Russian Oil: రష్యా రాయితీ చమురులో 45% ‘నయారా, రిలయన్స్’కే!
ఫిబ్రవరితో ముగిసిన 12 నెలల వ్యవధిలో భారత్ సగటున రోజుకు రష్యా నుంచి 8,70,000 బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకోగా.. దీంట్లో 3,85,000 బ్యారెళ్లు రిలయన్స్, నయారాకే వెళ్లినట్లు వోర్టెక్సా వెల్లడించింది.
దిల్లీ: రష్యా (Russia) నుంచి భారత్ భారీ ఎత్తున చమురు (Crude Oil)ను దిగుమతి చేసుకుంటోంది. ఒకప్పుడు మొత్తం చమురు (Crude Oil) దిగుమతుల్లో రష్యా (Russia) వాటా 1 శాతం కాగా.. ఇప్పుడది 35 శాతానికి చేరింది. పశ్చిమ దేశాల ఆంక్షల తర్వాత రాయితీ ధరకే రష్యా చమురును అందిస్తుండడమే దీనికి కారణం. అయితే, ఆ దేశం నుంచి దిగుమతి అవుతున్న చమురులో 45 శాతం ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, రష్యా మద్దతు ఉన్న నయారా ఎనర్జీకే వెళ్తున్నట్లు ఇంధన సరఫరా సమాచారాన్ని సేకరించే వోర్టెక్సా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఫిబ్రవరితో ముగిసిన 12 నెలల వ్యవధిలో భారత్ సగటున రోజుకు రష్యా నుంచి 8,70,000 బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంది. ఇది భారత మొత్తం చమురు దిగుమతుల్లో 20 శాతానికి సమానం. దీంట్లో 3,85,000 బ్యారెళ్లు రిలయన్స్, నయారాకే వెళ్లినట్లు వోర్టెక్సా వెల్లడించింది. ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం, ఎంఆర్పీఎల్ 4,84,000 బ్యారెళ్లను దిగుమతి చేసుకున్నట్లు పేర్కొంది. రష్యా రాయితీల వల్ల ప్రైవేట్ కంపెనీలు అధికంగా లాభపడినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. యుద్ధ ఆరంభ సమయంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఆయా కంపెనీలు లబ్ధి పొందాయని వివరించాయి.
రష్యా (Russia) నుంచి భారత్కు చమురు (Crude Oil) దిగుమతి 2023 ఫిబ్రవరిలో మరింత పెరిగింది. మన దేశానికి చమురు (Crude Oil) సరఫరా చేస్తున్న దేశాల జాబితాలో రష్యా (Russia) వరుసగా ఐదోనెలా తొలిస్థానంలో నిలిచింది. 2023 ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో రోజుకు 16 లక్షల పీపాలకు పైగా చమురు (Crude Oil) దిగుమతి అయినట్లు వోర్టెక్సా వెల్లడించింది. ఇది ఇరాక్, సౌదీ అరేబియా.. రెండూ కలిపి భారత్కు సరఫరా చేస్తున్న చమురు కంటే ఎక్కువ కావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్