Budget 2023: పేపర్లెస్ బడ్జెట్ కోసం ప్రత్యేక యాప్.. ఫీచర్లివే..! ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
పార్లమెంట్లో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అందులోని సమాచారం సామాన్యులకు అందుబాటులో ఉండేందుకు కేంద్రం ప్రత్యేకంగా యూనియన్ బడ్జెట్ అనే వెబ్సైట్, యాప్ను తీసుకొచ్చింది.
దిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఫిబ్రవరి 1న బడ్జెట్ 2023-24 (Budget 2023)ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఐదోసారి. గత రెండు విడతల్లో మాదిరే ఈ సారి కూడా పేపర్లెస్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి ప్రకటించారు. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో తయారుచేసిన ట్యాబ్ ద్వారా మంత్రి బడ్జెట్ను చదివి వినిపించనున్నారు. పార్లమెంట్లో మంత్రి బడ్జెట్ ప్రసంగం సందర్భంగా అందులోని సమాచారం సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేందుకు యూనియన్ బడ్జెట్ (Union Budget) అనే వెబ్సైట్తోపాటు, యాప్ను కేంద్రం తీసుకొచ్చింది. మరి, ఈ యాప్ ద్వారా బడ్జెట్ ప్రతులను ఎలా చూడొచ్చు? అందులో ఏయే వివరాలు ఉంటాయనేది చూద్దాం.
- ఆర్థిక మంత్రి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత యాప్లో బడ్జెట్ పీడీఎఫ్ ప్రతులు విడుదల చేస్తారు. వాటితోపాటు మంత్రి పూర్తి బడ్జెట్ ప్రసంగం, డిమాండ్ ఫర్ గ్రాంట్స్ (DG), ఫైనాన్స్ బిల్లులు, కేటాయింపులు సహా మొత్తం బడ్జెట్కు సంబంధించిన డాక్యుమెంట్లను ఈ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- ఈ యాప్లో బడ్జెట్ హైలైట్స్ పేరుతో సెక్షన్ ఉంటుంది. ఇందులో మంత్రి బడ్జెట్ ప్రసంగం సందర్భంగా అందులోని ముఖ్యాంశాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు. మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తయిన తర్వాత ప్రసంగానికి సంబంధిన పూర్తి డాక్యుమెంట్లను సైతం ఇందులో అందుబాటులో ఉంటాయి.
ఎవరు డిజైన్ చేశారు?
డిజిటల్ ఇండియా స్ఫూర్తితో ఆర్థిక వ్యవహారాల శాఖ (DEA) సూచనలతో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) బడ్జెట్ యాప్ను డిజైన్ చేసింది. ఆరోగ్యసేతు (Arogya Setu), ఈకోర్ట్ సర్వీసెస్ (eCourt Services), మైగవర్నమెంట్(MYGOV) వంటి యాప్లను ఎన్ఐసీ డిజైన్ చేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఓఎస్లకు అనుగుణంగా ఈ యాప్ను తీర్చిదిద్దింది.
యాప్ డౌన్లోడ్ ఎలా ?
యూనియన్ బడ్జెట్ యాప్ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. యాప్ను డౌన్లోడ్ చేసే ముందు అది ఎన్ఐసీ రూపొందించి యాప్ అవునా? కాదా? అనేది తప్పనిసరిగా సరిచూసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్