సముద్రం చూడ్డానికి అడ్డురావొచ్చని.. భవంతినే కొన్న రేఖా ఝున్ఝున్వాలా
తమ ఇంటి నుంచి సముద్రం చూసే అనుభూతి దూరం అవుతుందేమోననే అనుమానంతో.. ఏకంగా తమ ఇంటి పక్కనున్న ఒక భవంతిలోని దాదాపుగా ఫ్లాట్లన్నంటినీ కొనుగోలు చేశారట రేఖా ఝున్ఝున్ వాలా.
రూ.118 కోట్లతో 9 ఫ్లాట్లు సొంతం
ముంబయి: తమ ఇంటి నుంచి సముద్రం చూసే అనుభూతి దూరం అవుతుందేమోననే అనుమానంతో.. ఏకంగా తమ ఇంటి పక్కనున్న ఒక భవంతిలోని దాదాపుగా ఫ్లాట్లన్నంటినీ కొనుగోలు చేశారట రేఖా ఝున్ఝున్ వాలా. పెట్టుబడుల మాంత్రికుడిగా పేరున్న దివంగత రాకేశ్ ఝున్ఝున్వాలాకు భార్య ఈమె. మలబార్హిల్స్ వద్ద ఉన్న రేఖాకు చెందిన రేర్ విల్లా రెసిడెన్స్.. సముద్రానికి అభిముఖంగా ఉన్న రాక్సైడ్ అపార్ట్మెంట్స్కు వెనకాల ఉంది. అయితే దక్షిణ ముంబయిలోని వాకేశ్వర్ రోడ్లో ఉన్న ఈ 50 ఏళ్లు పైబడిన రాక్సైడ్ అపార్ట్మెంట్స్ సహా మరో ఆరు భవనాలను క్లస్టర్ పథకం కింద పునర్నిర్మించేందుకు నిర్ణయించారు. ఇందుకోసం షాపూర్జీ పల్లోంజి సంస్థ ఓ ప్రతిపాదనను కూడా సమర్పించింది. అయితే ఈ భవనాల పునర్నిర్మాణం వల్ల రేర్ విల్లా నుంచి అరేబియా సముద్ర వీక్షణ అనుభూతి దూరం కావొచ్చని ఊహించి.. ఆ పాత భవంతిలోని ఫ్లాట్లను ఒక్కొక్కటిగా రేఖా కొనుగోలు చేస్తూ వచ్చినట్లుగా తెలుస్తోంది. అలా 2023 నవంబరు నుంచి వివిధ సంస్థల ద్వారా తొమ్మిది ఫ్లాట్లను రూ.118 కోట్లకు కొనుగోలు చేశారని రిజిస్ట్రేషన్ దస్త్రాల ఆధారంగా తెలుస్తున్నట్లు ఓ ఆంగ్ల వెబ్సైట్ తన కథనంలో వెల్లడించింది. అయితే ఆ భవంతిలో 24 ఫ్లాట్లు ఉండగా.. ఇప్పటికే 19 వరకు రేఖా ఝున్ఝున్వాలా కుటుంబీకుల చేతిలోనే ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రాక్సైడ్ సీహెచ్ఎస్ భవంతిపై నిర్ణయం తీసుకోవాలంటే అధిక ఫ్లాట్లు కలిగి ఉన్న కొత్త యజమాని నుంచి స్పష్టత కోసం ఎదురుచూడాల్సి ఉండటంతో క్లస్టర్ పునర్నిర్మాణ ప్రక్రియను షాపూర్జీ పల్లోంజీ ప్రస్తుతానికి వాయిదా వేసినట్లుగా బ్రోకర్లు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్