అదానీ గ్రూప్ రూ.1.2 లక్షల కోట్ల పెట్టుబడులు
వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో రూ.1.2 లక్షల కోట్లు (దాదాపు 14 బి.డాలర్లు) పెట్టుబడులు పెట్టేందుకు గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ సిద్ధమవుతోంది. ఇంధన, విమానాశ్రయాలు, కమొడిటీస్, సిమెంట్, మీడియా సహా పలు గ్రూప్ కంపెనీల్లో ఈ పెట్టుబడులు పెట్టనుంది.
2024-25 ప్రణాళికలు
దిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో రూ.1.2 లక్షల కోట్లు (దాదాపు 14 బి.డాలర్లు) పెట్టుబడులు పెట్టేందుకు గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ సిద్ధమవుతోంది. ఇంధన, విమానాశ్రయాలు, కమొడిటీస్, సిమెంట్, మీడియా సహా పలు గ్రూప్ కంపెనీల్లో ఈ పెట్టుబడులు పెట్టనుంది. వచ్చే 7-10 ఏళ్లలో 100 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8.3 లక్షల కోట్ల) పెట్టుబడులు పెట్టాలనే ప్రతిపాదనలను అదానీ గ్రూప్ ఇంతకు ముందు వెల్లడించింది. ఇందులో ఎక్కువ భాగం పునరుత్పాదక ఇంధనం, హరిత హైడ్రోజన్, విమానాశ్రయ వ్యాపారాల్లో పెట్టనుంది. మూలధన వ్యయాల ప్రణాళికల ప్రకారం..70% పెట్టుబడులు పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎవాక్యూయేషన్ల్లో.. మిగతా 30% నిధులను విమానాశ్రయాలు, పోర్ట్ వ్యాపారాలకు వెచ్చించనున్నారు.
2023-24లో గ్రూప్ మూలధన వ్యయాలతో పోలిస్తే 2024-25 పెట్టుబడుల అంచనాలు 40% అధికమని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాలు దాదాపు 10 బిలియన్ డాలర్లు (సుమారు రూ.83,000 కోట్లు)గా ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
2023లో ఇలా: 2023లో గ్రూప్ కంపెనీలు 9.5 బిలియన్ డాలర్ల ఎబిటా (2022తో పోలిస్తే 34.4% ఎక్కువ) నమోదు చేశాయి. 2023 మార్చి నుంచి సెప్టెంబరు మధ్య నికర రుణాలు 4% తగ్గాయి. డిసెంబరు త్రైమాసికంలో అదానీ కంపెనీల ఎబిటా రికార్డు స్థాయిలో 63.6% పెరిగింది. దీంతో 2023లో ఎబిటా జీవనకాల గరిష్ఠమైన 9.5 బి.డాలర్లు(దాదాపు రూ.78,823 కోట్లు)గా నమోదైంది. నగదు నిల్వలు, లాభాలు పెరగడంతో గ్రూప్ భారీ పెట్టుబడులకు రంగం సిద్ధం చేస్తోందని సమాచారం. సెప్టెంబరుకు ఎబిటాతో పోలిస్తే నికర రుణాలు 2.5 రెట్లుగా ఉండగా, 2023-24 చివరకు ఇది మరింత తగ్గనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిమ్స్ హాస్పిటల్స్కు రూ.71.6 కోట్ల లాభం
కిమ్స్ హాస్పిటల్స్ (కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఏకీకృత ఖాతాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.637.6 కోట్ల ఆదాయాన్ని, రూ.71.6 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
261% పెరిగిన గెయిల్ లాభం
ప్రభుత్వ రంగ గెయిల్ ఇండియా గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,176.97 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని నమోదు చేసింది. -
వస్తువుల ఎగుమతులు రూ.41.5 లక్షల కోట్లకు!
