RBI: రూ.2వేల నోట్ల ఉపసంహరణ.. ఆర్థిక వ్యవస్థపై ప్రభావమెంత?
రూ.2వేల నోట్లను ఉపసంహరించుకోనున్నట్టు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆర్థిక రంగ నిపుణులు ఏమంటున్నారంటే?
ఇంటర్నెట్డెస్క్: రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంటూ రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కరెన్సీపై ప్రజల్లో కాస్త ఆందోళన మొదలైంది. ముఖ్యంగా రూ.2వేల నోట్లు దాచుకున్న వారు కలవర పడుతున్నారు. బ్లాక్ మనీ బాబులకు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రూ.2వేల ఉపసంహరణ నిర్ణయంతో ఎవరికి నష్టం? ఎవరికి కష్టం? ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు ప్రభావం ఉంటుంది? అనే దానిపై ఆర్థిక రంగ నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఇది ఎప్పటికైనా తీసుకోవాల్సిన నిర్ణయమే: నరసింహమూర్తి
‘‘2016లో పెద్దనోట్లను రద్దు చేసిన సమయంలో నగదు కొరత ఏర్పడుతుందని భావించిన ఆర్బీఐ అప్పటికప్పుడు హడావుడిగా రూ.2వేల నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత అవి పూర్తి స్థాయిలో వాడుకలోకి వచ్చాయి. తర్వాత ఆర్బీఐ రూ.2వేల నోట్ల ప్రింటింగ్ ఆపేసింది. అప్పటి నుంచి ఇక ఎప్పుడైనా ఈ నోట్లను చలామణీలో లేకుండా చేస్తారని భావించాం. ఇప్పటికే రూ.2వేల నోట్లను చాలా వరకు సర్క్యలేషన్లో లేకుండా చేశారు. తద్వారా మార్కెట్లో ఉన్న బ్లాక్మనీని కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుంది.
ఇప్పుడు ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా తక్కువ వ్యవధిలో సున్నితంగా నోట్లను తీసేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ వినియోగం పెరిగినందున ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపించకపోవచ్చు. అయితే, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఈ నిర్ణయంతో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉండొచ్చు. సెప్టెంబరు 30 వరకు మార్చుకొనేందుకు గడువు ఉన్నందున అప్పటివరకు సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచిది. ఇది ఎప్పటికైనా తీసుకోవాల్సిన నిర్ణయమే’’ అని ఆర్థిక రంగ నిపుణులు నరసింహమూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాజకీయ నిర్ణయంగానే భావించాలి: అనంత్
వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోందని ఆర్థిక రంగ నిపుణులు అనంత్ అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ రూ.2వేల నోట్ల ఉపసంహరణపై స్పందిస్తూ.. తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘‘బ్లాక్ మనీ తగ్గించడాకే డీమానిటైజేషన్ అని కేంద్రం గతంలో చెప్పింది. ప్రస్తుతం ప్రభుత్వం కూడా మారలేదు. అయినా, ఇప్పుడు మళ్లీ రూ.2వేల నోట్లు ఉపసంహరించుకుంటున్నారు. కరెన్సీ నోట్లంటే అనుమానం వచ్చే పరిస్థితికి తెచ్చారు. తర్వాత రూ.500 నోట్లు కూడా ఉంటాయో లేదోనని ప్రజల్లో భయం మొదలైంది. ఇంత ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు.. రూ.2వేల నోట్లు ఎందుకు మారుస్తున్నారు? కారణమేంటి? అనేది బహిరంగంగా ప్రకటించలేదు. చాలా కాలం నుంచి రూ.2వేల నోట్లు ఏటీఎంలలో రావట్లేదు. అయినా, ఆర్బీఐ ఈ నోట్లను ఉపసంహరించుకుందంటే కర్ణాటక ఎన్నికల ప్రభావం అనుకోవాలి. అంతకన్నా ఏముంటుంది?
ఏ నోటు ఎంతకాలం ఉంటుంది? ఎందుకు విత్ డ్రా చేశారనేది ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చేస్తున్నామని ఆర్బీఐ చెబితే.. ఆర్బీఐ బోర్డు దీనిపై నిర్ణయం తీసుకుందా? తీసుకుంటే ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత బోర్డుకు లేదా? ఎందుకు ఉప సంహరించుకుంటున్నారో కారణం చెప్పకుండా అర్ధంతరంగా చేస్తే ఎలా? అసలు రూ.2వేల నోటు ఎందుకు తీసుకొచ్చినట్టు? ముద్రణకు, నగదు సరఫరాకు ఎంత ఖర్చయి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థపై ఎందుకీ దుబారా?. ఇది ఒక రాజకీయ నిర్ణయంగా భావించాల్సి ఉంటుంది.
