బడ్జెట్ ముందు కొనుగోళ్లు
బడ్జెట్కు ముందు మదుపర్ల కొనుగోళ్లతో సూచీలు స్వల్పంగా రాణించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల ప్రకటన వెలువడనున్నందున, ఆచితూచి వ్యవహరించారు.
బడ్జెట్కు ముందు మదుపర్ల కొనుగోళ్లతో సూచీలు స్వల్పంగా రాణించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల ప్రకటన వెలువడనున్నందున, ఆచితూచి వ్యవహరించారు. డాలర్తో పోలిస్తే రూపాయి 36 పైసలు తగ్గి 81.88 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 1.18 శాతం నష్టంతో 83.90 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, ఐరోపా సూచీలు బలహీనంగా కదలాడాయి. సెన్సెక్స్ ఉదయం 59,770.83 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. వెంటనే నష్టాల్లోకి జారుకుని, 59,104.59 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం తర్వాత కోలుకున్న సెన్సెక్స్.. 49.49 పాయింట్ల లాభంతో 59,549.90 వద్ద ముగిసింది. నిఫ్టీ 13.20 పాయింట్లు పెరిగి 17,662.15 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,537.55- 17,735.70 పాయింట్ల మధ్య కదలాడింది.
* సెన్సెక్స్ 30 షేర్లలో 15 రాణించాయి. ఎం అండ్ ఎం 3.53%, అల్ట్రాటెక్ 2.96%, ఎస్బీఐ 2.85%, ఐటీసీ 2.21%, పవర్గ్రిడ్ 2.17%, టాటా మోటార్స్ 1.94%, టైటన్ 1.80%, ఎన్టీపీసీ 1.36%, ఐసీఐసీఐ బ్యాంక్ 1.03% చొప్పున మెరిశాయి. టీసీఎస్ 2.27%, బజాజ్ ఫైనాన్స్ 2.26%, టెక్ మహీంద్రా 2.01%, సన్ఫార్మా 1.51%, ఏషియన్ పెయింట్స్ 1.43%, హెచ్సీఎల్ టెక్ 1.03% నష్టపోయాయి.
* నేటి (ఫిబ్రవరి 1) నుంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు టీ+2 సెటిల్మెంట్ వ్యవస్థకు మారనున్నాయి.
* బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్పై ధరణి క్యాపిటల్ సర్వీసెస్ షేరు నమోదైంది.
* అమెరికా టవర్ కార్పొరేషన్కు రూ.1600 కోట్ల వరకు ఆప్షనల్లీ కన్వెర్టబుల్ డిబెంచర్లను జారీ చేసేందుకు వొడాఫోన్ ఐడియా బోర్డు ఆమోదం తెలిపింది. ఇందుకు అనుమతి కోరేందుకు ఫిబ్రవరి 25న కంపెనీ అసాధారణ వాటాదార్ల సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది.
* గనుల్లో వినియోగిస్తున్న 900కు పైగా డీజిల్ వాహనాల నుంచి విద్యుత్ వాహనాలకు మారేందుకు, వచ్చే అయిదేళ్లలో బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8,200 కోట్లు) పెట్టుబడులను వేదాంతా గ్రూప్ సంస్థ హిందుస్థాన్ జింక్ ప్రకటించింది.
నేటి బోర్డు సమావేశాలు
టాటా కెమికల్స్, అశోక్ లేలాండ్, బ్రిటానియా, అజంతా ఫార్మా, హిందుస్థాన్ కాపర్, యూటీఐ ఏఎంసీ, వర్ల్పూల్, జువారి అగ్రో కెమికల్స్, ఐడీఎఫ్సీ, రేమండ్, జిలెట్, ఆర్పీజీ లైఫ్ సైన్సెస్, ఆర్ఎస్ సాఫ్ట్వేర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్