మన దేశ వస్తువుల ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో 60-70 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.98-5.81 లక్షల కోట్ల) మేర పెరిగి 500 బి.డాలర్ల (సుమారు రూ.41.5 లక్షల కోట్లు)ను అధిగమించే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సమాఖ్య ఫియో (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్) అంచనా వేసింది. -
రూ.7,675 కోట్లకు పెరిగిన వొడాఫోన్ ఐడియా నష్టం
వొడాఫోన్ ఐడియా, మార్చి త్రైమాసికంలో రూ.7,675 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.6,419 కోట్ల నష్టాన్ని చవిచూసింది. -
నరేశ్ గోయెల్ భార్య అనిత కన్నుమూత
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయెల్ భార్య అనిత గోయెల్(70) గురువారం దక్షిణ ముంబయిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు. -
వినీత్ నయ్యర్ కన్నుమూత
టెక్ మహీంద్రా మాజీ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి అయిన వినీత్ నయ్యర్ (85) గురువారం ఉదయం దిల్లీలో మృతి చెందారు. -
కేశోరామ్ ఛైర్పర్సన్ మంజుశ్రీ ఖైతాన్ మృతి
కేశోరామ్ ఛైర్పర్సన్ మంజుశ్రీ ఖైతాన్(65) కన్నుమూశారని బీకే బిర్లా గ్రూప్ గురువారం ప్రకటించింది. అనారోగ్య కారణంగా కోల్కతాలోని ఆమె స్వగృహంలో తుదిశ్వాస విడిచారని గ్రూప్ అధికారులు తెలిపారు. -
42 కోట్ల మంది గగన విహారం!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, దేశంలో విమాన ప్రయాణికుల రద్దీ 40.7-41.8 కోట్లకు చేరి రికార్డులు బద్దలు కొట్టొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. -
రికార్డు గరిష్ఠాలకు వెండి
బంగారం, వెండి ధరలు గత రెండు రోజుల్లో బాగా పెరిగాయి. వెండి అయితే కిలో ధర తొలిసారిగా రూ.88,000ను మించింది. గత రెండు రోజుల్లోనే కిలోకు రూ.1500కు పైగా పెరిగింది. -
62.48% పెరిగిన పిట్టీ ఇంజినీరింగ్ లాభం
ఎలక్ట్రికల్ స్టీల్ ల్యామినేషన్లు, మోటార్లు/ జనరేటర్లకు సబ్-అసెంబ్లీస్, డైకాస్ట్ రోటార్స్ ఉత్పత్తి చేసే సంస్థ పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. -
పోకర్ణ లాభం రూ.15.51 కోట్లు
పోకర్ణ లిమిటెడ్ మార్చి త్రైమాసికానికి రూ.164.38 కోట్ల ఆదాయాన్ని, రూ.15.51 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
ఎం అండ్ ఎం లాభం రూ.2,754 కోట్లు
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం), గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,754 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
సంక్షిప్త వార్తలు(5)
ఐటీ, టెక్నాలజీ సొల్యూషన్లు అందించే ఏసర్ గ్రూప్, గృహోపకరణాల విపణిలోకి ప్రవేశించింది. ఇందుకోసం నాలుగేళ్ల క్రితం అంతర్జాతీయంగా ఏసర్ప్యూర్ బ్రాండ్ను ఆవిష్కరించిన సంస్థ, తాజాగా వివిధ ఉత్పత్తులను మన దేశంలో ఆవిష్కరించింది. -
స్టాక్ మార్కెట్... పెట్టుబడులు.. కాస్త అప్రమత్తంగా
ఎన్నికలు.. ఇతర కారణాలతో స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ఒకవైపు అంతర్జాతీయ మదుపరులు మన మార్కెట్లపై నిరాశావాద దృక్పథంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన తరుణం అంటూ సానుకూల మాటలు.. -
జీవిత బీమా పన్ను ఆదాకు మించి
ఆదాయపు పన్ను మినహాయింపు గురించి ఆలోచించే వారు ముందుగా చూసేది బీమా పాలసీలనే. పన్ను ప్రణాళికలను ప్రారంభించాల్సిన సమయం కావడంతో బీమా సంస్థలూ ఇప్పుడు పలు కొత్త పాలసీలతో ముందుకు వస్తుంటాయి. -
సూపర్ టాపప్ తీసుకోవచ్చా?
నా వయసు 57. నాకు బృంద ఆరోగ్య బీమా ఉంది. దీనికి అదనంగా వ్యక్తిగతంగా మరో పాలసీ తీసుకుంటే బాగుంటుందా? లేదా సూపర్ టాపప్ను ఎంచుకోవాలా? -
కార్డు బాకీ తీర్చలేకపోతే
చేతిలో డబ్బులు లేకపోయినా వస్తువులను కొనుగోలు చేసేందుకు క్రెడిట్ కార్డులు వెసులుబాటును అందిస్తాయి. ఈ సౌలభ్యం కొన్నిసార్లు అధిక ఖర్చుకూ దారి తీస్తుంది. చివరకు గడువులోపు బిల్లు చెల్లించలేని పరిస్థితి వస్తుంది. -
కారు రుణం ముందే తీర్చేస్తే
అప్పు చేసి కారు కొంటాం.. మన దగ్గర అనుకోకుండా డబ్బు వచ్చి, ఈ రుణం తీర్చేయాలని అనుకున్నాం అనుకోండి.. అప్పుడు ఏం చేయాలో చూద్దామా.. -
దీర్ఘకాలంలో అధిక రాబడి
బజాజ్ ఫిన్సర్వ్ మ్యూచువల్ ఫండ్ ఒక కొత్త మ్యూచువల్ ఫండ్ పథకాన్ని తీసుకొచ్చింది. ‘బజాజ్ ఫిన్సర్వ్ మల్టీ అస్సెట్ అలకేషన్ ఫండ్’ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ఈ నెల 27వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. -
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!
PIN: పుట్టిన రోజు, ఫోన్ నంబర్, ‘‘1234’’, ‘‘0000’’.. ఇలా సులభమైన పిన్లను సెట్ చేసుకుంటే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కినట్లే.
తాజా వార్తలు (Latest News)
-
వందనమమ్మా.. డాక్టర్ రవళి
-
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
-
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?