Energy sector: భారత ఇంధన రంగంలోకి 67 బిలియన్ డాలర్ల పెట్టుబడులు: మోదీ
Energy sector: భారత ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ స్థాయి పెట్టుబడిదారులను ఆహ్వానించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
గోవా: వచ్చే 5-6 ఏళ్లలో భారత ఇంధన రంగంలోకి (Energy sector) 67 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) తెలిపారు. భారత ఇంధనరంగ వృద్ధిలో భాగస్వాములు కావాలని అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆహ్వానించినట్లు చెప్పారు. భారత ఇంధన వారోత్సవాలను (India Energy Week) మంగళవారం ప్రారంభిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత ఆర్థికవ్యవస్థ 7.5 శాతం వార్షిక వృద్ధి రేటుతో దూసుకెళ్తోందని మోదీ (Modi) అన్నారు. త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో ఇంధన రంగంలో (Energy sector) భారత్ పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతోందని వెల్లడించారు. 2045 నాటికి దేశ ఇంధన అవసరాలు రెట్టింపవుతాయన్నారు. ప్రపంచంలో భారత్ మూడో అతిపెద్ద ముడిచమురు, ఎల్పీజీ వినియోగదారు అని గుర్తుచేశారు. అలాగే ఎల్ఎన్జీ వినియోగంలో నాలుగో స్థానంలో ఉందని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ.. భారత్ మాత్రం దాన్ని సమర్థంగా ఎదుర్కోగలిగిందని మోదీ అన్నారు. పైగా గత రెండేళ్లలో పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల దేశీయ సహజవాయువు ఉత్పత్తి పెరుగుతోందన్నారు. భారత ఇంధన వినియోగంలో గ్యాస్ వాటాను 2030 నాటికి 15 శాతానికి పెంచుతామన్నారు. గత పదేళ్లలో పెట్రోల్లో ఇథేనాల్ వాటాను 1.5 నుంచి 12 శాతానికి పెంచామన్నారు. 2025 నాటికి దాన్ని 20 శాతానికి చేర్చుతామని తెలిపారు.
ప్రపంచ ఉద్గారాల్లో భారత్ వాటా నాలుగు శాతమేనని గుర్తుచేశారు. 2070 నాటికి శూన్య ఉద్గారాల స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు గుర్తు చేశారు. ఇటీవల ప్రకటించిన సూర్యోదయ యోజనలో భాగంగా ఇళ్లల్లో అదనంగా ఉత్పత్తయ్యే విద్యుత్తును గ్రిడ్కు అనుసంధానం చేస్తామని ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే