Crime News: ఆస్తి వివాదం.. తండ్రిని హతమార్చి కుమారుడి ఆత్మహత్య

ఆస్తి వివాదం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలో చోటు చేసుకుంది. ఆస్తి వివాదం కారణంగా గత కొన్ని

Published : 11 Mar 2022 01:39 IST

అద్దంకి: ఆస్తి వివాదం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలో చోటు చేసుకుంది. ఆస్తి వివాదం కారణంగా గత కొన్ని రోజులుగా కుటుంబ తగాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ తండ్రి సీతారామయ్య, కుమారుడు శంకర్రావు ఘర్షణపడ్డారు. తండ్రి సీతారామయ్యను శంకర్రావు ఇనుపరాడ్డుతో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత శంకర్రావు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకే  ఇంట్లో ఇద్దరు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని