Popular Vehicles IPO: పాపులర్ వెహికల్స్ ఐపీఓ ప్రారంభం.. ధరల శ్రేణి రూ.280-295
Popular Vehicles IPO: రూ.602 కోట్ల సమీకరణ లక్ష్యంతో పాపులర్ వెహికల్స్ అండ్ సర్వీసెస్ ఐపీఓ మంగళవారం ప్రారంభమైంది.
ముంబయి: కొచ్చి కేంద్రంగా పనిచేస్తున్న వాహన డీలర్ల సంస్థ పాపులర్ వెహికల్స్ అండ్ సర్వీసెస్ ఐపీఓ (Popular Vehicles IPO) మంగళవారం ప్రారంభమైంది. ఈ నెల 14 వరకు షేర్లకు బిడ్లు దాఖలు చేయొచ్చు. ధరల శ్రేణిని కంపెనీ రూ.280-295గా నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.602 కోట్లు సమీకరించనుంది. మదుపర్లు కనీసం రూ.14,750తో 50 షేర్లను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ పబ్లిక్ ఇష్యూలో (IPO) పాపులర్ వెహికల్స్ రూ.250 కోట్లు కొత్త షేర్ల జారీ ద్వారా.. మరో రూ.352 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద సమకూర్చుకోనుంది. కంపెనీ ఎండీ నవీన్ ఫిలిప్ నేతృత్వంలోని ప్రమోటర్లు, కుత్తుకరణ్ ఫ్యామిలీ, బన్యన్ ట్రీ గ్రోత్ క్యాపిటల్ ఓఎఫ్ఎస్లో తమ వాటాల్లో కొంత భాగాన్ని విక్రయిస్తున్నారు. ఐపీఓలో అందుబాటులో ఉన్న షేర్లలో 35 శాతం రిటైల్ మదుపర్లకు, 15 శాతం సంస్థాగతేతర మదుపర్లకు, అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులకు 20 శాతం కేటాయించింది. ఉద్యోగుల కోసం 37,453 షేర్లను రిజర్వ్ చేసింది. వారికి ప్రత్యేకంగా ఒక్కో షేరుపై రూ.28 రాయితీ ఇస్తోంది.
ఐపీఓ (Popular Vehicles IPO) ద్వారా సమీకరించిన నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు పాపులర్ వెహికల్స్ వెల్లడించింది. ఈ కంపెనీని 1983లో స్థాపించారు. దేశవ్యాప్తంగా ఆటోమొబైల్ డీలర్షిప్లను నిర్వహిస్తోంది. వాహన సర్వీసులను అందిస్తోంది. విడి భాగాల విక్రయం, సెకండ్ హ్యాండ్ వాహనాల అమ్మకాలు, డ్రైవింగ్ స్కూళ్లు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీల పంపిణీ వంటి వ్యాపారాలను కూడా నిర్వహిస్తోంది. 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 40 శాతం పెరిగి రూ.4,892 కోట్లుగా నమోదైంది. పన్నేతర లాభం 90 శాతం పుంజుకొని రూ.64 కోట్లకు చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్