30 షేర్లలో 15 నీరసించాయి. ఏషియన్ పెయింట్స్ 2.31%, అల్ట్రాటెక్ 1.76%, హెచ్యూఎల్ 1.65%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.61%, హెచ్సీఎల్ టెక్ 1.29%, బజాజ్ ఫైనాన్స్ 1.05%, ఇన్ఫోసిస్ 0.93% నష్టపోయాయి. టాటా మోటార్స్ 2.43%, పవర్గ్రిడ్ 2.25%, ఎన్టీపీసీ 1.89%, ఎల్ అండ్ టీ 1.53%, మారుతీ 1.41%, నెస్లే 1.19%, రిలయన్స్ 1.18% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో ఐటీ 0.57%, బ్యాంకింగ్ 0.38%, టెక్ 0.29% పడ్డాయి. ఇంధన, పరిశ్రమలు, యుటిలిటీస్, వాహన, లోహ, విద్యుత్, సేవలు రాణించాయి.
- నూలు, పత్తి బేళ్లు సరఫరా చేసే పియోటెక్ ఇండస్ట్రీస్ ఐపీఓ ఈనెల 10న ప్రారంభమై 14న ముగియనుంది. ఒక్కో షేరు ధరను రూ.94గా నిర్ణయించారు. ఐపీఓ ద్వారా కంపెనీ రూ.14.47 కోట్లు సమీకరించనుంది. ఐపీఓ అనంతరం కంపెనీ షేర్లు బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్పై నమోదుకానున్నాయి. రిటైల్ మదుపర్లు కనీసం 1200 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి.
- భారత్లో అగ్రగామి పసిడి శుద్ధి సంస్థ తమ ప్లాట్ఫామ్పై పసిడి ఫ్యూచర్స్ ట్రేడింగ్ ప్రారంభించినట్లు బీఎస్ఈ విభాగమైన ఇండియా ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజీ (ఇండియా ఐఎన్ఎక్స్) వెల్లడించింది. పసిడి శుద్ధి సంస్థ పేరును ఎక్స్ఛేంజీ తెలపలేదు.
- కేరళకు చెందిన ఏఆర్ఎంసీ ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్ను సీకే బిర్లా గ్రూప్ సంస్థ బిర్లా ఫెర్టిలిటీ అండ్ ఐవీఎఫ్, వెల్లడించని మొత్తానికి కొనుగోలు చేసింది. తద్వారా దక్షిణాది విపణిలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం బిర్లా ఫెర్టిలిటీకి దేశవ్యాప్తంగా 30 కేంద్రాలు ఉన్నాయి. తాజా కొనుగోలుతో ఇవి 37కు చేరాయి.
- కొత్త కనిష్ఠాలకు పేటీఎం షేరు: వరుసగా మూడో రోజూ పేటీఎం షేర్లు లోయర్ సర్క్యూట్ను తాకాయి. కంపెనీ అధ్యక్షుడు, చీఫ్ ఆపరేటింగ్ అధికారి భవేశ్ గుప్తా రాజీనామా చేయడమే ఇందుకు నేపథ్యం. బుధవారం 5% క్షీణించిన షేరు రూ.317.45 వద్ద జీవనకాల కనిష్ఠాన్ని తాకి, అక్కడే ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.20,180.46 కోట్లకు పరిమితమైంది. గతేడాది అక్టోబరు 20న రూ.998.30 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకిన షేరు, అక్కడి నుంచి 68% క్షీణించింది. గత మూడు రోజుల్లో షేరు 14% కోల్పోయింది. 2021 నవంబరులో షేరు రూ.2150 చొప్పున విక్రయించడం ద్వారా, పబ్లిక్ ఇష్యూలో రూ.18,300 కోట్లను పేటీఎం సమీకరించింది. అదే నెల 18న స్టాక్ఎక్స్ఛేంజీల్లో నమోదు సమయం నాటి రూ.1961.05 ధరే ఇప్పటివరకు గరిష్ఠం. ఈ ఏడాది ఫిబ్రవరి 16న నమోదైన రూ.318.35 ఇంతకుముందు వరకు కనిష్ఠం
- బీఓబీ వరల్డ్ యాప్పై ఆంక్షల తొలగింపు: బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన ‘బీఓబీ వరల్డ్’ యాప్ ద్వారా కొత్త వినియోగదారులను చేర్చుకోకుండా గతంలో విధించిన ఆంక్షలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం తొలగించింది. నియంత్రణపరమైన ఉల్లంఘనల కారణంగా 2023 అక్టోబరు 10న ఈ ఆంక్షలను ఆర్బీఐ విధించింది.
