సంపూర్ణ అక్షరాస్యతకు.. నవభారత!
నిరక్షరాస్యులైన వయోజనులందరినీ వచ్చే అయిదేళ్లలో అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో భారత ప్రభుత్వం నూతనంగా నవభారత సాక్షరత (న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
జూన్ నుంచి వయోజనుల సర్వతో ముఖాభివృద్ధి కార్యక్రమం
ఉమ్మడి జిల్లాలో 4,72,525 మంది లక్ష్యం
న్యూస్టుడే, ఆసిఫాబాద్ అర్బన్
నవ భారత సాక్షరతపై కుమురం భీం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన సమన్వయ సమావేశం
నిరక్షరాస్యులైన వయోజనులందరినీ వచ్చే అయిదేళ్లలో అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో భారత ప్రభుత్వం నూతనంగా నవభారత సాక్షరత (న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 15ఏళ్లు పైబడిన నిరక్షరాస్యులను లక్ష్యంగా పెట్టుకొని అయిదు దశల్లో వారికి శిక్షణనిచ్చి అక్షరాస్యులుగా తీర్చిదిద్దడంతో పాటు నైపుణ్యంతో స్వయం ఉపాధి పొందే శక్తిమంతులుగా మార్చడం ఈ కార్యక్రమ ఉద్దేశంగా భారత మానవ వనరుల అభివృద్ధిశాఖ ప్రకటించింది. ఇందుకోసం కేంద్రం 60శాతం, రాష్ట్రాలు 40శాతం నిధులు వెచ్చించనున్నాయి. ఉమ్మడి జిల్లాలో వచ్చే జూన్ నుంచి ఇది అమలు కానుంది. నాలుగు జిల్లాల్లో 4,72,525 మంది నిరక్షరాస్యుల కోసం ఈ కార్యక్రమ ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇందుకోసం నాలుగు జిల్లాల్లోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశాలు నిర్వహించారు.
జాతీయ నూతన విద్యా విధానం-2020 ప్రకారం.. వచ్చే అయిదేళ్లలో నవ భారత సాక్షరత కార్యక్రమం ద్వారా దేశం సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలన్నది లక్ష్యం. వయోజన విద్యలో 2018వరకు నిర్వహించిన సాక్షర భారత్ కార్యక్రమానికి భిన్నంగా వ్యక్తి సర్వతో ముఖాభివృద్ధి కోసం నూతన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. లక్ష్యాన్ని అయిదు దశల్లో పూర్తి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. వంద రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు బోధనాభ్యసన సామగ్రి సిద్ధం చేస్తున్నారు.
అమలు తీరు..
ఈ కార్యక్రమం పూర్తిగా స్వచ్ఛందంగా ముందుకొచ్చే స్థానిక వాలంటీర్ల ద్వారా అమలు కానుంది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు ఉపాధ్యాయుల సహకారంతో వాలంటీర్ల ద్వారా వయోజనులకు సాయంత్రం వేళల్లో అక్షరాస్యత అందించనున్నారు. స్థానిక భాషల్లో ఉపాధ్యాయ శిక్షణ పొంది ఉన్న యువత, ఉన్నత విద్యావంతులను ప్రేరేపించి వాలంటీర్లుగా ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయనున్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతోనూ ఈ కార్యక్రమాన్ని బలోపేతం చేయనున్నారు. లక్ష్యాన్ని అయిదేళ్లలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. మొదటి ఏడాది నిరక్షరాస్యులు అధికంగా ఉన్న గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.
నేర్పించే అంశాలు..
- ఎంపిక చేసిన నిరక్షరాస్యులకు మొదటి దశలో (ఫౌండేషనల్ లిటరసీ) రాయడం, చదవడం, చిన్నచిన్న లెక్కలు చేయడం నేర్పిస్తారు. వంద రోజుల్లో నేర్పించి 150 మార్కులతో తుది పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణత సాధించిన వారికి ధ్రువ పత్రాలు ఇస్తారు.
- రెండో దశలో క్రిటికల్ లైఫ్ స్కిల్స్లో భాగంగా ఆర్థిక అవగాహన, డిజిటల్ లిటరసీ, లీగల్ లిటరసీలపై శిక్షణనిస్తారు. ఆరోగ్యం రక్షణ, పిల్లల పోషణ, విద్య, కుటుంబ సంక్షేమంపై అవగాహన కల్పిస్తారు.
- మూడో దశలో బేసిక్ ఎడ్యుకేషన్గా 3-5 తరగతుల ప్రాథమిక విద్య, 6-8 తరగతులు మాధ్యమిక విద్య, 9-12 తరగతుల సెకండరీ విద్యనందించేందుకు చర్యలు తీసుకోనున్నారు.
- నాలుగో దశలో వత్తి నైపుణ్యాలు పెంపొందించే శిక్షణనిచ్చి, స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.
- అయిదో దశలో వీరితో స్వయం సహాయక సంఘాల కూర్పు, స్వచ్ఛంద గ్రూపుల ఏర్పాటు, వివిధ సంస్థలు ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చెందేందుకు అవకాశం కల్పించడం
జీవిత పాఠాలు సైతం..
ఎ.శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటి డైరెక్టర్ వయోజన విద్య, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన నవభారత్ సాక్షరత కార్యక్రమం నిరక్షరాస్య వయోజనులకు ఎంతో మేలు చేయనుంది. వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే కాకుండా జీవన నైపుణ్యాలను నేర్పి ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. జూన్ నుంచి ఉమ్మడి జిల్లాలో అమలు కానుంది. స్థానికంగా ఉండే విద్యావంతులైన వాలంటీర్ల ద్వారా ఈ కార్యక్రమం అమలు చేస్తాం. ఇందుకోసం పాఠ్యపుస్తకాలు, బోధనాభ్యసన పరికరాలను సిద్ధం చేస్తున్నారు. పాఠ్యపుస్తకంలో 124 పేజీల్లో 16పాఠ్యాంశాలను చేర్చారు. అందరి సహకారం కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. అన్ని జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశాలు పూర్తయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బైండోవర్ ఉల్లంఘన కేసుల్లో తాఖీదులు
[ 30-04-2024]
బైండోవర్ ఉల్లంఘన కేసుల్లో నిందితులు రూ.ఒక లక్ష చొప్పున చెల్లించాలని మావల తహసీల్దార్ తాఖీదులు జారీ చేశారు. -
పదవి విరమణ పొందిన ఎస్ఐకి ఘన సన్మానం
[ 30-04-2024]
అదిలాబాద్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తూ మంగళవారం పదవి విరమణ పొందిన జీవీ రమణారెడ్డి, అతని సతీమణి విజయలను ఎస్పీ గౌష్ ఆలం పోలీస్ ముఖ్య కార్యాలయంలో శాలువాలు కప్పి, మిఠాయిలు తినిపించి, బహుమతులు అందజేసి ఘనంగా సత్కరించారు. -
కరాటే బెల్టులు అందజేత
[ 30-04-2024]
జిల్లా కేంద్రం తిలక్ నగర్లోని అరుణోదయ పాఠశాలలో మంగళవారం బాల, బాలికలకు కరాటేలో గ్రేడింగ్ పరీక్ష నిర్వహించారు. -
జహీరాబాద్ లో కాంగ్రెస్ పార్టీదే గెలుపు
[ 30-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్ధి సురేష్ షట్కర్ భారీ మెజారటీ తో గెలవబోతున్నారని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు రాములు నాయక్ ధీమా వ్యక్తం చేశారు. -
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ
[ 30-04-2024]
ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా మంగళవారం బాధ్యతలు చేపట్టిన కే.ప్రభాకర్ రావును జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఆయన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. -
పది ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ
[ 30-04-2024]
అదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పరల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు మంగళవారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. -
జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్ రావు
[ 30-04-2024]
అదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ప్రభాకర్ రావు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. -
లాండ్రీకి తీరిన నీటి సమస్య
[ 30-04-2024]
రిమ్స్లో నిర్వహిస్తున్న ల్యాండ్రీకి నేడు సమస్య పరిష్కారమైంది. -
సాహిత్య సదస్సుపై దాడి ముమ్మాటికీ ఉన్మాద చర్యే
[ 30-04-2024]
ఇటీవల వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన 'లౌకిక విలువలు- సాహిత్యం' అనే సదస్సులో చొరబడి ఫాసిస్ట్ మూకలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ పేర్కొన్నారు. -
వ్యాను బోల్తా పడి.. 20 మందికి గాయాలు
[ 30-04-2024]
గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాను బోల్తాపడడంతో 20 మందికి గాయాలయ్యాయి. -
భారాస ఇంటింటి ప్రచారం
[ 30-04-2024]
తాంసి మండలం పాలోది, జామిడి గ్రామాల్లో మంగళవారం భారాస నాయకులు ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
అగ్రనేతలొస్తున్నారు
[ 30-04-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. అగ్రనేతలు రానుండటంతో ప్రచారం పతాకస్థాయికి చేరుకుంటోంది. -
కాంగ్రెస్కు ఓటేస్తే భవిష్యత్తుకు లేదు గ్యారెంటీ!
[ 30-04-2024]
హస్తం పార్టీకి ఓటు వేస్తే భవిష్యత్తుకు గ్యారెంటీ లేదని, ఉచిత పథకాలు ఉత్తి మాటలేనని భారాస ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. -
పెరుగుతున్న ఎండ.. వసతులుంటేనే అండ
[ 30-04-2024]
రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత కారణంగా లోక్సభ ఎన్నికల నిర్వహణ విషయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. -
దురాశకు పోయి.. దుఃఖానికి చేరువై
[ 30-04-2024]
ప్రభుత్వ ఉద్యోగం.. చాలామందికి తీరని కల. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంతో కష్టపడితే, అదృష్టం కలిసొస్తే తప్ప సొంతమవని జీవితం. -
చోదకుల నిర్లక్ష్యం.. గాలిలో ప్రాణాలు
[ 30-04-2024]
కారణాలు ఏమైనా రహదారులపై సరకు రవాణా వాహనాలు నిర్లక్ష్యంగా నిలుపుతున్నారు. నిద్రమత్తు, అతివేగం, పొగమంచు, తదితర కారణాలతో రహదారిపై నిలిచి ఉన్న వాహనాలను గమనించలేని ప్రయాణికుల వాహనాల చోదకులు వాటిని బలంగా ఢీకొంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. -
ప్రజాప్రతినిధుల తీరు.. నాయకుల బేజారు
[ 30-04-2024]
జిల్లాలో ఇటీవల ఓ ప్రధాన పార్టీ సభ నిర్వహించింది. ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి జనసమీకరణ బాధ్యతను ఆయా వార్డుల బాధ్యులకు అప్పగించారు. ఒక్కొక్కరికి ఒక్కో సంఖ్యను లక్ష్యంగా ఇచ్చి పూర్తి చేయాలని ఆదేశించారు. -
భారాసను గెలిపిస్తేనే హామీల అమలు
[ 30-04-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారాసను గెలిపిస్తేనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలుకు నోచుకుంటాయని పెద్దపల్లి పార్లమెంట్ స్థానం భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
భాజపాకు కలిసొచ్చేనా?
[ 30-04-2024]
పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్నేత పార్టీ మార్పు ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. హైదరాబాద్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సమక్షంలో సోమవారం ఆయన భాజపా తీర్థం పుచ్చుకున్నారు. -
ధనార్జనే ధ్యేయం.. వైద్యం ప్రాణాంతకం
[ 30-04-2024]
రెండ్రోజుల కిందట కాగజ్నగర్లోని నౌగాంబస్తీకి చెందిన నిండు గర్భిణి ప్రసూతి నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఉదయం వెళ్లింది. స్కానింగ్ చేసిన వైద్యులు పురిటిల్లోనే శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు. -
నిబంధనలకు లోబడి ఎన్నికల విధుల నిర్వహణ
[ 30-04-2024]
లోకసభ ఎన్నికల్లో భాగంగా సిర్పూరు, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రక్రియను నిబంధనలకు లోబడి సమర్థంగా నిర్వహించాలని ఆదిలాబాద్ పార్లమెంటు -
ఆదిలాబాద్ బరిలో 12 మంది అభ్యర్థులు
[ 30-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. నామపత్రాల పరిశీలన అనంతరం 13 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. -
కొనసాగుతున్న సార్వత్రిక పరీక్షలు
[ 30-04-2024]
ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల, బెల్లంపల్లి డివిజన్ కేంద్రాల్లో 8 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలను విద్యాశాఖ నిర్వహిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
వరుణుడి అడ్డంకి.. బంగ్లాదేశ్పై భారత్ విజయం
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఎమ్మార్ కేసులో తీర్పు
-
ఇదే మా రిలేషన్షిప్ సీక్రెట్: జ్యోతిక
-
‘ఆ వీడియోలు నేనే ఇచ్చా’.. ప్రజ్వల్ మాజీ డ్రైవర్