ఎన్నికల కోసం పెద్ద పెద్ద నాయకులు డబ్బు దాచుకున్నారేమో, బ్లాక్ మనీ ఉందేమో నన్న అనుమానంతో రూ.2వేల నోట్ల ఉపసంహరించుకున్నట్టు నాకు అనిపిస్తోంది. ఒక వేళ కొందరి వద్ద బ్లాక్ మనీ ఉండి ఉంటే డీమానిటైజేషన్ విఫలమైనట్టే కదా? వాస్తవాన్ని అంగీకరించకుండా ఇలా చేస్తున్నారా? అని అనిపిస్తోంది. రాజకీయాలు తీసుకొచ్చి ఎకానమీని రాత్రి రాత్రికి మార్చుకోవటం. కాస్ట్లీ ఫెయిల్యూర్ పాలసీకి ఇదో నిదర్శనం. ఇలాంటి నిర్ణయాల వల్ల రిజర్వ్ బ్యాంకు బోర్డుపై ఉన్న గౌరవం రోజు రోజుకీ తగ్గిపోతోంది. నోట్ల మార్పిడి కోసం గ్రామీణ ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరగడం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆర్బీఐ ఏ నిర్ణయం తీసుకున్నా మొదట ఇబ్బంది పడుతున్నది సామాన్య ప్రజలే’’ అని అనంత్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
బ్లాక్ మనీ కట్టడికి ఈ చర్య ఎంతో ఉపయోగం: కుటుంబరావు
చలామణీలో ఉన్న రూ.2వేల నోట్లను వెనక్కి తీసుకోవాలన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయాన్ని ఏపీ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు, ఆర్థిక రంగ నిపుణులు కుటుంబరావు స్వాగతించారు. దేశంలో నగదు రహిత లావాదేవీలు పెరిగేందుకు, నల్లధనం కట్టడికి ఈ చర్య ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ‘‘ఇలాంటి నిర్ణయాన్ని ఆర్బీఐ తీసుకుంటుందని మార్చిలోనే భావించాం. ఏటీఎంలలో రూ.2వేల నోట్లు పెట్టడం లేదని.. కావాలని అలా చేస్తున్నారా? ఈ విధంగా ఏమైనా ఆదేశాలు ఇచ్చారా? అని పలు మీడియా సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ప్రశ్నించారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘‘మేము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. బ్యాంకులే అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి’’ అని సీతారామన్ బదులిచ్చారు.
ఆర్బీఐ ‘‘క్లీన్ నోట్ పాలసీ’’ (Clean Note policy)ని తీసుకొచ్చింది. దీని ప్రకారం.. లీగల్గా, టెండర్గా ఉండే ఓ నోటు ఐదు లేదా ఆరు సంవత్సరాలకు మించి మన్నికగా ఉండదు. రూ.2వేల నోట్లు చలామణీలోకి వచ్చి ఐదారేళ్లు గడుస్తున్న నేపథ్యంలో.. ఈ పాలసీ ప్రకారం వాటిని సర్క్యలేషన్ నుంచి తీసేయడమో లేదా వాటి స్థానంలో కొత్తవి తీసుకురావడం లాంటివి చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే, ఇప్పుడు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం మాత్రం రూ. 2వేల నోట్ల పాక్షిక రద్దు (Partial demonetisation) అని చెప్పవచ్చు. 2016లో తీసుకున్న నిర్ణయానికి, ఇప్పుడు తీసుకున్న చర్యకు తేడా ఉంది. అప్పడు పెద్ద నోట్లు రద్దు చేస్తూ నిర్ణయాన్ని ప్రకటించిన మరుక్షణం నుంచే అవి (రూ.500 నోట్లు, రూ.1000 నోట్లు) చెల్లుబాటు కాకుండా పోయాయి. ఇప్పుడు సెప్టెంబరు 30వరకు రూ.2వేల నోట్లు చెల్లుబాటు అవుతాయి. కొన్ని నిబంధనలు పెట్టి మార్చుకోవడానికి వీలు కల్పించారు. ఈ చర్య వల్ల నల్లధనాన్ని అరికట్టేందుకు వీలు ఉంటుంది’’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.