Sept 30 Deadline: పాన్, ఆధార్ సమర్పించారా? లేదంటే ఆ ఖాతాలు స్తంభించిపోతాయ్!
Sept 30 Deadline: పీపీఎఫ్, ఎస్ఎస్వై సహా పలు చిన్న మొత్తాల పొదుపు పథకాలకు పాన్, ఆధార్ తప్పనిసరిగా సమర్పించాలి.
Sept 30 Deadline | ఇంటర్నెట్ డెస్క్: చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో (small savings schemes) మదుపు చేస్తున్న వారు తప్పనసరిగా పాన్ (PAN), ఆధార్ (Aadhaar) వివరాలను సమర్పించాలి. అందుకు 2023 సెప్టెంబరు 30తో గడువు ముగియనుంది (Sept 30 Deadline). వివరాలను సమర్పించని వారి ఖాతాలను స్తంభింపజేస్తారు. తిరిగి ఆయా పత్రాలు సమర్పించే వరకు ఖాతాలను నిర్వహించడం కుదరదు. అంటే ఎలాంటి లావాదేవీలు జరపడానికి ఆస్కారం ఉండదు.
ఇప్పటికే పాన్ (PAN), ఆధార్ (Aadhaar) వివరాలను సమర్పించిన ఖాతాదారులు మరోసారి ఇవ్వాల్సిన అవసరం లేదు. 2023 ఏప్రిల్ 1 తర్వాత చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో (Small savings schemes) ఇన్వెస్ట్ చేస్తున్నవారికి ప్రభుత్వం పాన్ను తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కొత్తగా ఖాతాలు తీసుకున్నవారు తిరిగి ఆయా పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు.
పొదుపు తగ్గి అప్పు పెరుగుతోందా? ఈ వ్యూహాలను అనుసరిద్దాం!
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) సహా పలు ఇతర పథకాలు చిన్న మొత్తాల పొదుపు పథకాల (Small savings schemes) కిందకు వస్తాయి. చాలా మంది సామాన్యులు వీటిలో మదుపు చేస్తుంటారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్, నష్ట భయం పెద్దగా భరించలేని చిరుద్యోగుల్లో వీటికి ఆదరణ బాగా ఉంటుంది. వీటిపై వడ్డీరేట్లను ప్రభుత్వం ప్రతి మూడునెలలకోసారి సమీక్షిస్తుంటుంది. 2023 జులై- సెప్టెంబర్ త్రైమాసికానికి కొన్ని పథకాలపై వడ్డీరేట్లను 10 నుంచి 30 బేసిస్ పాయింట్లు పెంచింది. అయితే, ఎస్సీఎస్ఎస్ (SCSS), పీపీఎఫ్ (PPF), కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సమృద్ధి యోజన (SSY) వంటి పథకాలపై మాత్రం వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. పీపీఎఫ్ (PPF)పై వడ్డీరేటును 2020 ఏప్రిల్ నుంచి 7.1 శాతంగా కొనసాగిస్తోంది.
వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్లు..
- సేవింగ్స్ డిపాజిట్- 4%
- ఏడాది టైమ్ డిపాజిట్- 6.9%
- రెండేళ్ల టైమ్ డిపాజిట్- 7.0%
- మూడేళ్ల టైమ్ డిపాజిట్- 7.0%
- ఐదేళ్ల టైమ్ డిపాజిట్- 7.5%
- ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్- 6.5%
- సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్- 8.2%
- మంత్లీ ఇన్కమ్ అకౌంట్ స్కీమ్- 7.4%
- నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్- 7.7%
- పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్- 7.1%
- కిసాన్ వికాస్ పత్ర- 7.5 %
- సుకన్య సమృద్ధి యోజన-8.0%
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
YouTube: యూట్యూబ్లో ఇక కామెంట్లను పాజ్ చేయొచ్చు!
