Work From Home: ప్రత్యేక ఆర్థిక మండలిలో ఏడాది వరకే ‘ఇంటి నుంచి పని’
Work From Home: ఒక ప్రత్యేక ఆర్థిక మండలి(ఎస్ఈజడ్) యూనిట్లో గరిష్ఠంగా ఏడాది పాటే ‘ఇంటి నుంచి పని’ (డబ్ల్యూఎఫ్హెచ్)కి అనుమతి ఉంటుందని.. మొత్తం ఉద్యోగుల్లో 50 శాతం మందికి ఈ అవకాశం ఇవ్వొచ్చని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
గరిష్ఠంగా 50% మంది ఉద్యోగులకే అనుమతి
వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టీకరణ
దిల్లీ: ఒక ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ) యూనిట్లో గరిష్ఠంగా ఏడాది పాటే ‘ఇంటి నుంచి పని (Work From Home)’ (WFH)కి అనుమతి ఉంటుందని.. మొత్తం ఉద్యోగుల్లో 50 శాతం మందికి ఈ అవకాశం ఇవ్వొచ్చని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆ మేరకు ‘స్పెషల్ ఎకనమిక్ జోన్స్ రూల్స్ 2006’లో కొత్త నిబంధన 43ఏను వాణిజ్య విభాగం నోటిఫై చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రత్యేక ఆర్థిక మండళ్ల (SEZ) లో ఏకరీతిన డబ్ల్యూఎఫ్హెచ్ (Work From Home) విధానం ఉండడం కోసం పరిశ్రమ నుంచి వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. తాజా నిబంధనతో ఎస్ఈజడ్ (SEZ)లోని ఒక యూనిట్కు చెందిన నిర్దిష్ట విభాగ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిని ఇవ్వడానికి వీలు కలిగినట్లయింది.
ఎవరికంటే: ఐటీ/ఐటీఈఎస్ ఎస్ఈజడ్ (SEZ) యూనిట్లలోని ఉద్యోగులు
* ప్రయాణంలో ఉండే, ఆఫ్సైట్లో పనిచేసే ఉద్యోగులు
* తాత్కాలికంగా కార్యాలయానికి రాలేని ఉద్యోగులు
ఇంత మందికే..: కాంట్రాక్టు ఉద్యోగులతో కలిపి మొత్తం ఉద్యోగుల్లో గరిష్ఠంగా 50 శాతం మందికి ఇంటి నుంచి పనిని అప్పజెప్పవచ్చు.
* ఏదైనా సరైన కారణం ఉంటే, దానిని ఎస్ఈజడ్కు చెందిన డెవలప్మెంట్ కమిషనర్(డీసీ) రాతపూర్వకంగా తెలిపి, 50 శాతం కంటే ఎక్కువ మందికి సైతం అనుమతి ఇవ్వవచ్చు.
ఎంత కాలం అంటే..
* గరిష్ఠంగా ఏడాది పాటు అనుమతి ఇవ్వవచ్చు. అయితే యూనిట్ల విజ్ఞప్తి మేరకు మరో ఏడాది పాటు డీసీ దానిని పొడిగించవచ్చు.
* ఇప్పటికే ఎస్ఈజడ్ యూనిట్లకు చెందిన ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తుంటే తాజా నోటిఫికేషన్ ప్రకారం అనుమతి పొందడానికి 90 రోజుల సమయాన్ని ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు త్వరలో 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. -
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు రెండు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరైంది. -
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్గా ముగిసిన సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంతో నిఫ్టీ 33.15 పాయింట్ల నష్టంతో ముగిశాయి. -
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
Indegene IPO: రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇండీజీన్ ఐపీఓ ప్రారంభమైంది. మదుపర్లు రూ.14,916తో కనీసం 33 షేర్లకు (ఒక లాట్) బిడ్లు దాఖలు చేయాలి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,511 దగ్గర కొనసాగుతోంది. -
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
Qantas: కాంటాస్ అనే ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్యాన్సిల్ అయిన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన అక్కడి నియంత్రణా సంస్థ రూ.550 కోట్ల జరిమానా విధించింది. -
3 ఐపీఓలు.. రూ.6,400 కోట్ల లక్ష్యం
ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండీజీన్, టీబీఓ టెక్ ఐపీఓలు వస్తున్నాయి. -
లాభాలకే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు. -
75,100 పైన మరిన్ని సానుకూలతలు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. -
పురుగు మందుల అవశేషాలపై భారత్లో కఠిన నిబంధనలు: ప్రభుత్వం
ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. -
గృహ రుణ బకాయిలు పెరిగాయ్: ఆర్బీఐ
గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
ఇరాన్లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్కు చేరుకొన్న మత్స్యకారులు..!
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు