IT raids: డోలో-650 తయారీ సంస్థపై ఐటీ దాడులు.. కీలక పత్రాలు స్వాధీనం!

పాపులర్‌ ఔషధం డోలో-650 (Dolo-650) తయారీ సంస్థ మైక్రో ల్యాబ్స్‌ లిమిటెడ్‌పై (Micro Labs) ఐటీ శాఖ సోదాలు జరిపింది. బెంగళూరులోని రేస్‌ కోర్స్‌......

Updated : 06 Jul 2022 16:40 IST

బెంగళూరు: పాపులర్‌ ఔషధం డోలో-650 (Dolo-650) తయారీ సంస్థ మైక్రో ల్యాబ్స్‌ లిమిటెడ్‌పై (Micro Labs) ఐటీ శాఖ సోదాలు జరిపింది. బెంగళూరులోని రేస్‌ కోర్స్‌ రోడ్డులోని ఆ కంపెనీ కార్యాలయంలో దాదాపు 20మంది అధికారుల బృందం సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో జరిపిన ఈ దాడుల్లో కార్యాలయంలో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అలాగే, దిల్లీ, సిక్కిం, పంజాబ్‌, తమిళనాడు, గోవాలతో పాటు దేశవ్యాప్తంగా 40 చోట్ల ఏకకాలంలో సోదాలు జరపగా.. 200 మందికి పైగా అధికారులు పాల్గొన్నట్టు ఐటీశాఖ వర్గాలు పేర్కొన్నాయి. మైక్రో ల్యాబ్స్‌ సీఎండీ దిలీప్‌ సురానా, డైరెక్టర్‌ ఆనంద్‌ సురానా నివాసాల్లోనూ సోదాలు నిర్వహించినట్టు సమాచారం. ఈ సోదాల్లో భాగంగా మాధవనగర్‌లోని రేస్‌కోర్సు రోడ్డులోని మైక్రో ల్యాబ్స్‌ లిమిటెడ్‌ కార్యాలయంలో పలు కీలక పత్రాలు సేకరించినట్టు ఐటీశాఖ అధికారులు తెలుస్తోంది. 2020లో కరోనా వ్యాప్తి మొదలైనప్నట్నుంచి ఈ కంపెనీ రికార్డుస్థాయిలో 350 కోట్ల టాబ్లెట్లను విక్రయించింది. అంతేకాకుండా ఒకే ఏడాదిలో దాదాపు రూ.400 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి అనేక కంపెనీలను అధిగమించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని