అంతుచిక్కని అల్లోల అంతరంగం
రెండు, మూడు రోజులు ఆగండి.. సార్, కాంగ్రెస్ పెద్దోళ్లతో మాట్లాడుతున్నారు.. ఆయనతోనేే కలిసి ఆ పార్టీలో చేరుదాం.. తొందరపడి ఎటూ వెళ్లకండి అంటూ భారాసకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు పక్షం రోజులుగా ఆ పార్టీ ద్వితీయశ్రేణి నాయకులకు బుజ్జగిస్తూ వస్తున్నారు.
ఊగిసలాటలో అనుచరులు
నిర్మల్, న్యూస్టుడే: రెండు, మూడు రోజులు ఆగండి.. సార్, కాంగ్రెస్ పెద్దోళ్లతో మాట్లాడుతున్నారు.. ఆయనతోనేే కలిసి ఆ పార్టీలో చేరుదాం.. తొందరపడి ఎటూ వెళ్లకండి అంటూ భారాసకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు పక్షం రోజులుగా ఆ పార్టీ ద్వితీయశ్రేణి నాయకులకు బుజ్జగిస్తూ వస్తున్నారు. ఆ మాటలు నమ్మిన కొందరు వేచి చూస్తుండగా.. మరికొందరు ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. భారాస ప్రజాప్రతినిధులు, వివిధ పదవులు చేపట్టిన నేతలు ఒక్కొక్కరు కారు దిగిపోతున్నా.. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి మాత్రం తన అంతరంగాన్ని బయటపెట్టడం లేదు. అసలు హస్తం గూటిలో చేరుతారా.. ఆగుతారా అనేది తేలకపోవడంతో ఇన్నాళ్లూ ఆయనతో పనిచేసిన నేతలు, అనుచరులు ఊగిసలాటలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మాజీ మంత్రిని కాదని కాంగ్రెస్లో చేరిన తర్వాత కొద్ది రోజులకే ఆయన అదే పార్టీలోకి వస్తే తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం ఉంటుందోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది.
ఇప్పటికే ఆలస్యం అవుతుందని...
మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం దాదాపు 20 రోజులుగా కొనసాగుతూనే ఉంది. ఇన్నాళ్లూ ఆయనతోనే హస్తం గూటిలో చేరుదామని ఎంపీపీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ మాజీ ఛైర్మన్లు, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, భారాస వివిధ విభాగాల బాధ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు భావించినా.. ఆయనను పార్టీలో చేర్చుకోవద్దని స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వెల్లడైన విషయం తెలిసిందే. దీంతో ఆయన హస్తం పార్టీలో చేరిక వ్యవహారం ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదని భావించిన వారంతా భారాసను వీడి ‘చే’యందుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో భారాస జిల్లా అధ్యక్షుడు, ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరగా.. మామడ మండల ఉపాధ్యక్షుడు లింగారెడ్డి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ గంగారెడ్డి, ఆరెపల్లి మాజీ సర్పంచి అరవిందరావు, పొన్కల్ మాజీ ఉప సర్పంచి నరేశ్రెడ్డితోపాటు మరికొందరు నేతలు హస్తం పార్టీలో చేరారు. నాలుగు రోజుల క్రితం నిర్మల్లో డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు ఆధ్వర్యంలో మంత్రి సీతక్క సమక్షంలో నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ అప్పాల గణేశ్చక్రవర్తి, 12 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
భవిష్యత్తు కోసమంటూ...
అధికార బలం ఉన్న వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువగా కలిసొస్తుందనేది తెలిసిందే. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా.. వచ్చే ఏడాది జనవరి నెలాఖరుతో మున్సిపల్ పాలకవర్గాల గడువు ముగిసిపోతుంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం భారాస ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయడానికి ఆసక్తి చూపిస్తున్న ఆశావహులు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లోనూ భారాస ఎమ్మెల్యేలు ఓడిపోవడంతో రాజకీయంగా రానున్న రోజుల్లో తమకు అవకాశం లేకనే ఆ పార్టీని వీడుతున్నామని భారాస ప్రజాప్రతినిధులు, నాయకులు చెబుతుండటం గమనార్హం. పార్లమెంటు ఎన్నికల సమయంలో చేరికలతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండల కేంద్రంలో భాజపా ఎన్నికల ప్రచారం
[ 09-05-2024]
తాంసి మండల కేంద్రంలో గురువారం భాజపా నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి
[ 09-05-2024]
భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలుగు రాష్ట్రాల జమాతే ఉలేమా ప్రధాన కార్యదర్శి ... -
ప్రతిష్ఠాత్మకం.. ఎంపీ స్థానం..
[ 09-05-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానాన్ని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భాజపా, భారాస ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఓట్లు చీల్చే పార్టీ ఏది? ఆ ఓట్లు ఏపార్టీకి మేలు చేకూరుస్తాయనే అంశం మూడు పార్టీల నేతలను అంతర్మథనానికి గురిచేస్తోంది. -
మూగజీవాల దాహం కేకలు
[ 09-05-2024]
మూగజీవాల దాహార్తి తీర్చాలని గత ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్షలు వెచ్చించి నీటి తొట్టెలు నిర్మించింది. అధికారుల అవగాహన లోపం, పర్యవేక్షణ లేని కారణంగా గుత్తేదారులు -
భాజపాతోనే దేశానికి, ధర్మానికి రక్షణ
[ 09-05-2024]
‘రాహుల్ గాంధీ ప్రధాని అయితే దేశానికి, ధర్మానికి రక్షణ ఉంటుందా? ఒక్కసారి వినండి కాంగ్రెస్ ఓటు జిహాద్కు పాల్పడుతుంది. మనమంతా ఒక్కటి కావాలి’ అంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. -
కొత్త రైస్ మిల్లులకు త్వరలో పచ్చజెండా?
[ 09-05-2024]
పత్తి పరిశ్రమకు పేరుగాంచిన ఆదిలాబాద్లో కొత్తగా రైస్ మిల్లుల ఏర్పాటు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జిల్లాలో వరి సాగు అంతగా లేకున్నా ఈ పరిశ్రమలు ఎలా వస్తున్నాయనే సందేహాలు వ్యక్తమవుతుండగా మరోపక్క కొత్తగా అయిదు -
పంచాయతీ కార్యదర్శులు ఓటేశారు!
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటు వేస్తామో.. లేదో? అన్న ఆందోళనలో ఉన్న పంచాయతీ కార్యదర్శులకు ఊరట లభించింది. వారికి పోస్టల్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు. -
రైలు తలుపు.. మృత్యు పిలుపు
[ 09-05-2024]
కాగజ్నగర్ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ మధ్య తరచూ రైల్వే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కువగా రైళ్ల నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలై మృతిచెందుతున్నారు. బల్లార్ష-దిల్లీ మధ్య నిత్యం ప్రతి అరగంటకు ఒక ప్యాసింజర్, ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లు ప్రయాణిస్తుంటాయి. -
రాజ్యాంగ పరిరక్షణకు ఐక్యంగా సాగాల్సిన సమయమిది
[ 09-05-2024]
‘అధిక సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తామన్న మాటలు వినిపిస్తున్నాయి. ప్రమాదంలో పడుతున్న రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు అంతా ఐక్యంగా సాగాల్సిన సమయం వచ్చిందని..’ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పేర్కొన్నారు. -
వసతులు కరవు.. బతుకు బరువు!
[ 09-05-2024]
ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం, అభివృద్ధి పనులు చేపట్టడంలో పాలకులదే ప్రధాన పాత్ర. అలాంటి వారిని ఎన్నుకునే బాధ్యత ప్రజలది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా పాలకులను ఎన్నుకుంటూ ప్రజలు తమ బాధ్యత నిర్వర్తిస్తున్నారు. -
వృద్ధులు, దివ్యాంగులకు నేరుగా ఓటేసే అవకాశం
[ 09-05-2024]
పెద్దపల్లి పార్లమెంట్ నియోజక వర్గంలో ఈ నెల 13న నిర్వహించే ఎన్నికల కోసం అన్నీ సిద్ధం చేశామని జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్ అన్నారు. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు. -
ప్రాణాలు పోతున్నా పట్టింపు కరవాయే
[ 09-05-2024]
రైతులు తాము పండించిన పంటలు ఆరబెట్టుకునేందుకు ఉపాధి హామీ పథకంలో కల్లాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తున్నా వాటి గురించి అవగాహన లేకనో.. ఎవరు నిర్మించుకోవాలనే నిర్లక్ష్యమో తెలియదు కానీ రహదారులపైనే ఆరబెట్టుకోవడం పరిపాటిగా మారింది. -
వీరికి సార్వత్రిక సమరం.. వారిది ఆక్రమణల పర్వం
[ 09-05-2024]
బెల్లంపల్లి పట్టణంలో ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. కబ్జాలు చేయడానికి ఏ మాత్రం భయపడడం లేదు. ప్రభుత్వ స్థలాలు కనిపిస్తే పాగా వేస్తున్నారు. -
‘కార్పొరేట్ వ్యాపారి.. భూగర్భ కార్మికుడి మధ్య పోరు’
[ 09-05-2024]
తెలంగాణ ఉద్యమంలో ఎక్కడా కనిపించని కార్పొరేట్ వ్యాపారి గడ్డం వంశీకృష్ణకు సింగరేణి కార్మికుడిగా పని చేసిన తనకు మధ్య ఎన్నికల పోరులో ప్రజలు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని పెద్దపల్లి పార్లమెంట్ భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కేఎల్తో సంజీవ్ గోయెంకా సీరియస్ చాటింగ్ .. నెట్టింట హాట్ టాపిక్
-
విజయ్ దేవరకొండ బర్త్డే స్పెషల్.. మూడు సినిమాల అప్డేట్స్ ఇవే..
-
2023-24లో టీసీఎస్ సీఈఓ వేతనం రూ.25 కోట్లు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
శాంపిట్రోడా వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు
-
సందేశ్ఖాలీ ఘటనలో కీలక మలుపు.. టీఎంసీ నేతలపై కేసు వెనక్కి