Twitter: ఆఫీసులోనే పడుకొని మరీ కష్టపడింది.. చివరకు ఉద్యోగం పోయింది
Twitter Layoffs: గడువులోగా టార్గెట్ అందుకోవడానికి గతంలో ఎస్తర్ క్రాఫోర్డ్ ఆఫీసులోనే నిద్రించారు. యాజమాన్యం మారిన నేపథ్యంలో కొత్త వేదికను సిద్ధం చేయడానికి ఇలాంటి త్యాగాలు తప్పవంటూ పరోక్షంగా ఎలాన్ మస్క్కు మద్దతుగా నిలిచారు. తాజా తొలగింపుల్లో ఆమె కూడా తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
వాషింగ్టన్: ట్విటర్ (Twitter)లో ఉద్యోగుల తొలగింపుల (Layoffs) పర్వం కొనసాగుతోంది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా కంపెనీ అధిపతి ఎలాన్ మస్క్ (Elon Musk) ఇంకా ఉద్యోగులకు ఉద్వాసన (Layoffs) పలుకుతూనే ఉన్నారు. తాజాగా మరో 200 మంది ఉద్యోగులను ఇంటి బాట పట్టించినట్లు ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం పేర్కొంది. తొలగించిన విషయాన్ని ఉద్యోగులకు కొందరికి ఇ-మెయిల్స్ ద్వారా.. మరికొందరికి లాగిన్ యాక్సెస్ నిరాకరించడం ద్వారా తెలియజేసినట్లు సమాచారం.
తాజాగా తొలగించిన వారిలో ఎస్తర్ క్రాఫోర్డ్ అనే ఉన్నతోద్యోగి కూడా ఉండడం గమనార్హం. పనిచేసే ప్రదేశాన్ని ప్రేమించాలంటూ గతంలో ఆఫీసులో నేలపైనే పడుకొని వార్తల్లో నిలిచిన ఆమెను కూడా మస్క్ తొలగించారు. మస్క్ తొలగింపుల పర్వాన్ని ప్రారంభించిన కొత్తలో ఉద్యోగులకు అనేక లక్ష్యాలను నిర్దేశించిన విషయం తెలిసిందే. అవి అందుకోని వారిని తొలగిస్తానని హెచ్చరిక చేశారు. దీంతో ప్రొడక్ట్ విభాగానికి నేతృత్వం వహిస్తున్న ఎస్తర్.. గడువులోగా టార్గెట్ అందుకోవడానికి గతంలో ఆఫీసులోనే నిద్రించారు. యాజమాన్యం మారిన నేపథ్యంలో కొత్త వేదికను సిద్ధం చేయడానికి ఇలాంటి త్యాగాలు తప్పవంటూ పరోక్షంగా ఎలాన్ మస్క్కు ఒకరకంగా మద్దతుగా నిలిచారు. ఆమె వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో పనిచేసే ప్రదేశాన్ని ప్రేమించాలంటూ హితవు పలికారు. కానీ, అవేవీ పరిగణనలోకి తీసుకోకుండా మస్క్ ఇప్పుడు ఆమెను తొలగించేశారు.
తన ఉద్వాసనపై ఎస్తర్ క్రాఫోర్డ్ ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడడం, ఆశావహ దృక్పథంతో పనిచేయడం తప్పని తెలిసొచ్చిందని వాపోయారు. ఎస్తర్ 2020లో ట్విటర్లో చేరారు. ఆమె గతంలో ‘స్క్వాడ్’ అనే స్క్రీన్ షేరింగ్ సోషల్ మీడియా యాప్నకు సీఈఓగా వ్యవహరించారు. దీన్ని ట్విటర్ కొనుగోలు చేసింది. దీంతో ఎస్తర్ ఈ కంపెనీలో చేరారు. డిజైన్, ఇంజినీరింగ్, ప్రొడక్ట్ విభాగాల్లో పనిచేశారు. తాజాగా ఆమె ప్రొడక్ట్ టీమ్కు నేతృత్వం వహించడంతో పాటు ట్విటర్ బ్లూ సబ్స్క్రిప్షన్, భవిష్యత్తులో తీసుకురాబోయే ట్విటర్ పేమెంట్స్కూ తన సేవలను అందిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటి వరకు ట్విటర్ ఎనిమిదిసార్లు ఉద్యోగులను తొలగించింది. పాత యాజమాన్యంలో 7,500 మంది ఉద్యోగులు పనిచేయగా.. ఇప్పుడు ఆ సంఖ్య 2,000కు చేరినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు