హాథ్రస్‌ కేసు: గడువు కోరిన సీబీఐ

దేశవ్యాప్త సంచలనం సృష్టించిన హాథ్రస్‌ హత్యాచార కేసు విచారణను జనవరి 27కు వాయిదా వేస్తూ అలహాబాద్‌ హైకోర్టు ఆదేశించింది. జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌, రాజన్‌ల నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఆ కేసుపై విచారణ జరిపింది.

Published : 17 Dec 2020 01:20 IST

లఖ్‌నవూ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్‌ హత్యాచార కేసు విచారణను అలహాబాద్‌ హైకోర్టు జనవరి 27కు వాయిదా వేసింది. జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌, రాజన్‌  నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఆ కేసుపై విచారణ చేపట్టింది. సీబీఐ దర్యాప్తు ఇంకా పూర్తి కానందున కేసు విచారణను జనవరి 27కు వాయిదా వేస్తున్నామని తెలిపింది. కాగా దర్యాప్తు పూర్తి చేసేందుకు మరికొంత సమయం కావాలని ధర్మాసనాన్ని సీబీఐ కోరింది. డిసెంబర్‌ 18లోపు దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పిస్తామని పేర్కొంది. 

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో సెప్టెంబర్‌ 14న ఓ యువతిపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. వారు ఆమెపై దాడి చేయడంతో.. తీవ్ర గాయాలతో పోరాడుతూ కొద్ది రోజుల తర్వాత ఆమె మరణించింది. పోలీసులు బాధితురాలి మృతదేహాన్ని కుటుంబసభ్యుల ప్రమేయం లేకుండా అర్ధరాత్రి దహనం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో యూపీ ప్రభుత్వం ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది.

ఇదీ చదవండి

లొంగిపోతారా లేక.. మానెక్‌ షా వార్నింగ్‌!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని