పెళ్లి గురించి మాట్లాడదామని పిలిచి..
బెంగళూరుకు చెందిన లక్ష్మీపతి, ఓ యువతి మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఒకే చోట పని చేస్తు్న్న వీళ్లద్దరూ పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకొని ఇంట్లో వాళ్లకు
బెంగళూరు: బెంగళూరుకు చెందిన యువకుడు లక్ష్మీపతి, ఓ యువతి మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఒకే చోట పని చేస్తున్న వీళ్లద్దరూ పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకొని ఇంట్లో వాళ్లకు చెప్పారు. మతాలు వేరు కావడంలో పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో గత నెల లక్ష్మీపతి, యువతి ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇటీవల యువతి తండ్రి లక్ష్మీపతికి ఫోన్ చేసి మాట్లాడారు. జరిగిందేదో జరిగిపోయింది.. తిరిగి వెనక్కి వచ్చేయమన్నారు. తన కూతురితో పెళ్లి చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. పెళ్లి గురించి మాట్లాడటానికి రమ్మని పిలిచారు.
తొలుత పెళ్లికి నిరాకరించిన యువతి తల్లిదండ్రులే వివాహానికి ఒప్పుకోవడంతో లక్ష్మీపతి సంతోషించారు. పెళ్లి గురించి మాట్లాడటానికి లక్ష్మీపతి అన్న నటరాజుతో కలిసి యువతి తండ్రి చెప్పిన ప్రదేశానికి వెళ్లారు. తన కూతురిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో ఉన్న యువతి తండ్రి చంపాలనే ఉద్దేశంతో పిలిపించాడని లక్ష్మీపతి తెలుసుకోలేకపోయాడు. మంగళవారం ఉదయం అన్నదమ్ములిద్దరినీ యువతి బంధువులు బెంగళూరు పట్టణ శివారు ప్రాంతానికి తీసుకెళ్లారు.
అక్కడ మద్యం సేవించిన వాళ్లు అన్నదమ్ములిద్దరినీ కొట్టారు. కులం పేరుతో వారిని దూషించారు. లక్ష్మీపతిని బెల్టుసాయంతో గొంతు బిగించి హత్య చేశారు. నటరాజ్ను సైతం కొట్టిన వాళ్లు ఈ విషయం ఎవరికైనా చెబితే ఇంటిల్లిపాదిని చంపేస్తామని బెదిరించారు. అక్కడి నుంచి బయటపడిన నటరాజ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు యువతి తండ్రి, సోదరుడిని అరెస్టు చేశారు. హత్యకు కారణమైన మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్