- ఇండీజీన్ ఐపీఓ చివరి రోజు ముగిసేసరికి 69.71 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 2,88,66,677 షేర్లను ఆఫర్ చేయగా, 2,01,22,03,281 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. క్యూఐబీ విభాగంలో 197.55 రెట్లు, ఎన్ఐఐల నుంచి 54.75 రెట్లు, రిటైల్ మదుపర్ల నుంచి 7.68 రెట్ల స్పందన దక్కింది.
- పెట్రోరసాయనాలు, హైడ్రోజన్ తయారీ కార్యకలాపాలు సాగిస్తున్న అనుబంధ సంస్థ రిలయన్స్ కెమికల్స్ అండ్ మెటీరియల్స్ను రూ.31.48 కోట్లకు కొనుగోలు చేసినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది.
నేటి బోర్డు సమావేశాలు: ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్, బీపీసీఎల్, ఐఓబీ, హెచ్పీసీఎల్, అబాట్ ఇండియా, ఎస్కార్ట్స్ కుబోటా, కేర్ రేటింగ్స్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టాటా మోటార్స్ పెట్టుబడులు రూ.43,000 కోట్లు!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ పెట్టుబడుల ప్రణాళికను టాటా మోటార్స్ గ్రూప్ మరింత పెంచుకుంది. -
జీడీపీ వృద్ధి 6.7శాతం!
గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదు కావొచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది. -
కృత్రిమ మేధపై వ్యయాలు మూడింతలు
మన దేశంలో కృత్రిమ మేధ (ఏఐ)పై వ్యయాలు 2027 నాటికి మూడింతలు పెరిగి 5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.41,500 కోట్ల)కు చేరొచ్చని ఇంటెల్-ఐడీసీ నివేదిక వెల్లడించింది. -
వ్యాపార వృద్ధిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు అగ్రస్థానం
గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)ల మొత్తం వ్యాపారం, డిపాజిట్ల సేకరణలో అధిక వృద్ధిరేటును బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) నమోదు చేసింది. -
2024లో ఈక్విటీ ఫండ్లలోకి రూ.1.3 లక్షల కోట్లు
దేశీయ ఈక్విటీ మార్కెట్లపై మ్యూచువల్ ఫండ్లు (ఎంఎఫ్) ఎంతో నమ్మకం ఉంచుతున్నాయి. ఈ ఏడాది (2024)లో ఇప్పటికే సుమారు రూ.1.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం ఇందుకు నిదర్శనం. -
మేమూ వినియోగించుకునే అవకాశమివ్వండి
విమాన ఇంధన (ఏటీఎఫ్) సరఫరా, నిల్వ కోసం ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు వినియోగించుకుంటున్న పైపులైన్లు, నిల్వ కేంద్రాలను తమకూ అందుబాటులోకి తేవాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ప్రభుత్వాన్ని కోరింది. -
పసుపు కిందకు!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.74,412 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్కు మరిన్ని చిక్కులు
అగ్రగామి మసాలా బ్రాండ్లు ఎండీహెచ్, ఎవరెస్ట్లకు చెందిన మసాలా పొడుల ఉత్పత్తుల్లో నాణ్యతా లోపాలపై దర్యాప్తు చేస్తున్నట్లు న్యూజిలాండ్ ఆహార భద్రతా సంస్థ వెల్లడించింది. -
చైనా స్థిరాస్తి రంగానికి ఊరట
దీర్ఘకాలంగా క్షీణిస్తున్న స్థిరాస్తి రంగాన్ని ఆదుకోవడానికి చైనా చర్యలు ప్రకటించింది. అమ్ముడుపోని గృహాలను, భూములను తిరిగి కొనుగోలు చేయడానికి వందల కోట్ల డాలర్లను కేటాయించింది. -
భారత్ వృద్ధి 6.6%
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) లో భారత ఆర్థిక వ్యవస్థ 6.6% వృద్ధి రేటును నమోదు చేయొచ్చని మూడీస్ రేటింగ్స్ అంచనా వేసింది. -
సంక్షిప్త వార్తలు
ఎడ్టెక్ సంస్థ బైజూస్ సలహా మండలి నుంచి ఎస్బీఐ మాజీ ఛైర్మన్ రజనీశ్ కుమార్, ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మోహన్దాస్ పాయ్ వైదొలగనున్నారు. -
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
Mobile Apps: స్మార్ట్ఫోన్ వినియోగదారులు కచ్చితంగా భద్రతకు ప్రాధాన్యమివ్వాలి. యాప్ను డౌన్లోడ్ చేసుకునే ముందు యాప్ స్టోర్, గోప్యతా విధానాలు, డేటా సేకరణ, సమీక్షలు, మానిటైజేషన్ పద్ధతులు, వివిధ అనుమతుల వంటి అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..