Crime: పైప్‌లైన్ గొయ్యిలోకి దూసుకెళ్లిన బైక్‌.. వ్యక్తి మృతి

నీటి పైపులైన్ కోసం తవ్విన గొయ్యిలోకి బైక్‌ దూకుసుపోవడంతో ఓ యువకుడు మరణించిన ఘటన ఆదివారం బెంగళూరులో చోటుచేసుకుంది. 

Published : 15 Apr 2024 12:40 IST

బెంగళూరు: నీటి పైపులైన్ కోసం తవ్విన గొయ్యిలోకి బైక్‌ దూకుసుపోవడంతో ఓ యువకుడు మరణించిన ఘటన ఆదివారం బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని కెంగేరి ప్రాంతంలో ఆదివారం ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్న బైక్ నీటి పైప్‌లైన్‌ కోసం తవ్విన గోతిలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ఆ గోతి వద్ద అధికారులు ఎటువంటి బారికేడ్‌లు, సూచికలను ఏర్పాటు చేయలేదని స్థానికులు ఆరోపించారు. బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు దీనిపై స్పందిస్తూ తాము బారికేడ్లు ఏర్పాటు చేశామని తెలిపింది. యువకులు మద్యం మత్తులో ఉండడంతో వాటిని గమనించి ఉండకపోవచ్చని పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని