Digital Lenders: రుణగ్రహీత ఇష్టం మేరకే సమాచారం.. డిజిటల్ రుణాలపై ఆర్బీఐ మార్గదర్శకాలు
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిజిటల్ రుణాలకు సంబంధించిన మార్గదర్శకాలను బుధవారం విడుదల చేసింది.
దిల్లీ: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిజిటల్ రుణాలకు సంబంధించిన మార్గదర్శకాలను బుధవారం విడుదల చేసింది. ఆర్బీఐ లేదా ఇతర చట్టపరమైన సంస్థల నియంత్రణలో ఉన్న కంపెనీలకు మాత్రమే రుణాలిచ్చే అధికారం ఉందన్న నిబంధన కింద కేంద్ర బ్యాంకు ఈ మార్గదర్శకాలను రూపొందించింది. ఆన్లైన్, మొబైల్ యాప్ల ద్వారా రుణాలిస్తున్న అనేక సంస్థలను ఆర్బీఐ మూడు కేటగిరీలుగా వర్గీకరించింది.
* RBI నియంత్రణలో ఉండి రుణ వ్యాపారాన్ని నిర్వహించడానికి అనుమతి ఉన్న సంస్థలు
* ఇతర చట్టబద్ధమైన/నియంత్రణ నిబంధనల ప్రకారం రుణాలు ఇవ్వడానికి అధికారం కలిగి ఉండి RBI నియంత్రణలో లేని సంస్థలు
* చట్టబద్ధమైన/నియంత్రణ నిబంధనలకు వెలుపల రుణాలిచ్చే సంస్థలు
1. తొలి కేటగిరీలోకి వచ్చే సంస్థలను దృష్టిలో ఉంచుకొని ఆర్బీఐ తాజాగా మార్గదర్శకాలను రూపొందించింది. ముఖ్యంగా ఆర్బీఐ నియంత్రణలో ఉన్న సంస్థలు లేదా ఆర్బీఐ నియమించిన ‘లెండింగ్ సర్వీసు ప్రొవైడర్లు’ లక్ష్యంగా వీటిని తీసుకొచ్చారు.
2.రెండో కేటగిరీలోకి వచ్చే సంస్థలకు ఆర్బీఐ నియమించిన ‘డిజిటల్ లెండర్స్ వర్కింగ్ గ్రూప్’ సిఫార్సుల ఆధారంగా డిజిటల్ రుణాలపై తగిన నియమాలు/నిబంధనలను రూపొందించడం/అమలు చేసే అంశాన్ని సంబంధిత చట్టబద్ధమైన సంస్థలు పరిగణించవచ్చు.
3. మూడో కేటగిరీలోకి వచ్చే సంస్థలు చట్టవిరుద్ధమైన రుణ పంపిణీ చేపట్టకుండా కేంద్ర ప్రభుత్వం తగిన శాసన, సంస్థాగత చర్యలను చేపట్టాలని వర్కింగ్ గ్రూప్ సూచించినట్లు ఆర్బీఐ తెలిపింది.
మార్గదర్శకాలివే..
- ఆర్బీఐ నియంత్రణలో ఉన్న సంస్థలు లేదా ఎల్ఎస్పీలు రుణ మంజూరు, తిరిగి చెల్లింపుల ప్రక్రియను పూర్తిగా సంస్థలు, రుణగ్రహీత బ్యాంకు ఖాతాల మధ్యే నిర్వహించాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.
- రుణ మధ్యవర్తిత్వ ప్రక్రియలో ఎల్ఎస్పీలకు చెల్లించాల్సిన ఫీజులు, ఛార్జీలను నేరుగా నియంత్రిత సంస్థలే చెల్లించాలి. దీంతో రుణగ్రహీతలకు సంబంధం లేదు.
- ‘యాన్యువల్ పర్సెంటేజ్ రేట్ (APR)’ రూపంలో డిజిటల్ రుణాలకయ్యే ఖర్చులను సంస్థలకు రుణగ్రహీతలకు తెలియజేయాలి.
- రుణ గ్రహీతల అనుమతి లేకుండా రుణ అర్హత పరిమితిని పెంచడానికి వీల్లేదు.
- రుణ యాప్లు అవసరం మేరకు మాత్రమే గ్రహీతల సమాచారాన్ని సేకరించాలి. అదీ వారి అనుమతితోనే జరగాలి.
- ఏదైనా సమాచారాన్ని వినియోగించుకోవడానికి రుణ గ్రహీతలు అనుమతించడం లేదా నిరాకరించే వెసులుబాటును వారికి కల్పించాలి. అవసరమైతే ఇచ్చిన అనుమతిని రద్దు చేసుకునే అవకాశం కూడా కల్పించాలి.
- రుణ యాప్ల ద్వారా ఇచ్చిన రుణాలకు సంబంధించిన సమాచారాన్ని కంపెనీలు కచ్చితంగా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు అందించాలి. ముఖ్యంగా ‘బై నౌ పే లేటర్’ ఆప్షన్ ఇస్తున్న సంస్థలను ఉద్దేశించి ఈ నిబంధనను రూపొందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.