YouTube: కంటెంట్ క్రియేటర్లకు వారి కామెంట్ సెక్షన్పై మరింత నియంత్రణ కల్పించేందుకు యూట్యూబ్ కొత్త ఫీచర్ని అందుబాటులోకి తెచ్చింది. -
Royal Enfield: తుపాను బాధిత కస్టమర్లకు రాయల్ ఎన్ఫీల్డ్ సాయం
Royal Enfield: ప్రముఖ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని తమ కస్టమర్లకు సాయం ప్రకటించింది. -
boAt smartwatch: జియో e-సిమ్తో బోట్ తొలి స్మార్ట్వాచ్
boAt Lunar Pro LTE: ఇ-సిమ్ సపోర్ట్తో బోట్ తొలి స్మార్ట్వాచ్ తీసుకొస్తోంది. అంటే కాల్స్, మెసేజులు వంటి వాటికి ఇక స్మార్ట్ఫోన్ అక్కర్లేదు. -
Wheat: గోధుమ ధరల కట్టడికి ప్రభుత్వం చర్యలు.. నిల్వల పరిమితి మరింత కుదింపు
Wheat: టోకు, రిటైల్, బిగ్ చైన్ రిటైల్ వ్యాపారుల వద్ద ఉండాల్సిన గోధుమల నిల్వల పరిమితిని మరింత కుదిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
వాట్సప్లో ఇకపై వాయిస్ మెసేజ్లకు ‘వ్యూ వన్స్’.. త్వరలో ఈ ఫీచర్ కూడా..
WhatsApp: వ్యక్తిగత చాట్ల భద్రతలో భాగంగా ఇప్పటివరకు ఎన్నో ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిన వాట్సప్ ఇప్పుడు మరో ఫీచర్ని తీసుకొచ్చింది. -
Special Deposits: స్పెషల్ ఎఫ్డీలపై వడ్డీ రేట్లు ఎంతెంత?
అనేక బ్యాంకులు స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్లను ఆఫర్ చేస్తున్నాయి. సాధారణ ఎఫ్డీలతో పోలిస్తే స్పెషల్ ఎఫ్డీలపై వడ్డీ రేట్లు కొద్దిగా అదనంగా ఉంటున్నాయి. -
Infinix Smart 8 HD: ‘మ్యాజిక్ రింగ్’తో ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 8 హెచ్డీ ఫోన్.. ధర, ఫీచర్లివే!
Infinix Smart 8 HD: స్మార్ట్ 7 హెచ్డీకి కొనసాగింపుగా స్మార్ట్ 8 హెచ్డీ ఫోన్ను ఇన్ఫీనిక్స్ శుక్రవారం భారత్లో విడుదల చేసింది. ఈ ఫోన్ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం! -
డిజిటల్ రుణాలపై ఆర్బీ‘ఐ’.. లోన్ అగ్రిగేటర్లకు త్వరలో రూల్స్
RBI on Digital loans: డిజిటల్ రుణాలపై ఆర్బీఐ దృష్టి సారించింది. లోన్ అగ్రిగేటర్ల కోసం త్వరలో కొత్త నిబంధనలను తీసుకురానుంది. -
Stock Market: ఆర్బీఐ ఎఫెక్ట్.. తొలిసారి 21,000 మార్క్ అందుకున్న నిఫ్టీ!
Stock Market Closing bell: సెన్సెక్స్ 303.91 పాయింట్లు పుంజుకొని 69,825.60 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 68.25 పాయింట్లు లాభపడి 20,969.40 వద్ద ముగిసింది. -
Tata group: మరో ఐఫోన్ల ప్లాంట్కు టాటాలు రెడీ.. 50 వేల మందికి ఉపాధి!
Tata group- iphone: టాటా గ్రూప్ మరో అతిపెద్ద ఐఫోన్ ప్లాంట్ను నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది. దీనిద్వారా 50 వేల మందికి ఉపాధి లభించనుంది. -
UPI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఆటో డెబిట్, ఆ యూపీఐ చెల్లింపుల పరిమితి పెంపు
UPI payments: ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ సమీక్ష నిర్ణయాలను శుక్రవారం వెల్లడించింది. రెపోరేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. మరోవైపు యూపీఐ, ఆటో డెబిట్ పరిమితి విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంది. -
Flipkart: ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్
Flipkart Year End Sale: ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ తేదీలను ప్రకటించింది. పెద్ద ఎత్తున క్యాష్బ్యాక్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఈ సేల్ను తీసుకొచ్చినట్లు వెల్లడించింది. -
India Shelter Finance IPO: 13న ఇండియా షెల్టర్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి రూ.469-493
India Shelter Finance IPO: రూ.1,200 కోట్ల సమీకరణే లక్ష్యంగా ఇండియా షెల్టర్ ఫైనాన్స్ ఐపీఓ ఈ నెల 13న ప్రారంభం కానుంది. -
Onion Exports: ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం..
