వెండిలో కొనుగోళ్లు!
పసిడి ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం రూ.53,924 కంటే పైన కదలాడితే సానుకూల ధోరణికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ రూ.53,381 కంటే దిగువన చలిస్తే రూ.53,327; రూ.53,114 వరకు దిద్దుబాటు కావచ్చు.
కమొడిటీస్ ఈ వారం
బంగారం
పసిడి ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం రూ.53,924 కంటే పైన కదలాడితే సానుకూల ధోరణికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ రూ.53,381 కంటే దిగువన చలిస్తే రూ.53,327; రూ.53,114 వరకు దిద్దుబాటు కావచ్చు. అమెరికా కీలక ఆర్థిక గణాంకాలు, ఇతర అంతర్జాతీయ పరిణామాలు పసిడి కాంట్రాక్టుకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
* ఎంసీఎక్స్ బుల్డెక్స్ డిసెంబరు కాంట్రాక్టు రూ.14,986 కంటే పైన కదలాడితే మరింతగా పెరగొచ్చు. అందువల్ల స్టాప్లాస్ను సవరిస్తూ లాంగ్ పొజిషన్లను అట్టేపెట్టుకోవచ్చు.
వెండి
వెండి మార్చి కాంట్రాక్టు రూ.64,325 కంటే కిందకు రాకుంటే కొనుగోళ్లను కొనసాగించొచ్చు. ఒకవేళ కిందకు వచ్చినా.. ధర తగ్గినప్పుడల్లా లాంగ్ పొజిషన్లు జతచేసుకోవడం మంచి వ్యూహమే అవుతుంది.
ప్రాథమిక లోహాలు
* రాగి డిసెంబరు కాంట్రాక్టు రూ.696 పైన కదలాడితే రూ.708; రూ.713.75 వరకు రాణించొచ్చు. ఒకవేళ రూ.679 కంటే కిందకు వస్తే.. దిద్దుబాటుకు ఆస్కారం ఉంటుంది.
* సీసం డిసెంబరు కాంట్రాక్టు రూ.184 దిగువన బలహీనంగా కన్పిస్తోంది. రూ.191 ఎగువన చలిస్తే మాత్రం.. మరింత పెరగొచ్చు.
* జింక్ డిసెంబరు కాంట్రాక్టు రూ.272 కంటే పైన కదలాడకుంటే.. షార్ట్ సెల్ పొజిషన్లు తీసుకోవడం మంచిదే. రూ.266; రూ.263 వరకు దిగివచ్చే అవకాశం ఉంది.
* అల్యూమినియం డిసెంబరు కాంట్రాక్టు రూ.207 దిగువన చలించకుంటే.. కొంత మేర రాణిస్తుంది. ఈ స్థాయి కంటే కిందకు వస్తే అమ్మకాల ఒత్తిడికి ఆస్కారం ఉంటుంది.
ఇంధన రంగం
* ముడి చమురు డిసెంబరు కాంట్రాక్టు రూ.6,275 కంటే దిగువన కదలాడకుంటే.. రూ.6,868; రూ.7,022 వరకు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ రూ.6,275 కంటే కిందకు వస్తే. రూ.6,135; రూ.5,933 వరకు దిద్దుబాటు కావచ్చు.
* సహజ వాయువు డిసెంబరు కాంట్రాక్టు రూ.466 కంటే దిగువన కదలాడకుంటే కొనుగోళ్లకు మొగ్గు చూపడం మంచిదే. ఒకవేళ పైకి వెళితే రూ.555 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయినీ అధిగమిస్తే.. రూ.580 వరకు పెరుగుతుంది.
వ్యవసాయ ఉత్పత్తులు
* పసుపు డిసెంబరు కాంట్రాక్టు రూ.7,008 కంటే దిగువన చలించకుంటే.. రెండు వారాల గరిష్ఠమైన రూ.7,550ను తాకే అవకాశం ఉంటుంది. రూ.7,008 కంటే కిందకు వస్తేనే షార్ట్ సెల్ పొజిషన్ల జోలికి వెళ్లాలి.
* జీలకర్ర డిసెంబరు కాంట్రాక్టు రూ.22,763- రూ.26,781 శ్రేణిలో చలించొచ్చు.
* ధనియాలు డిసెంబరు కాంట్రాక్టు రూ.9,246 కంటే దిగువన కదలాడితే మరింత దిద్దుబాటు అవ్వొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.