Samsung: 60 రోజుల్లో ₹14,400 కోట్ల శాంసంగ్ ఫోన్ల అమ్మకాలు.. 5జీకి పెరుగుతున్న డిమాండ్!
సెప్టెంబర్- అక్టోబర్ నెలల్లో రూ.14,400 కోట్ల విలువైన ఫోన్లు అమ్ముడైనట్లు శాంసంగ్ తెలిపింది. 5జీ ఫోన్ల విక్రయాలు భారీ పెరిగినట్లు పేర్కొంది.
దిల్లీ: దేశంలో స్మార్ట్ఫోన్ విక్రయాలు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఈ పండగ సీజన్లో వీటి అమ్మకాలు జోరుగా సాగాయి. ఒక్క సెప్టెంబర్- అక్టోబర్ నెలల్లోనే తాము రూ.14,400 కోట్ల విలువైన ఫోన్లు విక్రయించినట్లు శాంసంగ్ ఇండియా తెలిపింది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు (మొదటి మూడు త్రైమాసికాల్లో) రికార్డు స్థాయిలో 5జీ ఫోన్ల అమ్మకాలు జరిగాయని ఆ కంపెనీ సీనియర్ డైరెక్టర్ ఆదిత్య బబ్బర్ తెలిపారు. ప్రీమియం కేటగిరీలో 99 శాతం వృద్ధి నమోదైనట్లు వివరించారు.
‘‘ఈ ఏడాది పండగ సీజన్లో శాంసంగ్ భారీ స్థాయిలో విక్రయాలు జరిపింది. కేవలం 60 రోజుల్లోనే రూ.14,400 కోట్ల విలువైన స్మార్ట్ఫోన్లను విక్రయించింది’’ అని బబ్బర్ తెలిపారు. గతేడాది పండగ సీజన్తో పోలిస్తే రెండంకెల వృద్ధి నమోదైందని చెప్పారు. శాంసంగ్ ఫైనాన్స్ ప్లస్ అమ్మకాలు పెరిగేందుకు దోహదపడిందన్నారు. రూ.30వేలు కంటే ఎక్కువ విలువైన ప్రీమియం ఫోన్ల అమ్మకాలు గతేడాది కంటే 99 శాతం అధికంగా నమోదైనట్లు తెలిపారు. ఎస్22, ఫోల్డబుల్ ఫోన్స్ వంటి ఫోన్ల ద్వారా ప్రీమియం సెగ్మెంట్లో కంపెనీ వేగంగా వృద్ధి చెందుతోందన్నారు.
గతేడాది పోలిస్తే మొత్తంగా కంపెనీ వ్యాపారం 20 శాతం మేర వృద్ధి చెందిందని బబ్బర్ వెల్లడించారు. రెవెన్యూ పరంగా దేశంలో 22 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్నామని వివరించారు. వినియోగదారులు ఎక్కువ మంది 5జీ, ప్రీమియం ఫోన్లవైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. 5జీ సదుపాయం కలిగిన 20 ఫోన్లను తాము విక్రయిస్తున్నామని, వీటి ధరలు రూ.10,900 నుంచి ప్రారంభమవుతున్నాయని పేర్కొన్నారు. అన్ని 5జీ డివైజులకూ నవంబర్ 15 నాటికి సాఫ్ట్వేర్ అప్డేట్ ప్రక్రియ పూర్తి చేస్తామని, ఇప్పటికే కొన్ని డివైజులు 5జీ నెట్వర్క్కు సపోర్ట్ చేస్తున్నాయని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా మరింత భారం
పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చులను తట్టుకునేందుకు ఆరోగ్య బీమా తప్పనిసరిగా మారింది. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఇటీవలి కాలంలో ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేసింది. -
కేకేఆర్ చేతికి హెల్తియమ్ మెడ్టెక్
సర్జికల్ సూదుల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు సంస్థ హెల్తియమ్ మెడ్టెక్లో మెజార్టీ వాటాను, అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల సంస్థ కేకేఆర్ రూ.7,000 కోట్ల (840 మిలియన్ డాలర్ల)కు కొనుగోలు చేయనుందని తెలిసింది. -
సైబర్ దాడులు.. మనపై ఎక్కువే
అమెరికా, బ్రిటన్ తర్వాత అంతర్జాతీయంగా ‘ఫిషింగ్’ దాడులను అత్యధికంగా ఎదుర్కొంటున్నది మన దేశమే. భారత దేశంపై జరిగిన సైబర్ దాడుల్లో 33% టెక్నాలజీ రంగంపైనే కనిపించాయని స్కేలర్ అనే సైబర్ భద్రతా సంస్థ తన నివేదికలో పేర్కొంది. -
ప్రయాణ - పర్యాటకంలో 5.82 కోట్ల ఉద్యోగాలు!
దేశీయంగా పర్యాటకానికి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఆ రంగంతో పాటు ప్రయాణ రంగంలోనూ ఉపాధికి భారీ అవకాశాలు కలగనున్నాయి. -
ఎయిరిండియా క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితి తగ్గింపు
దేశీయ మార్గాల్లో క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితిని ఈనెల 2 నుంచి తగ్గించినట్లు ఎయిరిండియా తెలిపింది. తక్కువ ధర ఉండే ఎకానమీ తరగతి ప్రయాణికులు ఇకపై 15 కిలోలే ఉచితంగా క్యాబిన్ లగేజీగా తీసుకెళ్లొచ్చని వెల్లడించింది. -
కోటక్ బ్యాంక్ లాభం రూ.5,302 కోట్లు
ప్రైవేటు రంగ కోటక్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.5,302 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభంతో పోలిస్తే ఇది 25% అధికం. -
రెండేళ్లలో మళ్లీ చిన్న కార్ల హవా
దేశీయ విపణిలో చిన్న కార్ల విభాగం 2026 చివరికల్లా లేదా 2027 నాటికి పుంజుకునే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా అంచనా వేస్తోంది. -
రూ.15,000 కోట్ల రుణాల కోసం వొడాఫోన్ ఐడియా యత్నాలు!
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకులతో పాటు ప్రైవేటు రంగ బ్యాంకుల నుంచీ రూ.15,000 కోట్ల (1.8 బిలియన్ డాలర్ల) రుణాలు తీసుకునేందుకు వొడాఫోన్ ఐడియా చర్చలు సాగిస్తోందని సమాచారం. -
మన ఎగుమతులకు అంతర్జాతీయ అనిశ్చితులే బెంగ
అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటం వల్ల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సంఘం ఫియో అంచనా వేస్తోంది. -
పేటీఎం సీఓఓ భవీశ్ గుప్తా రాజీనామా
పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ అధికారి (సీఓఓ) భవీశ్ గుప్తా రాజీనామా చేశారు. పేటీఎంలో రుణ వ్యాపారం, ఆన్లైన్, ఆఫ్లైన్ చెల్లింపులు, కాంప్లియెన్సెస్ తదితర విభాగాలను భవీశ్ నడిపించేవారు. -
సంక్షిప్త వార్తలు
డీమార్ట్ సూపర్మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్, మార్చి త్రైమాసికంలో రూ.563 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.460 కోట్లతో పోలిస్తే, ఇది 22.39% అధికం. -
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
layoffs: ప్రపంచవ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే 20 వేల మందిని సాగనంపాయి.
తాజా వార్తలు (Latest News)
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్