Sept 30 Deadline: పాన్, ఆధార్ సమర్పించారా? లేదంటే ఆ ఖాతాలు స్తంభించిపోతాయ్!
Sept 30 Deadline: పీపీఎఫ్, ఎస్ఎస్వై సహా పలు చిన్న మొత్తాల పొదుపు పథకాలకు పాన్, ఆధార్ తప్పనిసరిగా సమర్పించాలి.
Sept 30 Deadline | ఇంటర్నెట్ డెస్క్: చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో (small savings schemes) మదుపు చేస్తున్న వారు తప్పనసరిగా పాన్ (PAN), ఆధార్ (Aadhaar) వివరాలను సమర్పించాలి. అందుకు 2023 సెప్టెంబరు 30తో గడువు ముగియనుంది (Sept 30 Deadline). వివరాలను సమర్పించని వారి ఖాతాలను స్తంభింపజేస్తారు. తిరిగి ఆయా పత్రాలు సమర్పించే వరకు ఖాతాలను నిర్వహించడం కుదరదు. అంటే ఎలాంటి లావాదేవీలు జరపడానికి ఆస్కారం ఉండదు.
ఇప్పటికే పాన్ (PAN), ఆధార్ (Aadhaar) వివరాలను సమర్పించిన ఖాతాదారులు మరోసారి ఇవ్వాల్సిన అవసరం లేదు. 2023 ఏప్రిల్ 1 తర్వాత చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో (Small savings schemes) ఇన్వెస్ట్ చేస్తున్నవారికి ప్రభుత్వం పాన్ను తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కొత్తగా ఖాతాలు తీసుకున్నవారు తిరిగి ఆయా పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు.
పొదుపు తగ్గి అప్పు పెరుగుతోందా? ఈ వ్యూహాలను అనుసరిద్దాం!
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) సహా పలు ఇతర పథకాలు చిన్న మొత్తాల పొదుపు పథకాల (Small savings schemes) కిందకు వస్తాయి. చాలా మంది సామాన్యులు వీటిలో మదుపు చేస్తుంటారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్, నష్ట భయం పెద్దగా భరించలేని చిరుద్యోగుల్లో వీటికి ఆదరణ బాగా ఉంటుంది. వీటిపై వడ్డీరేట్లను ప్రభుత్వం ప్రతి మూడునెలలకోసారి సమీక్షిస్తుంటుంది. 2023 జులై- సెప్టెంబర్ త్రైమాసికానికి కొన్ని పథకాలపై వడ్డీరేట్లను 10 నుంచి 30 బేసిస్ పాయింట్లు పెంచింది. అయితే, ఎస్సీఎస్ఎస్ (SCSS), పీపీఎఫ్ (PPF), కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సమృద్ధి యోజన (SSY) వంటి పథకాలపై మాత్రం వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. పీపీఎఫ్ (PPF)పై వడ్డీరేటును 2020 ఏప్రిల్ నుంచి 7.1 శాతంగా కొనసాగిస్తోంది.
వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్లు..
- సేవింగ్స్ డిపాజిట్- 4%
- ఏడాది టైమ్ డిపాజిట్- 6.9%
- రెండేళ్ల టైమ్ డిపాజిట్- 7.0%
- మూడేళ్ల టైమ్ డిపాజిట్- 7.0%
- ఐదేళ్ల టైమ్ డిపాజిట్- 7.5%
- ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్- 6.5%
- సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్- 8.2%
- మంత్లీ ఇన్కమ్ అకౌంట్ స్కీమ్- 7.4%
- నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్- 7.7%
- పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్- 7.1%
- కిసాన్ వికాస్ పత్ర- 7.5 %
- సుకన్య సమృద్ధి యోజన-8.0%
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది. -
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..