Elon Musk: నా కొడుకు జీనియస్.. మస్క్ తల్లి కామెంట్
మస్క్ సాధిస్తున్న విజయాలు నచ్చిన వ్యక్తులే ఆయనపై విమర్శలు చేస్తున్నారని ఆయన తల్లి మయే మస్క్ అన్నారు. మరోవైపు ట్విటర్ ప్రమోషన్ కోసం మస్క్ అబద్ధాలు చెబుతున్నారని మాజీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ట్విటర్ కొనుగోలు తర్వాత మస్క్ నిర్ణయాలు ఖాతాదారులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మస్క్కు ఆయన తల్లి మయే మస్క్ అండగా నిలిచారు. మస్క్ తెలివైన వాడు, అతడిపై విమర్శలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. మస్క్ సాధిస్తున్న విజయాలను చూసి ఓర్వలేనివారే అతడిపై విమర్శలు చేస్తున్నారని మయే అభిప్రాయపడ్డారు. ట్విటర్ను మస్క్ 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే కంపెనీలోని సెక్యూరిటీ, ప్రైవసీ విభాగాల్లో పనిచేసే కీలక ఉద్యోగులతో కలిపి మొత్తం 50 శాతం మంది ఉద్యోగులను తొలగించడం, ఆ తర్వాత 8 డాలర్లు చెల్లించి ఎవరైనా తమ ఖాతాలకు బ్లూటిక్ పొందొచ్చని పేర్కొనడం వంటి నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. దీంతో కొన్ని నకిలీ ఖాతాలు సైతం బ్లూటిక్ తీసుకుని తప్పుడు ట్వీట్లు చేయడంతో పలు కంపెనీలకు నష్టం వాటిల్లింది.
మస్క్ చెప్పేవన్నీ అబద్ధాలు.. ట్విటర్ మాజీ ఉద్యోగి ఆరోపణ
మరోవైపు ట్విటర్ ప్రమోషన్స్ గురించి మస్క్ చేసిన ట్వీట్పై నెటిజన్లతోపాటు, కంపెనీ మాజీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ట్విటర్ ద్వారా వెబ్సైట్లు/యాప్లకు క్లిక్స్ పెరుగుతున్నాయి. ఇంటర్నెట్లో ఇదే అతిపెద్ద క్లిక్ డ్రైవ్’’ అని మస్క్ట్వీట్ చేశారు. దీనిపై ట్విటర్ మాజీ ఉద్యోగి సహా పలువురు నెటిజన్లు స్పందించారు. ‘‘మస్క్ చెప్పేవన్నీ అబద్ధాలే, ఈ విషయం ట్విటర్ యజమాన్యానికి కూడా తెలుసు. నేను ఐదేళ్లపాటు ట్విటర్లో పనిచేశాను. మస్క్ చెప్పేది వందశాతం అబద్ధం. ట్విటర్ ఎప్పుడు క్లిక్స్ను అమ్ముకోదు. ఎందుకంటే ఫేస్బుక్, లింక్డ్ఇన్ కంటే ట్విటర్కు ట్రాఫిక్ తక్కువే. ట్విటర్కు వేరే బలాలున్నాయి. క్లిక్స్ కంటే మార్కెటింగ్ ముఖ్యం’’ అని ట్వీట్ చేశారు. మరో నెటిజన్ ట్వీట్ చేస్తూ మార్కెటింగ్ పరంగా ట్విటర్ గొప్ప టూల్ ఏమీ కాదని అన్నారు.
ట్విటర్ను లాభాల్లోకి తీసుకురావాలని మస్క్ తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సబ్స్క్రిప్షన్ ద్వారా లాభాలు పొందాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఉద్యోగులకు రాసిన లేఖలో క్లిష్ట పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు సిబ్బంది కష్టపడి పనిచేయాలని.. కంపెనీ ఇచ్చే చిన్న చిన్న ప్రయోజనాలను సైతం వదులుకునేందుకు సిద్ధపడాలని కోరినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్