సంక్షిప్త వార్తలు (5)
ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లోని ఐటీ యూనిట్లలో పని చేస్తున్న ఉద్యోగులకు 2023 డిసెంబరు వరకు పూర్తి స్థాయిలో ఇంటి నుంచి పని (వర్క్ ఫ్రమ్ హోమ్) చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
100% ఇంటి నుంచి పనికి అనుమతి
ఎస్ఈజడ్ ఐటీ యూనిట్లలో ఉద్యోగులకే
దిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లోని ఐటీ యూనిట్లలో పని చేస్తున్న ఉద్యోగులకు 2023 డిసెంబరు వరకు పూర్తి స్థాయిలో ఇంటి నుంచి పని (వర్క్ ఫ్రమ్ హోమ్) చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సెజ్ల నిబంధనలను సవరించడంతో అక్కడి ఐటీ/ఐటీఈఎస్ యూనిట్లలోని ఉద్యోగులు వచ్చే ఏడాది డిసెంబరు 31 వరకు కొన్ని షరతులతో ఇంటి నుంచే పని చేసే అవకాశం లభించింది. తమ ఉద్యోగులకు ఆయా యూనిట్లు ఇంటి నుంచి పని చేసేందుకు లేదా సెజ్ బయటి నుంచి పని చేసేందుకు అనుమతి ఇస్తాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ల్యాప్ట్యాప్లు, డెస్క్టాప్లు, ఇతర పరికరాలను ఇంటి నుంచి పని చేసే ఉద్యోగులకు ఆయా యూనిట్లు అందించనున్నాయి. గతంలో సెజ్లోని ఐటీ యూనిట్లో పని చేస్తున్న ఉద్యోగులకు గరిష్ఠంగా ఒక ఏడాది, అందులోనూ గరిష్ఠంగా మొత్తం ఉద్యోగుల్లో 50% మందికి అవకాశం కల్పించారు. ప్రస్తుతం 100% ఉద్యోగులకు వచ్చే ఏడాది డిసెంబరు ఆఖరు వరకు ఈ సదుపాయం కల్పించారు.
సాంకేతిక అంకురాలతో శామ్సంగ్ జట్టు
దిల్లీ: దేశంలో తమ డిజిటల్ ప్రయాణాన్ని వేగవంతం చేసుకునేందుకు, ప్రభుత్వ డిజిటల్ ఇండియా అప్లికేషన్ల చుట్టూ ఉన్న సాంకేతికతలపై పని చేసే అంకురాలతో భాగస్వామ్యం కానున్నట్లు కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శామ్సంగ్ గురువారం వెల్లడించింది. యూపీఐ, డిజిలాకర్ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ), ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్మెంట్ నెట్వర్క్ (ఓసీఈఎన్), యూనిఫైడ్ హెల్త్ ఇంటర్ఫేస్ (యూహెచ్ఐ) వంటి సాంకేతికతలపై సహకరించడానికి అంకురాలను ఆహ్వానిస్తున్నట్లు శామ్సంగ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా అంకురాలు వాలెట్, హెల్త్, ఫిట్నెస్ వంటి డొమైన్లలో దేశంలోని శామ్సంగ్ ఆర్ అండ్ డీ కేంద్రాలు, వ్యాపార విభాగాలతో భాగస్వామ్యం కలిగి ఉంటాయని తెలిపింది. ఇక్కడ ఉత్పత్తులు, సేవలు కంపెనీతో అనుసంధానమై ఉంటాయని పేర్కొంది.
సొనాలికా ట్రాక్టర్స్ లక్ష విక్రయాల రికార్డు
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) మొదటి 8 నెలల్లో మొత్తం లక్ష ట్రాక్టర్లను విక్రయించినట్లు సొనాలికా ట్రాక్టర్స్ ప్రకటించింది. కంపెనీకి ఇది అత్యంత వేగవంతమైన విక్రయాలు కావడం విశేషం. 2021-22 ఏప్రిల్-నవంబరుతో పోలిస్తే కంపెనీ 11.2 శాతం వృద్ధిని సాధించింది. పరిశ్రమ వృద్ధి అంచనాలు 8.8 శాతాన్ని కూడా అధిగమించింది. వరుసగా ఆరేళ్ల(2017-18 నుంచి 2022-23) పాటు సొనాలికా లక్ష ట్రాక్టర్ విక్రయాలను నమోదు చేసింది. మొదటిసారిగా 2017-18లో కంపెనీ 12 నెలల్లో లక్ష విక్రయాల మైలురాయిని సాధించింది. కేవలం 8 నెలల్లోనే లక్ష విక్రయాలను అందుకోవడంపై ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ సంయుక్త ఎండీ రమణ్ మిత్తల్ హర్షం వ్యక్తం చేశారు.
ఇటలీ కంపెనీతో మిక్ ఎలక్ట్రానిక్స్ ఒప్పందం
హైదరాబాద్: ఇటలీకి చెందిన ఇంటరాక్టివ్ ఫుల్లీ ఎలక్ట్రికల్ వెహికల్స్(ఐ-ఎఫ్ఈవీఎస్)తో ప్రాథమిక అవగాహన ఒప్పందాన్ని(ఎమ్ఓయూ) ఇటీవల కుదుర్చుకున్నట్లు ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో హైదరాబాద్కు చెందిన మిక్ ఎలక్ట్రానిక్స్ గురువారం పేర్కొంది. దీని కింద ఐ-ఎఫ్ఈవీఎస్కు చెందిన విద్యుత్ ద్విచక్ర, త్రి చక్ర వాహనాలకు భారత్లో ఏకైక కాంట్రాక్ట్ తయారీ/అసెంబ్లీదారుగా మిక్ ఎలక్ట్రానిక్స్ వ్యవహరిస్తుంది.
* గోవా కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 8 దేశీయ గమ్యస్థానాలకు 168 వారం వారీ విమానాలను నడపనున్నట్లు ఇండిగో ప్రకటించింది. జనవరి 5 నుంచి ఈ విమానాశ్రయం వాణిజ్య కార్యకలాపాలను మొదలుపెట్టనుంది.
* ఎస్డబ్ల్యూఏఎమ్ఐహెఎచ్ ఇన్వెస్ట్ ఫండ్-1లోకి ప్రభుత్వం అదనంగా రూ.5,000 కోట్లను జొప్పించింది. తద్వారా ఒత్తిడిలో ఉన్న ఈ స్థిరాస్తి పెట్టుబడి ప్లాట్ఫామ్కు మద్దతిచ్చింది.
* భారత్ పే మాజీ ఎండీ, సహ వ్యవస్థాపకుడు అశ్నీర్ గ్రోవర్, ఆయన కుటుంబంపై రూ.88.67 కోట్లు కట్టాలంటూ ఆ ఆర్థిక సేవల సంస్థ దావా వేసింది.
* మహిళలకు రుణాలివ్వడం కోసం ఎస్వీ క్రెడిట్ లైన్తో ఇండస్ఇండ్ బ్యాంక్ సహ-రుణ ఒప్పందం కుదుర్చుకుంది.
* షేర్ల తిరిగి కొనుగోలు(బైబ్యాక్)ను చర్చించే ప్రతిపాదన కోసం డిసెంబరు 13న బోర్డు సమావేశం నిర్వహించనున్నట్లు పేటీఎమ్ గురువారం పేర్కొంది.
* దేశంలో తమ డిజిటల్ ప్రయాణాన్ని వేగవంతం చేసుకునేందుకు, ప్రభుత్వ డిజిటల్ ఇండియా అప్లికేషన్ల చుట్టూ ఉన్న సాంకేతికతలపై పని చేసే అంకురాలతో భాగస్వామ్యం కానున్నట్లు కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శామ్సంగ్ గురువారం వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం