logo

సీఎం పై దుష్ప్రచారం తగదు

సీఎం రేవంత్ రెడ్డి భాజపాలోకి వెళ్తారని ప్రచారం చేస్తే సహించేది లేదని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు.

Published : 17 Apr 2024 16:50 IST

ఆదిలాబాద్ అర్బన్: సీఎం రేవంత్ రెడ్డి భాజపాలోకి వెళ్తారని ప్రచారం చేస్తే సహించేది లేదని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉన్న భారాస ఆదివాసీలను మోసం చేసిందని విమర్శించారు. ఆగస్టులోగా కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు రుణ మాఫీ చేస్తుందన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ ఛైర్మన్ అడ్డీ బోజారెడ్డి, జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని