రిలయన్స్‌ సెంట్రోకు శ్రీకారం

దేశీయ రిటైల్‌ దిగ్గజం రిలయన్స్‌ రిటైల్‌ తమ ఫ్యాషన్‌-లైఫ్‌స్టైల్‌ డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌ ‘రిలయన్స్‌ సెంట్రో’ను దిల్లీలోని వసంత్‌ కుంజ్‌లో మంగళవారం ప్రారంభించింది.

Published : 28 Sep 2022 02:15 IST

దిల్లీ: దేశీయ రిటైల్‌ దిగ్గజం రిలయన్స్‌ రిటైల్‌ తమ ఫ్యాషన్‌-లైఫ్‌స్టైల్‌ డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌ ‘రిలయన్స్‌ సెంట్రో’ను దిల్లీలోని వసంత్‌ కుంజ్‌లో మంగళవారం ప్రారంభించింది. మధ్యతరగతి, సంపన్న శ్రేణి కొనుగోలుదార్లకు అనువుగా రిలయన్స్‌ సెంట్రోను తీర్చిదిద్దినట్లు కంపెనీ తెలిపింది. 75,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన తొలి విక్రయశాలలో 300 బ్రాండ్లు, 20,000 స్టైల్‌ మోడళ్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. దుస్తులు, పాదరక్షలు, సౌందర్య ఉత్పత్తులు, లోదుస్తులు, లగేజీ, క్రీడా దుస్తులు, ఉపకరణాలకు సంబంధించిన 300 దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్లు ఇక్కడ లభిస్తాయని వివరించింది. ప్రారంభోత్సవ ఆఫర్‌ కింద, రూ.3,999 కొనుగోలుపై రూ.1,500, రూ.4,999 అంతకంటే ఎక్కువ కొనుగోలుపై రూ.2,000 తగ్గింపు ఇస్తున్నట్లు రిలయన్స్‌ రిటైల్‌ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని