ఎండలతో ఉక్కిరిబిక్కిరి
జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో వాతావరణం చల్లబడిందని సంతోషిస్తున్న సమయంలోనే భానుడు తిరిగి భగ్గమంటున్నాడు. రెండు రోజుల్లోనే ఉష్ణోగ్రత అయిదు డిగ్రీలకు పైగా పెరిగింది.
న్యూస్టుడే, ఆదిలాబాద్ వ్యవసాయం : జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో వాతావరణం చల్లబడిందని సంతోషిస్తున్న సమయంలోనే భానుడు తిరిగి భగ్గమంటున్నాడు. రెండు రోజుల్లోనే ఉష్ణోగ్రత అయిదు డిగ్రీలకు పైగా పెరిగింది. సాధారణం కన్నా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో వడగాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. మరో రెండు రోజులు ఉష్ణోగ్రతతో పాటు వడగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఎల్ నినో ప్రభావంతో ఈ సీజన్లో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు ఎక్కువ నమోదవుతున్నాయని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో బుధవారం సగటు ఉష్ణోగ్రత 40 డిగ్రీలు అయినా.. జిల్లాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా కుమురంభీం, మంచిర్యాల జిల్లాలో 44 డిగ్రీలుగా నమోదైంది.
గడప దాటలేక.. ఉక్కపోత తట్టుకోలేక..
జిల్లాలోని పలు ప్రాంతాలు నిప్పుల కుంపటిగా తయారయ్యాయి. ఎండ వేడిమితో ఇంట్లో ఉంటే భరించలేనంతగా ఉక్కపోత. ఫ్యాన్ కింద కూర్చున్న ఉపశమనం లభించడం లేదు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు అసలు బయటకు వెళ్లలేని పరిస్థితి. ఈ సమయంలో గాలిలో తేమ శాతం తగ్గి ఉక్కపోత పెరుగుతోంది. మధ్యాహ్న సమయంలో వాహనదారులు సైతం తమ వాహనాలు చెట్ల కింద నిలిపివేస్తున్నారు. వాతావరణశాఖ లెక్కల మేరకు 45 డిగ్రీలు దాటితే రెడ్ అలర్ట్ ఉంటుంది. అది ఇంకా ప్రమాదకరం. వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఈ ప్రాంతాల్లో భగభగ..
- ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్, బేల, జైనథ్, సిరికొండ, బోథ్, మావల, పిప్పల్ధరి, చెప్రాల, భోరజ్ ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
- కుమురం భీం జిల్లాలో అత్యధికంగా కాగజ్నగర్లో 44.2 డిగ్రీలు నమోదు కాగా తర్వాత కుంచవెల్లి, రెబ్బెన, పెంచికల్పేట్, జుంబుగావ్, తిర్యాణి మండలాల్లో 43 డిగ్రీలకు పైగా నమోదైంది. బెజ్జూరు, కౌటాల, దహెగాం, కెరమెరి మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉంది.
- మంచిర్యాల జిల్లాలో కోటపల్లి మండలం దేవులవాడలో అత్యధికంగా 44 డిగ్రీలు ఉండగా.. చెన్నూరు, కాసిపేట, దండేపల్లి, భీమారం, నస్పూర్, ప్రాంతాల్లో 43 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. హాజీపూర్, జన్నారం, భీమిని ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా నమోదైంది.
- నిర్మల్ జిల్లాలో అత్యధికంగా దస్తూరాబాద్లో 43.2 డిగ్రీలు నమోదు కాగా, వానల్పహాడ్, కడెం, వడ్యాల్, ముజ్గి, ఖానాపూర్, సారంగపూర్, పెద్దూర్, భైంసా, కుభీరు ప్రాంతాల్లో 41 నుంచి 43 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలు నమోదు కావడం కలవరపరుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదవి విరమణ పొందిన ఎస్ఐకి ఘన సన్మానం
[ 30-04-2024]
అదిలాబాద్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తూ మంగళవారం పదవి విరమణ పొందిన జీవీ రమణారెడ్డి, అతని సతీమణి విజయలను ఎస్పీ గౌష్ ఆలం పోలీస్ ముఖ్య కార్యాలయంలో శాలువాలు కప్పి, మిఠాయిలు తినిపించి, బహుమతులు అందజేసి ఘనంగా సత్కరించారు. -
కరాటే బెల్టులు అందజేత
[ 30-04-2024]
జిల్లా కేంద్రం తిలక్ నగర్లోని అరుణోదయ పాఠశాలలో మంగళవారం బాల, బాలికలకు కరాటేలో గ్రేడింగ్ పరీక్ష నిర్వహించారు. -
జహీరాబాద్ లో కాంగ్రెస్ పార్టీదే గెలుపు
[ 30-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్ధి సురేష్ షట్కర్ భారీ మెజారటీ తో గెలవబోతున్నారని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు రాములు నాయక్ ధీమా వ్యక్తం చేశారు. -
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ
[ 30-04-2024]
ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా మంగళవారం బాధ్యతలు చేపట్టిన కే.ప్రభాకర్ రావును జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఆయన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. -
పది ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ
[ 30-04-2024]
అదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పరల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు మంగళవారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. -
జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్ రావు
[ 30-04-2024]
అదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ప్రభాకర్ రావు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. -
లాండ్రీకి తీరిన నీటి సమస్య
[ 30-04-2024]
రిమ్స్లో నిర్వహిస్తున్న ల్యాండ్రీకి నేడు సమస్య పరిష్కారమైంది. -
సాహిత్య సదస్సుపై దాడి ముమ్మాటికీ ఉన్మాద చర్యే
[ 30-04-2024]
ఇటీవల వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన 'లౌకిక విలువలు- సాహిత్యం' అనే సదస్సులో చొరబడి ఫాసిస్ట్ మూకలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ పేర్కొన్నారు. -
వ్యాను బోల్తా పడి.. 20 మందికి గాయాలు
[ 30-04-2024]
గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాను బోల్తాపడడంతో 20 మందికి గాయాలయ్యాయి. -
భారాస ఇంటింటి ప్రచారం
[ 30-04-2024]
తాంసి మండలం పాలోది, జామిడి గ్రామాల్లో మంగళవారం భారాస నాయకులు ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
అగ్రనేతలొస్తున్నారు
[ 30-04-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. అగ్రనేతలు రానుండటంతో ప్రచారం పతాకస్థాయికి చేరుకుంటోంది. -
కాంగ్రెస్కు ఓటేస్తే భవిష్యత్తుకు లేదు గ్యారెంటీ!
