LIC MD: ఎల్‌ఐసీ ఎండీగా దొరైస్వామి

ఎల్‌ఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా దొరైస్వామి నియమితులయ్యారు. 2026 ఆగస్టు 1 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు.

Published : 14 Aug 2023 16:59 IST

దిల్లీ: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ (LIC) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఆర్‌. దొరైస్వామి నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం ముంబయిలోని ఎల్‌ఐసీ సెంట్రల్‌ ఆఫీసులో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఎండీగా వ్యవహరిస్తున్న ఇపే మినీ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 2023 సెప్టెంబర్‌ 1 నుంచి 2026 ఆగస్టు 31 వరకు లేదా, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఎండీగా కొనసాగుతారని ఎల్‌ఐసీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు అధిపతులను నియమించేందుకు ఉద్దేశించిన ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూషన్‌ బ్యూరో ఈ మేరకు దొరైస్వామి పేరును సిఫార్సు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని