100 సంస్థలు.. రూ.92.2 లక్షల కోట్లు
దేశీయంగా అగ్రశ్రేణి 100 సంస్థలు 2017-22 మధ్య కాలంలో ఏకంగా రూ.92.2 లక్షల కోట్ల సంపద సృష్టించాయని మోతీలాల్ ఓస్వాల్ నివేదిక పేర్కొంది.
2017-22 మధ్య సృష్టించిన సంపద ఇది
ఆర్ఐఎల్, అదానీ సంస్థలదే హవా
మోతీలాల్ ఓస్వాల్ నివేదిక
ముంబయి: దేశీయంగా అగ్రశ్రేణి 100 సంస్థలు 2017-22 మధ్య కాలంలో ఏకంగా రూ.92.2 లక్షల కోట్ల సంపద సృష్టించాయని మోతీలాల్ ఓస్వాల్ నివేదిక పేర్కొంది. 27వ ‘వార్షిక సంపద సృష్టి అధ్యయనం’లో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆ వివరాలు..
* ఇప్పటి వరకు సంప్రదాయ దిగ్గజంగా కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)ను మించి 2 అదానీ గ్రూప్ కంపెనీలు (అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ ట్రాన్స్మిషన్) 2022లో సంపదను సృష్టించాయి. 2017-22 మధ్య కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆర్ఐఎల్ అన్ని రికార్డులను తిరగరాసింది.
* గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీలు ఈ ఏడాదిలో బలమైన ర్యాలీ కనబరిచాయి. ఈ ర్యాలీతో సెప్టెంబరు 16న అదానీ ప్రపంచంలోనే అత్యంత ధనికుల జాబితాలో (ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్స్) 155.7 బిలియన్ డాలర్ల నికర విలువతో రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. అదే రోజున అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ ట్రాన్స్మిషన్లు రికార్డు గరిష్ఠాలను నమోదు చేశాయి. కాగా, ఎలాన్ మస్క్ 253.5 బి.డాలర్లతో ఆ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.
* పైన పేర్కొన్న 3 అదానీ కంపెనీల్లో అదానీకి 75% వాటా ఉంది. ఈ సంస్థల నుంచే 2022లో 70 బి.డాలర్ల సంపద అదానీకి లభించింది.
* ఆసియాలో అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్న ముకేశ్ అంబానీ స్థానాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో అదానీ దక్కించుకున్నారు. ఏప్రిల్ నాటికి 100 బి.డాలర్ల సంపద క్లబ్లో చేరారు. గత నెలలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో నాలుగో స్థానానికి ఎదిగారు. అదానీ టోటల్ గ్యాస్లో 37 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీలో 61 శాతం వాటా కూడా అదానీ చేతిలో ఉంది. 92.3 బి.డాలర్ల నికర విలువతో ముకేశ్ అంబానీ ప్రపంచ ధనికుల జాబితాలో 8వ స్థానంలో ఉన్నారు.
* 2017-22లో ఆర్ఐఎల్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ ఎంటర్ప్రైజెస్లు అతి పెద్ద, అత్యంత వేగవంత, స్థిరమైన సంపద సృష్టి చేసిన కంపెనీలుగా నిలిచాయి.
* సాంకేతిక రంగం అత్యధికంగా సంపద సృష్టించింది. దీని తర్వాత ఆర్థిక రంగం నిలిచింది.
* 2017-22 మధ్య సంపద సృష్టిలో రిలయన్స్ అగ్రస్థానంలో నిలిచింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్లు తర్వాత స్థానాల్లో నిలిచాయి. అత్యంత వేగంగా సంపద సృష్టించిన కంపెనీగా అదానీ ట్రాన్స్మిషన్ నిలిచింది. 106% వార్షిక సంచిత వృద్ధి రేటు (సీఏజీఆర్)తో వరుసగా రెండోసారి ఈ సంస్థ నిలిచింది. అత్యంత స్థిరమైన సంపద సృష్టిలో వరుసగా రెండోసారి అదానీ ఎంటర్ప్రైజెస్ స్థానం దక్కించుకుంది. గత 5 ఏళ్లుగా 97% సీఏజీఆర్తో సెన్సెక్స్ను మించి ఈ షేరు పెరిగింది.
* 8 ఏళ్ల విరామం తర్వాత సాంకేతిక రంగం అత్యధిక సంపద సృష్టి జాబితాలో నిలిచింది. ప్రభుత్వ రంగ కంపెనీలు పేలవమైన ప్రదర్శన కనబరిచాయి. ఈ రంగంలో గుజరాత్ గ్యాస్ ఒక్కటే సంపద సృష్టించడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్