Onion Exports: దేశంలో ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి వరకు వీటి ఎగుమతులపై నిషేధం విధించింది. -
RBI: ఐదోసారీ వడ్డీరేట్లు యథాతథం.. వృద్ధిరేటు అంచనాల పెంపు
RBI: ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. -
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market Opening bell | ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 195 పాయింట్ల లాభంతో 69,716 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 66 పాయింట్లు పెరిగి 20,967 దగ్గర ట్రేడవుతోంది. -
ఐటీ సెజ్ల్లో స్థలాలకు గిరాకీ
ఐటీ/ఐటీఈఎస్ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)ని అభివృద్ధి చేసిన ఒక డెవలపర్ విజ్ఞప్తి నేపథ్యంలో.. అందులో ప్రాసెసింగేతర ప్రాంతాలకు సెజ్ హోదాను రద్దు చేసే అధికారం అంతర్ మంత్రిత్వ శాఖల బోర్డుకు ఉందని ఒక అధికారిక నోటిఫికేషన్ స్పష్టం చేసింది. -
వచ్చే బడ్జెట్లో అద్భుత ప్రకటనలుండవు
వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న వెల్లడించే తన ఆరో బడ్జెట్లో ‘అద్భుత ప్రకటనలు’ ఉండవని, సార్వత్రిక ఎన్నికలకు ముందు కేవలం ఓట్ ఆన్ అకౌంట్గానే సమర్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్- మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం, కొత్త ప్రభుత్వం జులైలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుందని సీఐఐ గ్లోబల్ ఎకనమిక్ పాలసీ ఫోరమ్లో మంత్రి తెలిపారు. -
సంస్థల్లో నియామకాలు 12% తగ్గాయ్
వేర్వేరు రంగాల కార్యాలయాల్లో నైపుణ్యంతో కూడిన (వైట్-కాలర్) ఉద్యోగాల నియామకాలు గత 2 నెలల్లో తగ్గినట్లు నౌకరీ జాబ్స్పీక్ సూచీ నివేదిక వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఉద్యోగ పోస్టింగ్లు 2022 అక్టోబరు, నవంబరులో 2781 కాగా, ఈ ఏడాది అదే సమయంలో 12 శాతం తగ్గి 2,433 కు పరిమితమయ్యాయని తెలిపింది. -
2025కు పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 170 గిగా వాట్లకు: ఇక్రా
దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 2025 నాటికి 170 గిగా వాట్లకు చేరుకుంటుందని ఇక్రా వైస్ ప్రెసిడెంట్, సెక్టార్ హెడ్ - కార్పొరేట్ రేటింగ్స్ వి.విక్రమ్ అంచనా వేశారు. ప్రస్తుతం దేశీయ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 130 గిగా వాట్లుగా ఉంది. -
ఏడు రోజుల జోరుకు విరామం
సూచీల ఏడు రోజుల వరుస లాభాలకు గురువారం అడ్డుకట్ట పడింది. ఇటీవల భారీగా పెరిగిన షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించడమే ఇందుకు కారణం. బలహీన అంతర్జాతీయ సంకేతాలు ప్రభావం చూపాయి. ఆర్బీఐ పరపతి నిర్ణయాలు శుక్రవారం (నేడు) వెలువడనుండటంతో, మదుపర్లు కొంత అప్రమత్తత పాటించారు.


తాజా వార్తలు (Latest News)
-
Rashmika: ఒక నటిగా సందీప్ను ఎన్నోసార్లు ప్రశ్నించా..: రష్మిక
-
JK: కశ్మీర్లో స్టేడియానికి జనరల్ బిపిన్ రావత్ పేరు
-
Renu Desai: అంకుల్ మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది.. రేణూ దేశాయ్ వ్యంగ్యాస్త్రాలు
-
Chauhan: ఆ ఈగో వల్లే కాంగ్రెస్ ఓడింది.. సీఎం చౌహాన్
-
Nara Lokesh: శనివారం నుంచి లోకేశ్ పాదయాత్ర .. ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
-
Prakasam: గుండ్లకమ్మ ప్రాజెక్టులో కొట్టుకుపోయిన రెండో గేటు