AMTD Digital: ₹619 పెట్టుబడికి ₹2 లక్షల లాభం.. నమ్మశక్యంగా లేదా?
AMTD Digital: ఏఎంటీడీ డిజిటల్ అనే కంపెనీ కేవలం మూడు వారాల్లో 32,000 శాతం రిటర్న్స్తో మదుపర్లకు లాభాల కుంభవృష్టి కురిపించింది...
న్యూయార్క్: ఉక్రెయిన్-రష్యా యుద్ధం సహా పలు కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు (Stock Market) గతకొన్ని నెలలుగా తీవ్ర ఒడుదొడుకుల్లో చలిస్తున్నాయి. అయితే, జులై నుంచి పరిస్థితి కొంత మెరుగుపడింది. ఏప్రిల్, జూన్ నాటి కనిష్ఠాలతో పోలిస్తే సూచీలు క్రమంగా కోలుకుంటున్నాయి. ఏదేమైనప్పటికీ.. ఈ తరుణంలో మార్కెట్లోకి ప్రవేశించడానికి సామాన్య మదుపర్లు జంకుతున్నారనే చెప్పాలి. లాభాల మాట అటుంచితే.. నష్టాలు రాకుండా ఉంటే చాలనుకునేవారే ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ఓ స్టాక్ 32,000 శాతం లాభం ఇస్తే ఎలా ఉంటుంది? బుల్ మార్కెట్లోనూ సాధ్యం కాని ఈ అనూహ్య పరిణామం ఇప్పుడు జరిగిందంటే నమ్మశక్యంగా లేదు కదా! కానీ, దీన్ని మీరు నమ్మాల్సిందే. ఎందుకంటే.. హాంకాంగ్ కేంద్రంగా పనిచేస్తున్న ఏఎంటీడీ డిజిటల్ (AMTD Digital) మదుపర్లకు లాభాల కుంభవృష్టి కురిపించింది మరీ!
ఏఎంటీడీ డిజిటల్ (AMTD Digital) జులై 15న న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదైంది. దీని ఇష్యూ ధర 7.80 డాలర్లు కాగా.. 16.81 డాలర్ల వద్ద లిస్టయ్యింది. అంటే లిస్టింగ్లోనే 115 శాతం లాభాన్నిచ్చింది. అంతటితో ఆగలేదు. బుధవారం (ఆగస్టు 3, 2022) స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి ఈ స్టాక్ ధర 11,00 డాలర్లు. అంటే కేవలం మూడు వారాల్లో ఇష్యూ ధరతో పోలిస్తే మదుపర్లకు 1,4002 శాతం రాబడినిచ్చింది. మరోవైపు ఈ స్టాక్ ఆగస్టు 2న 2,555.30 డాలర్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఐపీఓలో షేర్లు దక్కించుకొని ఈ ధర వద్ద విక్రయించిన వారికి దాదాపు 32,660 శాతం రాబడి వచ్చింది. ఈ పరిణామాన్ని సులువుగా అర్థం చేసుకోవడానికి మన కరెన్సీలో చెప్పుకొంటే.. దాదాపు రూ.619 వద్ద ఐపీఓలో షేరు దక్కించుకొని ఆగస్టు 2న బయటకొచ్చిన వారికి ఒక్కో షేరుపై రూ.2,02,395 లాభం వచ్చింది. అదే ఇప్పటికీ షేరును అట్టిపెట్టుకొని ఉండి ఉంటే ఆ షేరు ధర రూ.87,378.50గా ఉంది.
డిజిటల్ బిజినెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యకలాపాల్లో ఉన్న ఈ సంస్థ ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ 203 బిలియన్ డాలర్లు. ఈ విషయంలో ఆర్థిక దిగ్గజాలైన వెల్స్ ఫార్గో, మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్మన్ శాక్స్ సంస్థల్ని సైతం దాటేసింది. పైగా ఏప్రిల్ 2021 నాటికి ఈ కంపెనీ ఆదాయం 25 మిలియన్ డాలర్లే కావడం గమనార్హం. మార్కెట్ విలువ పరంగా ఇప్పుడు ఈ కంపెనీ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక సంస్థ. బెర్క్షైర్ హాత్వే, జేపీ మోర్గాన్ చేజ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా వంటి దిగ్గజాల సరసన చేరింది.
అయితే, ఈ స్టాక్ ఈ స్థాయిలో రాణించడానికి కారణం ఏంటన్నది చాలా మందికి అంతుచిక్కడం లేదు. తక్కువ పరిమాణంలో స్టాక్స్ని ఆఫర్లో ఉంచడం వల్ల డిమాండ్ పెరిగి స్టాక్ ఎగబాకినట్లు కొంతమంది నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఏఎంటీడీ గ్రూప్ కింద ఉన్న ఏఎంటీడీ ఐడియా షేర్లు సైతం గణనీయంగా పుంజుకున్నాయి. జులై 15 నుంచి ఈ కంపెనీ షేరు విలువ 458 శాతం ఎగబాకింది. స్టాక్ ఇలా అనూహ్యంగా పెరగడంపై ఏఎంటీడీ డిజిటల్ స్పందించింది. స్టాక్ ధరను ప్రభావితం చేస్తున్న అనుచిత కార్యకలాపాలేవీ తాము గుర్తించలేదని తెలిపింది.
ఏఎంటీడీ డిజిటల్ను కెల్విన్ ఛొయ్ ముందుకు నడిపిస్తున్నారు. ఈయనపై హాంకాంగ్లో నిషేధం కొనసాగుతోంది. కొన్ని కీలక వివరాలు వెల్లడించలేదన్న ఆరోపణలపై ఆయన ఈ నిషేధాన్ని ఎదుర్కొంటున్నారు. ఐదేళ్ల పాటు యూబీఎస్లో పనిచేసిన ఆయన 2016లో ఏఎంటీడీలో చేరారు. ప్రపంచ కుబేరుల జాబితాలో 30వ స్థానంలో ఉన్న లి కా-షింగ్ నేతృత్వంలోని సీకే హచిసన్ హోల్డింగ్స్ లిమిటెడ్.. ఈ ఏఎంటీడీ కంపెనీలకు మాతృసంస్థ. ఏఎంటీడీ గ్రూప్లో 32.5 శాతం వాటాలున్న ఏఎంటీడీ డిజిటల్కు ఛొయ్ ఒక్కరే ప్రమోటర్గా ఉన్నారు. హాంకాగ్కు చెందిన ఈయనకు కెనడా పౌరసత్వం ఉంది. వాటర్లూ యూనివర్శిటీలో అకౌంటింగ్లో పట్టాపుచ్చుకున్న ఛొయ్.. తర్వాత కార్పొరేట్ రంగంలోకి అడుగుపెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM