మద్యం మత్తులో కారు డ్రైవర్‌ దారుణం

ద్విచక్రవాహనాన్ని కారుతో ఢీకొట్టిన డ్రైవర్‌.. వాహనంపై పడిన మృతదేహంతో 18కి.మీ దూరం ప్రయాణించిన  దారుణం అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం వై.కొత్తపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది.

Updated : 15 Apr 2024 07:50 IST

బైక్‌ను ఢీకొట్టి.. మృతదేహంతో 18 కి.మీ ప్రయాణం

ఆత్మకూరు, న్యూస్‌టుడే: ద్విచక్రవాహనాన్ని కారుతో ఢీకొట్టిన డ్రైవర్‌.. వాహనంపై పడిన మృతదేహంతో 18కి.మీ దూరం ప్రయాణించిన  దారుణం అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం వై.కొత్తపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. కూడేరు మండలం చోళసముద్రం గ్రామానికి చెందిన జిన్నే ఎర్రిస్వామి(35) ట్రాక్టర్‌ మెకానిక్‌. ఆత్మకూరు మండలంలోని పి.సిద్దరాంపురానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకొని అనంతపురంలో స్థిరపడ్డారు. వ్యక్తిగత పనులపై పి.సిద్దరాంపురం వెళ్లి ఆదివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తిరుగు ప్రయాణమయ్యారు. వై.కొత్తపల్లి సమీపంలోకి రాగానే కళ్యాణదుర్గం వైపు వెళుతున్న కారు.. ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వెళ్లి ఢీకొంది. దీంతో ఎర్రిస్వామి ఎగిరి కారుపైన పడిపోయారు. గమనించని డ్రైవర్‌ వేగంగా కళ్యాణదుర్గం వైపు వెళ్లాడు. బెళుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లి వద్ద కారుపై వ్యక్తి పడి ఉండటాన్ని వాహనదారులు గమనించి, అడ్డంగా వెళ్లి ఆపించారు. డ్రైవర్‌ కారును వదిలి పరారయ్యాడు. కారు బెంగళూరుకు చెందినదిగా గుర్తించారు. డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని