2030కి 6 విద్యుత్ వాహనాలు
జపాన్కు చెందిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ 2030 ఆర్థిక సంవత్సరానికల్లా, భారత్లో 6 బ్యాటరీ విద్యుత్ వాహనాలను విడుదల చేస్తామని గురువారం వెల్లడించింది.
సుజుకీ మోటార్ కార్పొరేషన్
దిల్లీ: జపాన్కు చెందిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ 2030 ఆర్థిక సంవత్సరానికల్లా, భారత్లో 6 బ్యాటరీ విద్యుత్ వాహనాలను విడుదల చేస్తామని గురువారం వెల్లడించింది. కంపెనీ వృద్ధి వ్యూహంలో భాగంగా, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం 2070 నాటికి కర్బన రహిత స్థితికి చేరాలని అనుకుంటున్నట్లు పేర్కొంది. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి వృద్ధి వ్యూహాన్ని తమ భారతీయ అనుబంధ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా ద్వారా స్టాక్ ఎక్స్ఛేంజీలకు సుజుకీ మోటార్ తెలియజేసింది. బ్యాటరీ విద్యుత్ వాహనాలే కాకుండా సీఎన్జీతో నడిచే కర్బన రహిత ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ వాహనాలను, బయోగ్యాస్, ఇథనాల్ మిశ్రమ ఇంధన వినియోగంతో నడిచే వాహనాలను కూడా దేశీయ విపణిలో విడుదల చేస్తామని వెల్లడించింది. ఆటో ఎక్స్పో 2023లో ప్రకటించిన విద్యుత్తు ఎస్యూవీ ని 2024 ఆర్థిక సంవత్సరంలో విపణిలోకి తీసుకువస్తామని తెలిపింది. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి మొత్తం 6 బ్యాటరీ ఈవీలు అందుబాటులోకి వస్తాయని, అప్పటికి తమ వాహనాల్లో విద్యుత్తు విభాగ వాటా 15 శాతానికి, హైబ్రిడ్ విద్యుత్తు వాహనాల వాటా 25 శాతానికి చేరుతుందని వివరించింది.
బయోగ్యాస్పైనా ఆసక్తి: పశువుల పేడ నుపయోగించి ఉత్పత్తి చేసే బయోగ్యాస్ను కూడా సీఎన్జీ వాహనాల్లో ఇంధనంగా వాడొచ్చని, ఈ వ్యాపారంపైనా ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది. ఇది సాకారమైతే, గ్రామీణ ప్రాంత రైతులకూ మేలు కలుగుతుందని వివరించింది.
పెండింగ్ ఆర్డర్లు 4.05 లక్షలు: మారుతీ
దిల్లీ: స్థిరంగా ఆర్డర్లు వస్తుండటంతో, తాము డెలివరీ చేయాల్సిన (పెండింగ్లో ఉన్న) వాహనాల సంఖ్య 4.05 లక్షలకు పెరిగినట్లు మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి (మార్కెటింగ్, విక్రయాలు) శశాంక్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఇటీవల విడుదల చేసిన స్పోర్ట్స్ వినియోగ వాహనాలైన (ఎస్యూవీలు) జిమ్నీకి 11,000, ఫ్రోంక్స్కు 4,000 బుకింగ్లు వచ్చినట్లు వివరించారు. 2022 డిసెంబరు ఆఖరుకు కంపెనీ వద్ద 3.63 లక్షల వాహనాల పెండింగ్ ఆర్డర్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఈనెలలో ఇప్పటికే మరింత పెరిగాయి. 2022లో మారుతీ మొత్తం 15.76 లక్షల వాహనాలను విక్రయించింది. 2021లో అమ్మిన 13.64 లక్షల వాహనాలతో పోలిస్తే ఇవి 16 శాతం అధికం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్