Digital identity: షాకింగ్.. 6 లక్షల మంది భారతీయుల డేటాను అమ్మేశారు!
ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మంది వ్యక్తుల డేటాను (Personal data) హ్యాకర్లు చోరీ చేసి బాట్ మార్కెట్లో విక్రయించినట్లు వెల్లడైంది. అందులో అత్యధికంగా భారత్ నుంచే 6 లక్షల మంది వివరాలు ఉన్నాయని తేలింది.
ఇంటర్నెట్ డెస్క్: సాంకేతికత ఏ స్థాయిలో వృద్ధి చెందుతోందో సైబర్మోసాలూ (Cyber crimes) అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి వెలుగుచూసింది. ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మంది వ్యక్తుల డేటాను (Personal data) హ్యాకర్లు చోరీ చేసి బాట్ మార్కెట్లో విక్రయించినట్లు వెల్లడైంది. అందులో అత్యధికంగా భారత్ నుంచే 6 లక్షల మంది వివరాలు ఉన్నాయని వీపీఎన్ సర్వీస్ ప్రొవైడర్ నార్డ్ వీపీఎన్ (Nord VPN) తన అధ్యయనంలో పేర్కొంది. 2018 నుంచి గత నాలుగేళ్లుగా బాట్ మార్కెట్లో విక్రయానికి ఉంచిన వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది.
బాట్ మాల్వేర్ (Bot malware) సాయంతో వ్యక్తుల డివైజ్ల నుంచి సేకరించిన డేటాను హ్యాకర్లు బాట్ మార్కెట్లో విక్రయిస్తుంటారని నార్డ్ వీపీఎన్ తెలిపింది. ఇందులో యూజర్ లాగిన్ వివరాలు, కుకీస్, డిజిటల్ ఫింగర్ ప్రింట్స్, స్క్రీన్షాట్స్, ఇతర వివరాలు ఉంటాయని పేర్కొంది. ఒక్కో వ్యక్తి డిజిటల్ గుర్తింపును విక్రయించినందుకు గానూ సగటున రూ.490 చెల్లిస్తుంటారని తెలిపింది. 2018 నుంచి ఈ బాట్ మార్కెట్ అందుబాటులోకి రాగా.. జెనిసిస్ మార్కెట్, ది రష్యన్ మార్కెట్, 2 ఈజీ అనే మూడు ప్రధాన మార్కెట్లను అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించినట్లు తెలిపింది. అయితే, ఇందులో గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్కు సంబంధించిన లాగిన్ వివరాలు సైతం ఉన్నాయని పేర్కొంది.
ఈ సందర్భంగా డార్క్ వెబ్కీ, బాట్ మార్కెట్కూ మధ్య తేడాను సైతం నార్డ్ వివరించింది. బాట్ మార్కెట్ కావాలనుకుంటే.. ఒక ప్రదేశంలో ఒక వ్యక్తికి సంబంధించిన డేటాను అధికమొత్తంలో పొందగలదని తెలిపింది. అంతేకాదు.. బాట్ మాల్వేర్ ద్వారా ఇన్ఫెక్ట్ అయినంత కాలం సంబంధిత డేటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తామన్న హామీ కొనుగోలుదారులకు ఉంటుందని నార్డ్ వీపీఎన్ పేర్కొంది. ఇప్పటి వరకు విక్రయించిన డేటాలో 81 వేల డిజిటల్ ఫింగర్ ప్రింట్లు, 5.38 లక్షల ఆటో ఫిల్ఫార్మ్స్తో పాటు అనేక డివైజుల స్క్రీన్ షాట్లు, వెబ్కామ్ స్నాప్స్ ఉన్నాయని నార్డ్ వీపీఎన్ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్