[ 30-04-2024]
హస్తం పార్టీకి ఓటు వేస్తే భవిష్యత్తుకు గ్యారెంటీ లేదని, ఉచిత పథకాలు ఉత్తి మాటలేనని భారాస ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. -
పెరుగుతున్న ఎండ.. వసతులుంటేనే అండ
[ 30-04-2024]
రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత కారణంగా లోక్సభ ఎన్నికల నిర్వహణ విషయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. -
దురాశకు పోయి.. దుఃఖానికి చేరువై
[ 30-04-2024]
ప్రభుత్వ ఉద్యోగం.. చాలామందికి తీరని కల. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంతో కష్టపడితే, అదృష్టం కలిసొస్తే తప్ప సొంతమవని జీవితం. -
చోదకుల నిర్లక్ష్యం.. గాలిలో ప్రాణాలు
[ 30-04-2024]
కారణాలు ఏమైనా రహదారులపై సరకు రవాణా వాహనాలు నిర్లక్ష్యంగా నిలుపుతున్నారు. నిద్రమత్తు, అతివేగం, పొగమంచు, తదితర కారణాలతో రహదారిపై నిలిచి ఉన్న వాహనాలను గమనించలేని ప్రయాణికుల వాహనాల చోదకులు వాటిని బలంగా ఢీకొంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. -
ప్రజాప్రతినిధుల తీరు.. నాయకుల బేజారు
[ 30-04-2024]
జిల్లాలో ఇటీవల ఓ ప్రధాన పార్టీ సభ నిర్వహించింది. ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి జనసమీకరణ బాధ్యతను ఆయా వార్డుల బాధ్యులకు అప్పగించారు. ఒక్కొక్కరికి ఒక్కో సంఖ్యను లక్ష్యంగా ఇచ్చి పూర్తి చేయాలని ఆదేశించారు. -
భారాసను గెలిపిస్తేనే హామీల అమలు
[ 30-04-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారాసను గెలిపిస్తేనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలుకు నోచుకుంటాయని పెద్దపల్లి పార్లమెంట్ స్థానం భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
భాజపాకు కలిసొచ్చేనా?
[ 30-04-2024]
పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్నేత పార్టీ మార్పు ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. హైదరాబాద్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సమక్షంలో సోమవారం ఆయన భాజపా తీర్థం పుచ్చుకున్నారు. -
ధనార్జనే ధ్యేయం.. వైద్యం ప్రాణాంతకం
[ 30-04-2024]
రెండ్రోజుల కిందట కాగజ్నగర్లోని నౌగాంబస్తీకి చెందిన నిండు గర్భిణి ప్రసూతి నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఉదయం వెళ్లింది. స్కానింగ్ చేసిన వైద్యులు పురిటిల్లోనే శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు. -
నిబంధనలకు లోబడి ఎన్నికల విధుల నిర్వహణ
[ 30-04-2024]
లోకసభ ఎన్నికల్లో భాగంగా సిర్పూరు, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రక్రియను నిబంధనలకు లోబడి సమర్థంగా నిర్వహించాలని ఆదిలాబాద్ పార్లమెంటు -
ఆదిలాబాద్ బరిలో 12 మంది అభ్యర్థులు
[ 30-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. నామపత్రాల పరిశీలన అనంతరం 13 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. -
కొనసాగుతున్న సార్వత్రిక పరీక్షలు
[ 30-04-2024]
ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల, బెల్లంపల్లి డివిజన్ కేంద్రాల్లో 8 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలను విద్యాశాఖ నిర్వహిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
సేల్స్ తగ్గాయన్న ఫ్రస్ట్రేషన్.. సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై వేటు వేసిన మస్క్
-
కెనడాలో విదేశీ విద్యార్థులకు నిరాశ.. ఇక వారానికి గరిష్ఠంగా 24 గంటలే పని!
-
అమిత్ షా నకిలీ వీడియోల కేసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ అరెస్టు
-
భార్య దారుణ హత్య.. భారతీయుడికి జీవిత ఖైదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
టీ20 ప్రపంచకప్.. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు ఇవే..