Muthoot Microfin IPO: ముత్తూట్ మైక్రోఫిన్ ఐపీఓ.. ధరల శ్రేణి, ఇతర వివరాలు ఇవే..
Muthoot Microfin IPO: ముత్తూట్ మైక్రోఫిన్ సంస్థ ధరల శ్రేణి ఖరారైంది. డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 20 వరకు ఐపీఓ సబ్స్క్రిప్షన్కు అందుబాటులో ఉంటుంది.
Muthoot Microfin IPO | ముంబయి: ముత్తూట్ పప్పాచాన్ గ్రూప్నకు చెందిన మైక్రో రుణ సంస్థ ముత్తూట్ మైక్రోఫిన్ ఐపీఓ (Muthoot Microfin IPO) ధరల శ్రేణి ఖరారయ్యిది. డిసెంబర్ 18న ఐపీఓకు రానున్న ఈ సంస్థ ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.277-291గా నిర్ణయించింది. డిసెంబర్ 20న సబ్స్క్రిప్షన్ ముగుస్తుంది. మొత్తం రూ.960 కోట్లు ఐపీఓ ద్వారా సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో రూ.760 కోట్లను ప్రైమరీ షేర్ల విక్రయం ద్వారా.. మిగిలిన రూ.200 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిన విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది.
ముత్తూట్ మైక్రోఫిన్లో 19.06 శాతం వాటా కలిగిన ఇన్వెస్టర్ సంస్థ గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ రూ.50 కోట్లకు సమానమైన 2.06 శాతం వాటాను విక్రయించనుంది. ప్రమోటర్ కుటుంబం సైతం తమ వాటాను తగ్గించుకోనుంది. ఐపీఓలో విక్రయిస్తున్న షేర్లను క్యూఐబీలకు 55 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎన్ఐఐలకు 15 శాతం చొప్పున కేటాయించారు. రిటైల్ మదుపరులు కనీసం 51 షేర్లకు (లాట్) బిడ్లు దాఖలు చేయాలి. అంటే కనీసం రూ.14,841 చొప్పున పెట్టుబడి పెట్టాలి.
వాట్సప్లో కొత్త ఫీచర్.. గ్రూప్లో ముఖ్యమైన టాపిక్స్ ఇక మిస్ కాలేరు
ముత్తూట్ పప్పాచాన్ గ్రూప్ బంగారం తాకట్టు రుణాలతో పాటు తమ అనుబంధ సంస్థల ద్వారా సాధారణ, రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్ లోన్స్ను అందిస్తుంటుంది. ఈ గ్రూప్ నుంచి వస్తున్న రెండో ఐపీఓ ఇది. గతంలో ద్విచక్ర వాహన రుణాలు అందించే ముత్తూట్ క్యాపిటల్ సంస్థ ఐపీఓకు వచ్చింది. ముత్తూట్ మైక్రోఫిన్ సంస్థకు 32 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. తిరువనంతపురానికి చెందిన ఈ కంపెనీకి 18 రాష్ట్రాల్లో 1340 శాఖలు ఉన్నాయి. 12,290 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఐపీఓ వివరాలు
- ఐపీఓ తేదీలు: డిసెంబర్ 18- 20
- ముఖ విలువ: రూ.10
- ధరల శ్రేణి: రూ.277- 291
- లాట్ సైజ్: 51 షేర్లు
- షేర్ల అలాట్మెంట్ తేదీ: డిసెంబర్ 21
- రిఫండ్లు: డిసెంబర్ 22
- లిస్టింగ్ తేదీ: డిసెంబర్ 26
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది. -
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!