Stock Market: భారీగా పుంజుకున్న మార్కెట్లు.. 58,000 ఎగువకు సెన్సెక్స్!
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని బలమైన సంకేతాలు, రూపాయి పుంజుకోవడం, దిగ్గజ షేర్లు రాణించడం సూచీల లాభాలకు దన్నుగా నిలిచాయి.
ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని బలమైన సంకేతాలు, రూపాయి పుంజుకోవడం వంటి అంశాలు మంగళవారం దేశీయ స్టాక్మార్కెట్ సూచీల ర్యాలీకి దోహదం చేశాయి. నిఫ్టీ50 ఇంట్రాడేలో 300 పాయింట్లకు పైగా పెరిగి 17,200 ఎగువకు చేరింది. సెప్టెంబరు 23 తర్వాత నిఫ్టీ మళ్లీ ఈ స్థాయిని అందుకుంది. మరోవైపు సెన్సెక్స్ 1,200 పాయింట్లకు పైగా ఎగబాకి 58,099.94 వద్ద గరిష్ఠానికి చేరింది. మరోవైపు బజాజ్, హెచ్డీఎఫ్సీ జంట షేర్లు, టీసీఎస్, రిలయన్స్ వంటి దిగ్గజాలు రాణించడం కూడా సూచీల పరుగుకు కారణమైంది. నిఫ్టీ మిడ్ క్యాప్100, నిఫ్టీ స్మాల్క్యాప్ 100 సూచీలు సైతం 1 శాతానికి పైగా పెరిగాయి. మరోవైపు ఐటీ, బ్యాంకింగ్, లోహ రంగ షేర్లలో కొనుగోళ్ల జోరు కొనసాగింది.
ఈ నెల మొత్తం బుల్లిష్ సెంటిమెంట్ కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత దశాబ్ద కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఎనిమిది సంవత్సరాలు మార్కెట్లు ఈ నెలలో రాణించిన దాఖలాలు ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు అమెరికా డాలర్, ట్రెజరీ బాండ్ల వడ్డీలు తగ్గుముఖం పట్టడం కూడా సూచీలకు కలిసొచ్చే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ఇదే పోకడ కొనసాగితే.. ఈ నెలలో విదేశీ మదుపర్లు తిరిగి భారత్లో పెట్టుబడులు కుమ్మరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
సెన్సెక్స్ ఉదయం 57,506.65 పాయింట్ల వద్ద భారీ లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడే ట్రేడింగ్లో 58,099.94 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 1276.66 పాయింట్ల లాభంతో 58,065.47 వద్ద ముగిసింది. 17,147.45 వద్ద ప్రారంభమైన నిఫ్టీ 386.95 పాయింట్లు ఎగబాకి 17,274.30 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,287.30 వద్ద గరిష్ఠాన్ని తాకింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.81.52 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 30 షేర్లలో పవర్గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, సన్ఫార్మా మాత్రమే నష్టపోయాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, బజాజ్ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, టాటా స్టీల్, ఎల్అండ్టీ, విప్రో, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, ఇన్ఫోసిస్ రాణించిన షేర్లలో ఉన్నాయి.
ఈ రోజు మార్కెట్ల ర్యాలీకి దోహదం చేసిన నాలుగు కీలక అంశాలు..
బలమైన అంతర్జాతీయ సంకేతాలు: గతవారం భారీగా కుంగిన అమెరికా మార్కెట్లు సోమవారం బలంగా పుంజుకున్నాయి. అక్కడి మూడు ప్రధాన సూచీలైన నాస్డాక్, ఎస్అండ్పీ 2 శాతం, డోజోన్స్ ఫ్యూచర్స్ 0.8 శాతం లాభపడింది. నేడు ఆసియా-పసిఫిక్ సూచీలు సైతం అమెరికా మార్కెట్ల బాటలోనే పయనించాయి. సంపన్నులపై పన్నును తొలగించాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించడమే ప్రపంచ మార్కెట్ల రాణించడానికి దోహదం చేసింది.
విదేశీ మదుపర్ల కొనుగోళ్లు: రెండు నెలల విరామం తర్వాత సెప్టెంబరులో తిరిగి నికర అమ్మకందారులుగా నిలిచిన విదేశీ మదుపర్లు.. అక్టోబరు నెలను కొనుగోళ్లతో ప్రారంభించారు. సోమవారం రూ.590 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
రూపాయికి బలం: గతకొన్ని రోజులుగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న రూపాయి.. నిన్న, ఈరోజు గణనీయంగా పుంజుకుంది. మరోవైపు డాలర్ బలహీనపడడం కూడా మదుపర్ల సెంటిమెంటును పెంచింది.
దిగ్గజ షేర్లకు కొనుగోళ్లు: పై సానుకూలతల నేపథ్యంలో దిగ్గజ షేర్లయిన బజాజ్, హెచ్డీఎఫ్సీ జంట షేర్లు, టీసీఎస్, ఐటీసీ, రిలయన్స్ రాణించడం కూడా మార్కెట్లకు కలిసొచ్చింది.
మార్కెట్లోని ఇతర సంగతులు..
☞ బ్రెంట్ ముడి చమురు ధరలు ఇటీవలి కనిష్ఠాల నుంచి పెరిగి బ్యారెల్ ధర 89 డాలర్లకు చేరిన నేపథ్యంలో పెయింట్స్ స్టాక్ ఈరోజు మిశ్రమంగా స్పందించాయి. ఏషియన్ పెయింట్స్, బెర్జర్ పెయింట్స్, శాలిమార్ పెయింట్స్, ఇండిగో పెయింట్స్ రాణించగా.. నెరోలాక్, అక్జో నోబెల్ డీలాపడ్డాయి.
☞ ఐనాక్స్ విండ్ ఎనర్జీ షేరు ఇంట్రాడేలో 5 శాతానికి పైగా పెరిగి రూ.1,010 వద్ద రికార్డు గరిష్ఠానికి చేరింది. గత ఆరు వారాల్లో ఈ షేరు ధర 101 శాతం పుంజుకోవడం గమనార్హం. గత వారం రోజుల్లో 26 శాతం పెరిగింది. పునరుత్పాదక ఇంధన రంగానికి ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ స్టాక్ రాణిస్తోందని నిపుణులు అంటున్నారు. ఈరోజు 4.49 శాతం లాభంతో రూ.1,000 వద్ద స్థిరపడింది.
☞ భారీ క్రయవిక్రయాల నేపథ్యంలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు ఇంట్రాడేలో 10 శాతానికి పైగా పుంజుకుని రూ.53.75 వద్ద రికార్డు గరిష్ఠాన్ని తాకాయి. గత మూడు నెలల్లో ఈ స్టాక్ ధర 60 శాతం పెరగడం గమనార్హం. చివరకు ఈరోజు 8.11 శాతం లాభంతో రూ.53.35 వద్ద ముగిసింది.
☞ బ్లూడార్ట్ ఎక్స్ప్రెస్ షేర్లు గతవారం రోజుల్లో 14 శాతం పెరిగాయి. వచ్చే ఏడాది షిప్మెంట్ ఛార్జీలను 10 శాతం పెంచనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. చివరకు ఈ షేరు 4.08 శాతం లాభపడి రూ.9370 వద్ద స్థిరపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం