ముందస్తు చెల్లింపులు చేసిన గంటల్లోనే స్పెక్ట్రమ్ కేటాయిస్తూ లేఖ
స్పెక్ట్రమ్ కోసం ముందస్తు చెల్లింపులు చేసిన గంటల వ్యవధిలోనే, స్పెక్ట్రమ్ కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం నుంచి లేఖ అందిందని భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు,
సులభతర వ్యాపార ప్రక్రియపై సునీల్ మిత్తల్ ప్రశంసలు
దిల్లీ: స్పెక్ట్రమ్ కోసం ముందస్తు చెల్లింపులు చేసిన గంటల వ్యవధిలోనే, స్పెక్ట్రమ్ కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం నుంచి లేఖ అందిందని భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సునీల్ భారతీ మిత్తల్ తెలిపారు. ముందస్తు చెల్లింపు చేసిన రోజునే స్పెక్ట్రమ్ కేటాయింపు లేఖను ఇవ్వడం టెలికాం విభాగం (డాట్) చరిత్రలోనే ఇది తొలిసారి. ‘స్పెక్ట్రమ్ కోసం ఎయిర్టెల్ రూ.8,312.40 కోట్లు చెల్లించింది. నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో స్పెక్ట్రమ్ కేటాయిస్తూ గంటల వ్యవధిలోనే లేఖ ఇచ్చారు. ఇ బ్యాండ్ కూడా కేటాయించారు. సులభతర వ్యాపార ప్రక్రియ అద్భుతంగా అమలవుతోంద’ని మిత్తల్ తెలిపారు. ఇటీవలి వేలంలో దక్కించుకున్న స్పెక్ట్రమ్ కోసం టెలికాం విభాగానికి భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, అదానీ డేటా నెట్వర్క్స్, వొడాఫోన్ ఐడియాలు రూ.17,876 కోట్లు చెల్లించాయి. ‘30 ఏళ్లకు పైగా నా అనుభవంలో టెలికాం విభాగం నుంచి ఇంత వేగవంతమైన స్పందనను మొదటిసారి చూశాను. వ్యాపారం అంటే ఇలాగే ఉండాలి. ఇలాంటి మార్పులు దేశాన్ని మార్చేస్తాయి. అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే కలను సాకారం చేసేందుకు మరింత ఊతమిస్తాయ’ని మిత్తల్ అన్నారు. ముందస్తు చెల్లింపులు చేసిన ఇతర టెలికాం కంపెనీలకు కూడా స్పెక్ట్రమ్ కేటాయిస్తూ లేఖలను టెలికాం విభాగం జారీ చేస్తోంది. దీనిపై కేంద్ర టెలికాం మంత్రి అశ్వని వైష్ణవ్ స్పందిస్తూ ‘స్పెక్ట్రమ్ కేటాయింపు లేఖలు అందాక.. 5జీ సేవల ప్రారంభాన్ని వేగవంతం చేయాలని టెలికాం సంస్థలను కోరుతున్నట్లు’ తెలిపారు.
డాక్టర్లకు రూ.1000 కోట్లు ఇచ్చిన ‘డోలో’
రోగులకు తమ మాత్రలే రాసినందుకు తాయిలాలు
కంపెనీపై ఎఫ్ఎమ్ఆర్ఏఐ ఆరోపణలు
డోలో-650 మాత్రల తయారీ సంస్థపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) పలు ఆరోపణలు చేసింది. ఈ మాత్రలను రోగులకు రాసిన డాక్టర్లకు రూ.1,000 కోట్ల వరకు తాయిలాలను పంచిపెట్టిందని పేర్కొంది. ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రెప్రెజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎమ్ఆర్ఏఐ) - యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఎఫ్ఎమ్ఆర్ఏఐ తరఫు న్యాయవాది సంజయ్ పారిఖ్ మాట్లాడుతూ ‘డోలోను రాసేలా సదరు కంపెనీ ‘ఉచితాల’ కోసం పెట్టుబడులు పెట్టింద’ని బార్ అండ్ బెంచ్(బీ అండ్ బీ)ను ఉటంకిస్తూ పేర్కొన్నారు. ఈ విషయమై న్యాయవాది అపర్ణా భట్ ద్వారా ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) కోర్టులో దాఖలైన సంగతి తెలిసిందే. యూనిఫామ్ కోడ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్(యూసీపీఎమ్పీ) ద్వారా తమకు చట్టబద్ధ మద్దతు కావాలని ఆ పిల్ కోరింది. ఆరోగ్యంగా ఉండే హక్కు అనేది జీవించే హక్కులో భాగమేనని.. ఫార్మా కంపెనీలు నైతిక మార్కెటింగ్ విలువను పాటించాలని ఆ వ్యాజ్యంలో కోరినట్లు తెలుస్తోంది. ‘ఇది తీవ్రమైన సమస్య. ఇది నా చెవులకేమీ ఇంపుగా అనిపించడం లేదు. నాకు కొవిడ్ వచ్చినపుడు నన్నూ ఇవే మాత్రలు వేసుకోమన్నార’ని న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. ఈ అంశంపై 10 రోజుల్లోగా స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ అయ్యాయి. భారత్లో ఫార్మా మార్కెటింగ్ ధోరణులపై నియంత్రణ లేకపోవడంతో, అవినీతి చోటుచేసుకుంటోందని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్లో వీటిపై ఎటువంటి చట్టమూ లేదు. బ్రాండెడ్ ఔషధాలను ‘ఎక్కువగా రాసివ్వడం’ లేదంటే ‘హేతువిరుద్ధంగా ఇవ్వడం’ వల్ల రోగులే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని.. వారి ప్రాణాలకు, ఆరోగ్యానికి ఇది చేటు చేస్తుందని పిటిషనర్ వాదించారు. కాగా, ఇప్పటికే ప్రభుత్వం ఒక ముసాయిదా యూసీపీఎమ్పీని విడుదల చేసింది. విచారణ అనంతరం ప్రజల నుంచి త్వరలోనే స్పందనలను కోరనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.