ITR Filing: ఐటీఆర్ ఫైలింగ్కు ఇంకా 4 రోజులే.. గడువు పొడిగిస్తారా?
ITR Filing: ఐటీఆర్ ఫైలింగ్కు ఆఖరు తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో గడువు పొడిగించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి...
ITR Filing: ప్రత్యేక ఆడిట్ అవసరంలేని వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి 2022 జులై 31 ఆఖరు తేదీ. అంటే ఇంకా నాలుగు రోజులే మిగిలి ఉంది. గత మూడేళ్లలో ఐటీ విభాగం ఏదో ఒక కారణంతో గడువు పొడిగిస్తూ వచ్చింది. ఈసారి కూడా అదే జరుగుతుందేమోనని చాలా మంది ఆశిస్తున్నట్లు రిటర్నుల దాఖలు తీరును చూస్తే తెలుస్తోందని ఐటీ విభాగం అధికారులు అభిప్రాయపడ్డారు.
కానీ, గడువు పొడిగింపునకు ప్రభుత్వం ఈసారి ఏమాత్రం సుముఖంగా లేదని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ ఇదే విషయాన్ని తేల్చి చెప్పారు. ఇటీవల సీఏ, ట్యాక్స్ ప్రాక్టీషనర్స్కు సంబంధించిన పలు అసోసియేషన్లు కేంద్ర ఆర్థికశాఖ వద్దకు ఫైలింగ్ తేదీ పొడిగింపు ప్రతిపాదనను తీసుకెళ్లినా కేంద్రం విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI)’ మాత్రం తాము గడువు పొడిగింపు విషయంలో ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదని తెలిపింది. తమ సభ్యులెవరూ సర్కార్ వద్దకు ఈ ప్రతిపాదనతో వెళ్లొద్దని ఆదేశించింది.
సోషల్ మీడియాలో మాత్రం గడువు పొడిగించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ‘‘Extend_Due_Date_Immediately’’ హ్యాష్ట్యాగ్ ప్రస్తుతం ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. ఫైలింగ్లో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో గడువు పొడిగించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఆదాయపన్ను విభాగం మాత్రం జులై 31 నాటికి ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందేనంటూ బుధవారం ట్విటర్ వేదికగా మరోసారి గుర్తుచేసింది.
జులై 26నాటికి 3.4 కోట్ల ఆదాయపన్ను రిటర్నులు దాఖలైనట్లు ఐటీ విభాగం తెలిపింది. అందులో 26నే 30 లక్షల రిటర్నులు ఫైల్ చేసినట్లు వెల్లడించింది. వీటిలో 2.71 కోట్ల రిటర్నులు వెరిఫై అయినట్లు.. ఇంకా 1.97 కోట్ల రిటర్నులను వెరిఫై చేయాల్సి ఉందని తెలిపింది.
* గడువు ఒక నెల పొడిగించడం వల్ల వచ్చే నష్టం ఏంటని ఓ నెటిజన్ ట్విటర్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గడువు పొడిగిస్తే సైట్పై లోడ్ తగ్గుతుందని తెలిపారు. అలాగే ఎక్కువ మంది రిటర్నులు దాఖలు చేస్తారని చెప్పుకొచ్చారు. ఫలితంగా ప్రభుత్వానికే ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు.
* ఐటీ పోర్టల్లో సమస్యపై ఫిర్యాదు చేయడానికి తాను ఆదాయ పన్ను శాఖ కార్యాలయానికి ఫోన్ చేసినట్లు మరో ట్విటర్ యూజర్ తెలిపారు. అయితే అక్కడ ఉన్న అధికారి మాట్లాడుతూ.. ‘‘సమస్య ఎక్కడో చూద్దామంటే తన వద్ద ఉన్న పోర్టల్ కూడా గత 10 నిమిషాల నుంచి లోడ్ అవుతోంది’’ అని సమాధానం చెప్పినట్లు నెటిజన్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!