Reliance: హైదరాబాద్‌లో రిలయన్స్‌ ‘స్వదేశ్‌ స్టోర్‌’.. ప్రారంభించిన నీతా అంబానీ

దేశంలోనే మొట్టమొదటి స్వదేశ్‌ స్టోర్‌ (swadesh store)ను రిలయన్స్‌ (Reliance) సంస్థ హైదరాబాద్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది.

Updated : 08 Nov 2023 20:05 IST

హైదరాబాద్‌: దేశంలోనే మొట్టమొదటి స్వదేశ్‌ స్టోర్‌ (swadesh store)ను రిలయన్స్‌ (Reliance) సంస్థ హైదరాబాద్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన అతి పెద్ద ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ స్వదేశ్‌ స్టోర్‌ను రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హైదరాబాద్‌ అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. మొట్టమొదటి రిలయన్స్‌ రిటైల్‌ స్టోర్‌ను కూడా హైదరాబాద్‌లోనే ప్రారంభించినట్లు వెల్లడించారు. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు కూడా ఇక్కడ రెండు టైటిల్స్ గెలిచిందన్నారు. హస్త కళలను ఆదరించడం, కళాకారులను ప్రోత్సహించడంలో భాగంగానే స్వదేశ్‌ స్టోర్‌ను ఏర్పాటు చేసినట్లు నీతా అంబానీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీనటుడు రాంచరణ్, ఉపాసన దంపతులు, మంచు లక్ష్మి, నమ్రతా, పీవీ సింధు, సానియా మీర్జా తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని