Jio Financial Services: ఎక్స్ఛేంజీల్లో జియో ఫైనాన్షియల్ లిస్టింగ్.. 5 శాతం డౌన్
Jio Financial trading: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ అయ్యింది. ఆరంభంలో లాభాల్లో ప్రారంభమైన జియో ఫైనాన్షియల్.. తర్వాత లోయర్ సర్క్యూట్ను తాకింది.
దిల్లీ: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి వేరుపడిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (Jio Financial Services) స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయ్యింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ను ఆర్ఐఎల్ నుంచి గత నెలలో విభజించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో ఎంట్రీ ఇచ్చిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బీఎస్ఈలో 1.20 శాతం లాభంతో రూ.265 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. ఎన్ఎస్ఈలో సైతం రూ.262 వద్ద ట్రేడింగ్ను మొదలు పెట్టింది. ఆ తర్వాత ఎన్ఎస్ఈలో 5 శాతం నష్టంతో లోయర్ సర్క్యూట్ను రూ.248.90 వద్ద తాకింది.
టెస్లా లీక్.. ఎలాన్మస్క్ సెక్యూరిటీ నంబర్ కూడా బహిర్గతం..!
జియో ఫైనాన్షియల్ షేరు విలువ నిర్ణయించేందుకు గత నెల ఆర్ఐఎల్ షేరుకు నిర్వహించిన ప్రత్యేక ట్రేడింగ్లో షేరు విలువను రూ.261.85గా కనుగొన్నారు. ఆ విలువతోనే ఎంట్రీ ఇచ్చిన జియో ఫైనాన్షియల్ షేరు ఆరంభంలో లాభాల్లో కొనసాగింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ విలువ రూ.1.59 లక్షల కోట్లకు చేరింది. 10 ట్రేడింగ్ రోజుల పాటు టీ గ్రూపు షేరుగా ఇది కొనసాగుతుంది. టీ గ్రూపు అంటే ట్రేడ్ టూ ట్రేడ్ షేర్లు. వీటిలో ఇంట్రాడే ట్రేడింగ్కు అనుమతి ఉండదు. ఈ షేర్లను ఈ రోజే కొని, ఈ రోజే విక్రయించలేం (బీటీఎస్టీ); ఈ రోజు అమ్మేసి రేపు కొనలేం (ఎస్టీబీటీ). ఈ షేర్ల విలువ తగ్గినా, పెరిగినా 5% సర్క్యూట్ పరిమితి ఉంటుంది. మరోవైపు స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్