Air India: ఆ ఉద్యోగుల వేతనాలు కట్ చేయండి.. ఎయిరిండియాకు ప్రభుత్వం ఆదేశం!
ఎయిరిండియా (Air India)ను టాటా సన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ సంస్థ ఉద్యోగులు అధికారిక నివాసాలను ఖాళీ చేయాల్సి ఉంది. కానీ, ఇంకా అక్కడే ఉంటుండడంతో వారి వేతనాల్లో కోత పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని వసంత్ విహార్లో ఉన్న అధికారిక భవనాల్లో ఇంకా నివాసం ఉంటున్న ఎయిరిండియా (Air India) ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని యాజమాన్య సంస్థ టాటా సన్స్ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. అక్టోబరు నుంచి దీన్ని అమలు చేయాలని కోరినట్లు పలువురు ఉద్యోగులు తెలిపారు. నెలకు దాదాపు రూ.95,000 వరకు వసూలు చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. ఇంత మొత్తం తీసేసిన తర్వాత చాలా మంది ఉద్యోగులకు చేతికందేదేమీ ఉండదని వాపోయారు.
ప్రస్తుతం ఎయిరిండియా ఉద్యోగులు నివాసం ఉంటున్న భవనాలు ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికల్లో భాగం కాదు. దీంతో ఈ ఆస్తుల్ని ఇతర రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలతో పాటు ‘ఎయిరిండియా అసెట్ హెల్డింగ్స్ లిమిటెడ్’కు బదిలీ చేశారు. వీటిని రూ.60,000 కోట్ల రుణ బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం విక్రయించాల్సి ఉంది.
ఎయిరిండియా టాటాల చేతుల్లోకి వెళ్లగానే ఉద్యోగులు వసంత్ విహార్లోని నివాసాల నుంచి ఖాళీ చేయాలని ప్రభుత్వం జులైలో ఆదేశాలు జారీ చేసింది. కానీ, వారు అప్పటి నుంచి గడువు పొడిగించాలని కోరుతూ వస్తున్నారు. ఇటీవల న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. వచ్చే ఏడాది పిల్లలకు బోర్డు పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఖాళీ చేయడానికి మరికొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎయిరిండియాకు ముంబయి, దిల్లీలో హౌసింగ్ కాలనీలు ఉన్నాయి. ఇప్పటికీ ఇక్కడ నివసిస్తున్న వారు వెంటనే ఖాళీ చేయాలని పలుసార్లు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. లేదంటే రూ.10- 15 లక్షల వరకు జరిమానా విధిస్తామని కూడా బెదిరించినట్లు పలువురు ఉద్యోగులు ఆరోపించారు. అక్టోబరులో ఓసారి నీటి సరఫరా నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ఇలా బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తున్నారని తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
AP News: ఎవరి అంతరాత్మ ఎలా ప్రబోధిస్తుందో?.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి
-
Sports News
IND vs AUS: భారత్, ఆసీస్ మూడో వన్డే.. ఆలౌటైన ఆస్ట్రేలియా
-
India News
Modi: JAM-జన్ధన్, ఆధార్, మొబైల్.. ప్రపంచానికే ఓ కేస్స్టడీ
-
Crime News
Vijayawada: విజయవాడలో అక్రమంగా తరలిస్తున్న రూ.7.48కోట్ల విలువైన బంగారం పట్టివేత
-
Education News
RRC Secunderabad: దక్షిణ మధ్య రైల్వే.. గ్రూప్-డి తుది ఫలితాల కోసం క్లిక్ చేయండి
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు