ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ‘టాటా సంపన్న్‌’ ఉత్పత్తులు

టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌కు ఆహార దినుసుల విభాగమైన ‘టాటా సంపన్న్‌’.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల కోసం నూతన ఉత్పత్తులను ఆవిష్కరించింది.

Published : 25 Nov 2022 03:36 IST

ఈనాడు, హైదరాబాద్‌: టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌కు ఆహార దినుసుల విభాగమైన ‘టాటా సంపన్న్‌’.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల కోసం నూతన ఉత్పత్తులను ఆవిష్కరించింది. సాంబార్‌ మసాలా, పసుపు, కారం, ధనియాల పొడి ఇందులో ఉన్నాయి. టాటా సంపన్న్‌ నుంచి పప్పులు, నూనెలు, ఇతర నిత్యావసరాలు లభిస్తున్న విషయం విదితమే. టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ ప్రెసిడెంట్‌ (ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌) దీపికా భాన్‌ స్పందిస్తూ, దక్షిణ భారతదేశంలోని వినియోగదార్ల ఇష్టాలకు అనువైన మసాలా ఉత్పత్తులు తీసుకు వచ్చినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు